
కారుకు నిప్పు అంటించిన దుండగులు
నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి శారదనగర్లో నివాసం ఉంటున్న జర్నలిస్టు ఈశ్వరరావు కారుకు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి దుండగులు ఈ సంఘటనకు పాల్పడ్డారు. తను నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న రోడ్డుపై పార్కింగ్ చేశాడు. పెట్రోల్ పోసి కారుకు నిప్పు అంటించారు. మంటలు ఒక్కసారిగా ఎగిసి పడడంతో ఈఽశ్వరరావు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసి వెనుతిరిగారు. అందరూ వెళ్లిపోగా మరలా దుండగులు కారుకు నిప్పు అంటించారు. దీంతో కారు మొత్తం దగ్ధమైంది. బాధితుడు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.