
ఈసారీ అప్పులు తప్పవేమో!
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
రబీ సీజన్ ముగిసి, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు రూపాయి సాయం కూడా అందలేదు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకూ రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని గత ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా నేటికీ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో పంటల పెట్టుబడి కోసం ఈ సారి కూడా అప్పులు తప్పేలా లేవు.
– చెన్నారెడ్డి, రైతు,
జంబులదిన్నె, గార్లదిన్నె మండలం