
సెమీస్కు జూనియర్ మహిళల హాకీ జట్టు
ధర్మవరం: భీమవరంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్కు చేరిందని హాకీ జిల్లా ప్రధానకార్యదర్శి సూర్యప్రకాష్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్ హసేన్ తెలిపారు. జిల్లా మహిళల హాకీ జట్టు క్రీడాకారులు శనివారం నెల్లూరు జిల్లా జట్టుపై 11–0 గోల్స్ తేడాతో గెలుపొందారు. జట్టులో నసీమా మూడు గోల్స్, నవ్యశ్రీ మూడు గోల్స్, మాధురి బాయి రెండు గోల్స్, పవిత్ర, వైష్ణవి, వర్ష ఒక్కొక్క గోల్ వేసి రెండో విజయాన్ని కై వసం చేసుకున్నారు. మధ్యాహ్నం మూడో లీగ్ మ్యాచ్లో తిరుపతి జిల్లాతో 3–1 గోల్స్ తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్కు చేరుకున్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా జట్టుతో తలపడనుందని తెలిపారు. క్రీడాకారుల వెంట మేనేజర్ అరవింద్గౌడ్, కోచ్ మారుతికుమార్ ఉన్నారు.