
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.
అపార్ ఐడీ అనివార్యం
అనంతపురం: ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు దోహదపడినట్లే.. ప్రతి విద్యార్థికీ అపార్ ఐడీ అనివార్యమని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ రీజనల్ నోడల్ ఆఫీసర్ రవి పాండ్య అన్నారు. అపార్ ఐడీ రూపకల్పనపై ఉన్నత విద్యామండలి, యూజీసీ సహకారంతో జేఎన్టీయూ అనంతపురంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి రీజనల్ నోడల్ ఆఫీసర్ రవి మాట్లాడుతూ విద్యార్థుల సర్టిఫికెట్లు, మార్క్స్ మెమోలు భద్రపరిచేందుకు అపార్ ఐడీ దోహదపడుతుందన్నారు. ఇందులో ఎల్కేజీ నుంచి పీహెచ్డీ వరకు విద్యార్థికి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికెట్లు, స్టడీ, ట్రాన్స్ఫర్, మైగ్రేషన్ సర్టిఫికెట్, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు ఇలా ఎన్నో రకాల సర్టిఫికెట్లు భద్రపరచుకోవడానికి వీలు పడుతుందన్నారు. రాయలసీమ పరిధిలోని అన్ని యూనివర్సిటీల కోర్డినేటర్లు, జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఉన్న 120 కళాశాలల ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి అధికారులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ జీడీ రాజేందర్, జేఎన్టీయూ అనంతపురం ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ అంకారావు, డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.