
ఏషియన్ కరాటే చాంపియన్ అంజనా శ్రీవేణి
పాయకరావుపేట: పట్టణానికి చెందిన విద్యార్థి ని ధూళి అంజనా శ్రీవేణి కరాటేలో దుమ్ము రేపింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించిన 9వ ఏషియన్ గోజుర్వు కరాటే చాంపియన్షిప్లో భారతదేశం తరపున పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. ఈ అంతర్జాతీయ పోటీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజికిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేషియా, నేపాల్, ఇండోనేషియా వంటి పలు ఆసియా దేశాల నుంచి సుమారు వెయ్యిమంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అండర్–12 కేటగిరీలో పోటీ పడిన అంజనా శ్రీవేణి, తన అద్భుతమైన ప్రదర్శనతో సిల్వర్ మెడల్ను కై వసం చేసుకుని దేశానికి, రాష్ట్రానికి, పాయకరావుపేటకు గర్వకారణంగా నిలిచింది. పోటీ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆమెను తమిళనాడు కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ షీహాన్ ప్రమోష్ స్వయంగా కలిసి ఘనంగా సత్కరించారు.