
ప్రైవేటు బస్సును అడ్డుకున్న ఆర్టీసీ డీఎం
నర్సీపట్నం: టూరిస్ట్ పర్మిట్తో స్టేజ్ గ్యారేజ్ సర్వీసు చేస్తున్న ప్రైవేటు బస్సును ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. ప్రతి రోజు సాయంత్రం బయలుదేరుతున్న నర్సీపట్నం–హైదరాబాద్ బస్సును బుధవారం ఆర్టీసీ డీఎం ధీరజ్, సిబ్బంది నిలిపివేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకుని స్టేజ్ క్యారేజ్ సర్వీసు చేస్తున్నారన్నారు. అదే విధంగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ నిర్వహిస్తున్నారన్నారు. టూరిస్ట్ పర్మిట్ బస్సును స్టేజ్ క్యారేజ్ సర్వీసుగా తిప్పకూడదన్నారు. అందుకే అడ్డుకున్నామన్నారు. ఇకపై స్టేజ్ క్యారేజ్ తిప్పమని హామీ ఇవ్వడంతో వదిలిపెట్టామని డీఎం తెలిపారు.