
టెన్త్ టాపర్ వర్షిణికి వాసవీ వనితా క్లబ్ సత్కారం
రోలుగుంట: పదో తరగతి మండల టాపర్ అయిన అదపురెడ్డి వర్షినిని వాసవీ వనిత క్లబ్ చార్టర్ ప్రెసిడెంటు నాగజ్యోతి తదితరులు సోమవారం ఘనంగా సత్కరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు భవన్ నిర్మాత పిరాట్ల నర్సింహం, వాసవీ క్లబ్, వాసవీ వనిత క్లబ్ సంయుక్తంగా జిల్లాస్థాయిలో మండల టాపర్లు అయిన అధిక మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులకు అనకాపల్లి ప్రభుత్వ పాఠశాలలో అభినందన సత్కార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక మార్కులు సాధించి 11 మండలాల నుంచి పాల్గొన్న టాపర్స్కి జ్ఞాపికలు, బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. వర్షిణి రోలుగుంట కేజీబీవీలో చదివి 570 మార్కులు సాధించింది. ఈ కార్యక్రమం నిర్వహణలో భాగస్వామి, రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచర్, వాసవీ వనిత క్లబ్ చార్టర్ ప్రెసెడెంటు నాగజ్యోతి మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత స్థితికి ఉపాధ్యాయుల సమష్టి కృషి, విద్యార్ధుల తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఓరుగంటి నాగమణి, టీడీపీ అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము, జనసేన నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీ, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.