పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 6 2025 12:41 AM | Updated on Jun 6 2025 12:41 AM

పర్యా

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

చోడవరం: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి పి.రాజారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం చోడవరం కోర్టుల ఆవరణలో మొక్కలు నాటారు. అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి పి.రాజారావు , ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.స్వర్ణ మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ అప్పలరాజు, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చీపురుపల్లి సూర్యనారాయణ, ఎస్‌.భవానీశంరరావు, వి.వెంకట్రావు, పైడిరాజు, వారాది రాజు, చందు, పీవీ రమణమూర్తి పాల్గొన్నారు. గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ ఆవరణలో మొక్కలు నాటారు. ఎండీ సన్యాసినాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఆవరణతోపాటు చెరకు కాటాల వద్ద, పలు పాఠశాలల్లోనూ, గోవాడ, అంబేరుపురం గ్రామాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ సీసీ ప్రసాద్‌, సీఏఓ ఎస్‌ఎల్‌ సత్యనారాయణ, సీఈ పి.ప్రసాదరావు, సీడీఓ రామం, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, పీఏ రవి, యూనియన్‌ నాయకులు భాస్కరరావు, రామునాయుడు పాల్గొన్నారు. చోడవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్‌ కె. మన్మథరావు, ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, సబ్‌ రిజిస్ట్రార్‌ గీతాలక్ష్మి పాల్గొని మొక్కలు నాటారు. పాస్టిక్‌ వస్తువులు పూర్తిగా వాడకం మానేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణాన్ని పరిరక్షించాలని జిల్లా రిజిస్ట్రార్‌ మన్మథరావు, ఎమ్మెల్యే రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మాడుగుల సబ్‌ రిజిస్ట్రార్‌ పురుషోత్తమ్‌, గోవాడ సుగర్స్‌ మాజీ చైర్మన్‌ గూనూరు మల్లునాయుడు, ఈఓపీఆర్‌డి మహేష్‌, పంచాయతీ ఈఓ నారాయణరావు, పాల్గొన్నారు.

మానవ మనుగడకు చెట్లు కీలకం

అనకాపల్లి టౌన్‌ : మానవ మనుగడలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. గవరపాలెం జీవీఎంసీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులు, ఉపాధాయులు పుట్టిన రోజుల సందర్భంగా మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి పదో అదనపు జిల్లా జడ్జి నరేష్‌ పాల్గొని మొక్కలను నాటారు.

పలుచోట్ల మొక్కలు నాటిన అధికారులు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత 1
1/1

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement