
పరిహారం ఇచ్చి ఆదుకోండి..
భవన నిర్మాణ కాంట్రాక్టర్ నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన తాపీమేస్త్రి వేములపూడి వరహాలు కోరారు. చేతికర్ర సాయంతో కలెక్టరేట్కు చేరుకున్న ఆయన అధికారులకు తన గోడు వినిపించుకున్నాడు. విరోదిలు చిన్నా అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తూ జనవరిలో రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి గాయాలపాలయ్యానని, ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నప్పటికి కాంట్రాక్టర్, భవన యాజమాని గానీ పట్టించుకోలేదని ఆయన ఆరోపించాడు. ఏప్రిల్లో కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు చేశానని, ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ కలెక్టర్ను కలిసి తన బాధను చెప్పుకుందామని వస్తే.. కిందనే సమస్య అడిగి పంపిచేస్తున్నారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరారు.