
ఎన్టీఆర్కు నివాళి
తుమ్మపాల/అనకాపల్లి: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ కలెక్టరేట్లో బుధవారం ఆయన చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య, సంక్షేమ పథకాల సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీలు సుబ్బలక్ష్మి, కె.మనోరమ, జిల్లా గణాంకాధికారి జి.రామారావు, డీఎస్వో కె.ఎల్.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.