
పేరు అబద్ధంకబ్జా నిజం!
● భూముల విలువ రూ. 50 కోట్ల పైమాటే! ● పంట నష్టపరిహారం, బీమా సైతం కాజేత ● ప్రశ్నిస్తే హోం మంత్రి పేరుతో బెదిరింపులు
మోసగించి కాజేశారు..
ఈ భూములను సాగు చేసుకునేందుకు మా పూర్వీకులకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. వెంకటాపురం గ్రామానికి చెందిన ‘అబద్ధం’ అనే టీడీపీ నాయకుడు, జగన్మోహన్రావు అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేసి భూములను లాక్కున్నారు. ఒక్క పైసా లీజు ఇవ్వకపోగా పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారు. వారి ఆగడాలకు తట్టుకోలేక ఏం చేయాలో తోచక భయంతో జీవిస్తున్నాం. మా దగ్గర పట్టాలు ఉన్నాయి.
–తంతట సూర్యారావు, వెంకటాపురం, ఎస్.రాయవరం మండలం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
పేరులోనే కాదు అక్రమ వ్యవహారాల్లోనూ ఓ టీడీపీ నేత సార్థక నామధేయుడినని నిరూపించుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలం టీడీపీ నేత అమలకంటి అబద్ధం హోంమంత్రి అనితకు ముఖ్య అనుచరుడు. దళిత వర్గానికి చెందిన అనిత హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఆమె అనుచరుడు మాత్రం నిరుపేద దళితుల భూములను ఆక్రమించి దర్జాగా సాగు చేసుకోవడం గమనార్హం. తమ తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న డీ పట్టా భూములను ఆక్వా సాగు పేరుతో లీజుకు తీసుకుని అనిత ముఖ్య అనుచరుడు కాజేశారని బాధితులు వాపోతున్నారు. రూ.50 కోట్ల విలువ చేసే 103 ఎకరాల భూముల రికార్డులను విశాఖ ఆక్వాఫారానికి చెందిన జగన్మోహన్రావుతో కలిసి మార్పు చేసి తనపరం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. తమ భూములను తమకివ్వాలని కోరితే కేసులు నమోదు చేయించి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆక్రోశిస్తున్నారు. మరోవైపు ఈ భూముల రికార్డులన్నీ తారుమారు చేసి... పంట నష్టపరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, రాయితీలు పొందుతుండటం గమనార్హం.
ఆక్వా సాగు పేరుతో..
ఎస్.రాయవరం మండలం వాకపాడు రెవెన్యూ పరిధిలోని 73, 74, 75, 77, 78, 344, 345, 346, 347, 348, 351, 352, 353, 354, 435, 438, 439, 441, 442, 443, 445 సర్వే నంబర్లలో సుమారు 103 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వం వీటిని సుమారు 30 ఏళ్ల క్రితం తంతట సూర్యారావు (పట్టానెం 41/98), దండా కొండయ్య (42/98), పెయ్యిల నాగరాజు (43/98), గారా నర్సింహులు, జల్లూరి అప్పారావు, దండా త్రిమూర్తులు, దండా అప్పన్న, దండా తాతబ్బాయి, గారా అప్పయ్యమ్మ, బీరా నాగన్న, గారా అప్పారావు, కొప్పిశెట్టి మాణిక్యం, కొప్పిశెట్టి అప్పారావు, కొప్పిశెట్టి అయ్యన్న తదితర స్థానిక పేద రైతుల పేరుతో డీ–ఫారం పట్టాలు మంజూరు చేసింది. అప్పటినుంచి వీరంతా ఈ భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ భూములపై కన్నేసిన టీడీపీ నేత ‘అబద్ధం’.. తనకు లీజుకు ఇస్తే ఆక్వా లాభాల్లో వాటా ఇస్తానని నమ్మబలికి పదేళ్ల క్రితం వారి నుంచి తీసుకున్నాడు. ఎమ్మెల్యే అనిత అండదండలతో 2014లో ఈ భూమిని 42 సబ్ డివిజన్లుగా విభజించి.. ఈ ప్రాంతానికి సంబంధం లేని విశాఖ ఆక్వాఫారానికి చెందిన జగన్మోహన్రావు తండ్రి వీరభద్రరావును తెరమీదకు తీసుకు వచ్చి అతని పేరున మ్యూటేషన్ (వెబ్ల్యాండ్లో) చేశారు. ఈ 42 సబ్ డివిజన్లకు 42 ఖాతా నెంబర్లు ఇచ్చారు. ఈ భూముల్లో ఆక్వా కాకుండా వరి సాగు చేస్తున్నాడు. తమ భూములకు లీజు చెల్లించాలని లేదంటే వెనక్కి ఇవ్వాలని కోరిన రైతులను బెదిరిస్తూ హోంమంత్రి సహకారంతో పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నాడు.
పట్టాలున్నాయి..
ప్రభుత్వం మా పూర్వీకులకు ఇచ్చిన భూములను అబద్ధం అనే టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని భూముల్లోకి రానివ్వకుండా బెదిరిస్తున్నారు. కేసులు బనాయిస్తున్నారు. మా దగ్గర పట్టాలు ఉన్నాయి.
ఇద్దరూకలిసికబ్జా
మా తాత, తండ్రులకు డీ–ఫారం పట్టాలు ఇచ్చారు. ఈ భూముల్లో గంటి, జొన్న సాగు చేసే వాళ్లం. పెట్టుబడులు పెట్టలేక ఆకుల జగన్మోహన్రావు అనే వ్యక్తికి లీజుకు ఇస్తే టీడీపీ నాయకుడు అబద్ధంతో కలిసి కబ్జా చేశారు. మా భూములు మాకు అప్పగించాలని కోరితే కేసులు పెట్టి వేధిస్తున్నాడు. మావద్ద ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయి.
– దండా తాతబ్బాయి, వాకపాడు, ఎస్.రాయవరం మండలం
దళితులకు చెందిన 103 ఎకరాలను కాజేసిన టీడీపీ నేత
నేటి నుంచి రేషన్ డిపోల్లో సరకుల పంపిణీ
2న అల్లూరి పార్క్ వద్ద యోగా ప్రదర్శన
కలెక్టర్ విజయ కృష్ణన్
మా భూములు మాకు అప్పగించాలి
మాకు ఈ భూములు మినహా వేరే ఆధారం లేదు. వయసు పైబడటంతో కష్టంగా ఉంది. అబద్దం అనే నాయకుడు మా భూములు ఆక్రమించి సాగుచేస్తున్నాడు. మా భూములు మాకు అప్పగించి న్యాయం చేయాలి.
–దండా మాణిక్యం, వాకపాడు
– పెయ్యిల నాగరాజు, వాకపాడు

పేరు అబద్ధంకబ్జా నిజం!

పేరు అబద్ధంకబ్జా నిజం!

పేరు అబద్ధంకబ్జా నిజం!

పేరు అబద్ధంకబ్జా నిజం!

పేరు అబద్ధంకబ్జా నిజం!

పేరు అబద్ధంకబ్జా నిజం!