
గంజాయి తరలింపుపై పోలీసుల దాడి
రోలుగుంట: కారులో గంజాయి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ రామకృష్ణారావు, సిబ్బంది బుధవారం దాడి చేశారు. కొంతలం కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి కారుతో పరారయ్యేందుకు ముగ్గురు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు దాడి చేసి, కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, కానును సీజ్ చేశారు. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అంచానా. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒకరు పరారైనట్టు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన వారిలో అన్నవరం జిల్లా, మదనపల్లి మండలం, సస్పాతోట గ్రామానికి చెందిన పట్నం సురేష్(28), ఇదే మండలం, బి.కొత్తకోట గ్రామానికి చెందిన బంటుపల్లి కల్యాణ్(27), కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కిల్కోట అంతరంగ రోడ్డుకు చెందిన వి.గౌతమ్(38) ఉన్నారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించామని ఎస్ఐ చెప్పారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీ
20 కిలోల గంజాయి స్వాధీనం, కారు సీజ్