
300 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
నక్కపల్లి: రేషన్ డిపోల ద్వారా తెల్లకార్డుదారులకు పౌరసరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. మండలంలోని జానకయ్యపేటలో తెల్లకార్డుదారుల నుంచి కారు చౌకగా కొనుగోలు చేసి రైసు మిల్లులకు ఆటోలో తరలిస్తున్న 300 కిలోల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జానకయ్యపేటలో ఆటోలో బియ్యం తరలిస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. జానకయ్యపేట, సిహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, చినతీనార్ల తదితర చుట్టుపక్కల గ్రామాల్లో కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆటో డ్రైవర్ తెలిపాడని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. కిలో రూ.18ల చొప్పున కొని అధిక ధరకు రైసు మిల్లర్లకు విక్రయిస్తుంటామని డ్రైవర్ చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లయిస్ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడ్డ బియ్యం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.75 వేలు ఉంటుంది.