రూ.5 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్‌ | Encroachment of government land in Doravarisatram mandal Tirupati district | Sakshi
Sakshi News home page

రూ.5 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్‌

Oct 10 2025 5:25 AM | Updated on Oct 10 2025 5:25 AM

Encroachment of government land in Doravarisatram mandal Tirupati district

అధికార పార్టీ నాయకుల ఆక్రమణల పర్వం

పట్టపగలే ఆక్రమించి సాగుకు అనువుగా చేసిన వైనం

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో ఘటన

దొరవారిసత్రం: తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని నెలబల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక అధికార టీడీపీ నేతలు చెరబట్టారు. ఎకరం రూ.50 లక్షలు విలువచేసే సుమారు పదెకరాల భూముని చదునుచేసి సాగుకు అనువుగా మార్చుకున్న ఘటన గురు­వారం వెలుగులోకి వచ్చింది. వివరాలివీ..

నెలబల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబ­రు 7లో 71 ఎకరాల భూమిలో బీసీ, ఎస్సీ కాలనీలు, వివిధ ప్రభుత్వ భవనాలు, పాఠ­శాల నిర్మాణాలకు పోనూ రహదారి వెంబడే 20 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డుపక్క భూములు ఎక­రా రూ.50 లక్షల వరకు ధర పలుకు­తున్నాయి. గతంలో ఈ భూముల దురాక్రమ­ణను అప్పటి రెవెన్యూ అధికారులు గుర్తించి పీఓబీ (ప్రొహిబిటెడ్‌ ఆర్డర్‌ బుక్‌)లో నమోదు చేశారు. అయినా ఐదెకరాలు వరకు ఆక్రమణకు గురైంది. 

నాలుగు నెలలు కిందట సూ­ళ్లూరుపేట నియోజ­క­వర్గంలోని మాజీ ప్రజా­­ప్రతినిధి కను­సన్నల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు సుమారు పదె­కరాల భూమిని ఆక్ర మించేందుకు ప్రయ­త్నం చేశారు. రెవెన్యూ అధికా­రు­లు ఇది గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. 

మళ్లీ అదే మాజీ ప్రజాప్రతి­నిధి సహకారం, సూచనలతో మూడ్రోజుల నుంచి పట్టపగలే పీఓబీ కింద ఉన్న పదెకరాల ప్రభుత్వ భూమిని యంత్రా­ల­తో హద్దులు నిర్ణయించి ట్రాక్టర్లతో దున్ని సాగు­కు అనువుగా మార్చు­కుంటు­న్నారు. ఈ దం­దాలో సూళ్లూరు­పేట నియోజకవర్గం మాజీ ప్రజాప్రతినిధికి కూడా వాటా ఉన్నట్లు ఆరోపణలు వస్తు­న్నాయి. రెవెన్యూ అధికా­రులు తెలిసినా చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement