
తూట్లు...
● అటకెక్కిన ‘అన్నదాతా.. సుఖీభవ’ ● మొక్కుబడిగా ఆర్బీకేల పనితీరు ● ఎరువులు, విత్తనాలు అందని పరిస్థితి ● మూలకు చేరిన కియోస్క్ మిషన్లు ● పాత పద్ధతిలోనే గ్రామానికి విత్తనాలు సరఫరా చేసేలా ప్రతిపాదన
ఆశయానికి
రైతులకు
అగచాట్లు
రైతన్నకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. ‘అన్నదాతా.. సుఖీభవ’ పేరిట పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చి, రెండేళ్లు మొండి చేయి చూపింది. వ్యవసాయ సేవలను అత్యంత చేరువలో గ్రామంలోనే అందించే ఆర్బీకేలు ఇప్పుడు మొక్కుబడిగా సాగుతున్నాయి. సేవలు పూర్తిగా అందివ్వకపోగా వాటిని కుదించి, మూడు గ్రామాలకు ఒక కేంద్రాన్ని పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదేగాని జరిగితే వ్యవసాయం, పశు సంవర్థక, ఫిషరీస్ సేవలు రైతులకు మరింత దూరమయ్యే అవకాశం ఉంది.
కియోస్క్ మిషన్ ఎక్కడ?
మాది లక్ష్మీపురం గ్రామం. నాకు రెండెకరాల పొలం వుంది. ఖరీఫ్ సీజన్లో వరి వేస్తాను. మాది ముంపు ప్రాంతం కావడంతో ఎక్కు వగా వరిలో ఆర్జీఎల్ రకం విత్తనం వేస్తాము. గతేడాది వరకు మాకు నచ్చిన విత్తనం, ఎరువులు మిషన్లో నమోదు చేసుకునేవాడిని. ఎరువులు కూడా కియోస్క్ మిషన్లో నమోదు చేసుకునేవాడిని. నా పేరున నాకు ఏమి కావాలో అది నమోదయ్యేది. ఈసారి అలా చేయలేదు. విత్తనాలు వచ్చాక ఏవి ఉంటే అవి తీసుకోవాలట.
–బలిరెడ్డి కాసు, రైతు, లక్ష్మీపురం
సూచనలు
అందడం లేదు
మా ఊరి రైతు భరోసా కేంద్రంలో ఇంతకు ముందులా రోజూ టీవీ వేసి ఉండకపోవడంతో వ్యవసాయ సూచనలు తెలుసుకోవడం ఇబ్బందిగా ఉంది. నేను వరి, చెరకు పండిస్తాను. ఇంతకు ముందు మాకు విత్తనాలు కావాలంటే మిషన్లో నమోదు చేసుకునేవాళ్లం. ఇప్పుడు అలా లేదట. మిషన్ను పక్కన పెట్టేశారు. వరి, చెరకు పంటల్లో తెగుళ్లు, ఇంకా ఏమైనా వ్యవసాయ సూచనలు కావాలంటే టీవీలో చూసి తెలుసుకునేవాడిని. ఇప్పుడు చెప్పేవారు లేరు.
– కరక తలుపులయ్య, రైతు,
చాకిపల్లి, రామజోగిపాలెం
చోడవరం: వ్యవసాయ సేవలు, విత్తనాలు, ఎరు వుల కోసం మండల కేంద్రాలకు వెళ్లి రోజుల తరబ డి వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు పడిన నాటి చీకటి రోజులు రైతులకు గుర్తొస్తున్నాయి. వారికి ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించి, గ్రామంలోనే వ్యవసాయ సేవలన్నీ అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే)లను తెచ్చింది. ఆ వ్యవస్థలో ఏకంగా సుమారు రూ.50 లక్షల వ్యయంతో ఆర్బీకేలకు సొంత భవనాలు నిర్మించడంతోపాటు కుర్చీ లు, కంప్యూటర్, టేబుళ్లు, పుస్తకాల రేక్లు సమకూర్చారు. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, శాస్త్రవేత్తల సూచనలు అందుకొని, విజ్ఞానాన్ని పొందేందుకు స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విత్తనాలు, ఎరువులు పొందేందుకు కియోస్క్ మిషన్లు కూడా నెలకొల్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఆర్బీకేల్లో సేవలు అరకొరగానే రైతులకు అందుతున్నాయి. ఏడాది నుంచి కరెంటు బిల్లులు చెల్లించలేదు. ఏ రోజు విద్యుత్ కనెక్షన్ తొలగిస్తారో తెలీని పరిస్థితి.. ఇంటర్నెట్ సామర్ధ్యం తగ్గించడంతో ఆన్లైన్ సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు.
