
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
రోలుగుంట : మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజానికి మేలు జరుగుతుందని అటవీశాఖ చోడవరం రేంజర్ జగదీష్ అన్నారు. రావికమతం మండలం మరుపాక నర్సరీ నుంచి పలు జాతుల మామిడి, నేరేడు, వేప,రావి తదితర 150 మొక్కలను బుధవారం ఆయన స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల సిబ్బందికి అందజేశారు. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి మొక్కలు పెంపకం చేపడుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ మొక్కలు నాటాలి, పొలాల్లో, చెరువు గట్లపై రైతులు ఏఏ మొక్కలు నాటాలో తెలియజేశారు. పచ్చదనం, వన వృక్షాల అభివృద్ధితోనే ఆశించిన వర్షాలు పడతాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గోవింద, నాయకులు బంటు రాజు, ఈ కాంప్లెక్సు సీఆర్పీ సతీ్ష్, వివిధ గ్రామాల జెడ్పీ ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, రైతులు పాల్గొన్నారు.
చోడవరం అటవీశాఖ రేంజర్ జగదీష్