4న వెన్నుపోటు దినం | - | Sakshi
Sakshi News home page

4న వెన్నుపోటు దినం

May 30 2025 1:29 AM | Updated on May 30 2025 1:29 AM

4న వెన్నుపోటు దినం

4న వెన్నుపోటు దినం

నర్సీపట్నం: హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వచ్చే నెల 4న వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకుని శాంతియుత బైక్‌ ర్యాలీ చేపడుతున్నామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ తెలిపారు. ఈ ర్యాలీకి అనుమతించాలని గురువారం డీఎస్పీ పి.శ్రీనివాసరావును కలిసి లిఖిత పూర్వకంగా దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా గణేష్‌ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలు అమల్లో విఫలమైందన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలను మరోమారు మోసం చేశారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన గళం వినిపించేందుకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శాంతియుత ర్యాలీ చేపడుతున్నామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నంలోని సీబీఎం కాంపౌండ్‌ నుంచి పెదబొడ్డేపల్లి జంక్షన్‌ వరకు ర్యాలీ సాగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. డీఎస్పీని కలిసిన వారులో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పార్టీ టౌన్‌ అధ్యక్షుడు ఏకా శివ, లీగల్‌ సెల్‌ ప్రతినిధి, కౌన్సిలర్‌ మాకిరెడ్డి బుల్లిదొర, నాయకుడు చింతకాయల వరుణ్‌ ఉన్నారు.

ర్యాలీకి అనుమతించాలనిడీఎస్పీకి మాజీ ఎమ్మెల్యే గణేష్‌ వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement