
పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర పోస్టర్ విడుదల
అనకాపల్లి టౌన్: దివ్యాంగులకు పారా స్పోర్ట్స్తో మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.అసయ్య తెలిపారు. స్థానికంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ క్రీడాకారులతో సమానంగా పారా క్రీడాకారులకు గౌరవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గనిరెడ్డి రాము, తదితరులు పాల్గొన్నారు.