‘భరోసా’ దక్కలేదు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పేరిట అందించిన పెట్టుబడి సాయం స్థానంలో కూటమి ప్రభుత్వం ‘అన్నదాతా.. సుఖీభవ’ను ప్రవేశపెడతా మని చెప్పింది. గతంలో రూ.13.500 ఇస్తే.. ఇప్పు డు రూ.20 వేలు అందిస్తామని డంబాలు పలికింది. కానీ గత ఏడాది, ఈ ఏడాది రెండేళ్లు ఆర్థిక సాయం అందించలేదు సరికదా ఇంతవరకు కనీసం విధివిధానాలను రూపొందించలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని పండగలా మార్చిందని వారు గుర్తుచేసుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అమలు చేశారని, కౌలు రైతులతో సహా ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేశారని పేర్కొన్నారు.
ఆర్బీకేల్లో ఎన్నో సేవలు
జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజన్లో 2 లక్షల 20 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. ఇవి కాక అపరాలు, చెరకు, ఇతర వాణిజ్య పంటలు కూడా వేలా ది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 23 వేల 300 మెట్రిక్ టన్నుల వరి విత్తనాలు కావాలని ప్రతిపాదన పెట్టారు. 33 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా కావాలని ప్రతిపాదన పంపించారు. అయితే ప్రతిపాదనలు ఆర్బీకేల ద్వా రా జరగలేదు. వ్యవసాయాధికారుల అంచనాల మేరకు ప్రతిపాదన పెట్టారు. గతేడాది వరకు రైతు లకు ఏ రకం వరి విత్తనం అవసరం, ఏ సమయంలో ఏ ఎరువు అవసరమో నేరుగా రైతే పాసుపుస్త కం పట్టుకొని ఆర్బీకేలకు వెళ్లి అక్కడ కియోస్క్ మిషన్లో స్వయానా నమోదు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆర్బీకేల్లో ఆ పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కియోస్క్ మిషన్లను నిరుపయోగంగా పక్కన పెట్టేసింది. పాత పద్ధతిలో రైతులకు కావలసినవి ఆర్బీకేలో ఉన్న సిబ్బందికి చెబితే వారు నమోదు చేసుకొని మొత్తం ఇండెంట్ను ప్రతిపాదనకు పంపుతున్నారు. దీనివల్ల పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువులు సరఫరా కాకపోతే రైతులందరికీ అవి అందే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏ రకం విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తే వాటినే రైతులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక రైతుల విజ్ఞానం కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీల వినియోగం కూడా పూర్తిగా లేదు. ఏదో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే వ్యవసాయ కార్యక్రమాలు వచ్చినప్పుడు మాత్రమే టీవీలు ఆన్ చేస్తున్నారు. మిగతా సమయాల్లో రైతులకు అవసరమైన వ్యవసాయ సూచనలు తెలుసుకునే పరిస్థితి లేదు. అదే గతంలో ఉదయం నుంచీ సాయంత్రం వరకు టీవీలు ఆన్ చేసి వివిధ చానల్స్, ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవసాయ కార్యక్రమాలన్నీ నిరంతరం చూసేందుకు వీలుండేది. రైతులకు సమయం దొరికినప్పుడు ఆర్బీకేలకు వచ్చి ఆ వ్యవసాయ సూచనలు తెలుసుకొని విజ్ఞానంతో వ్యవసాయం చేసుకునేవారు. ఇప్పుడు వ్యవసాయ సిబ్బంది సూచనలు చెబితే తప్ప వ్యవసాయంలో నష్టాలను టీవీలో చూసి నివారించుకునే అవకాశం లేకుండా పోయింది.

తూట్లు...

తూట్లు...

తూట్లు...

తూట్లు...

తూట్లు...