రోడ్డు ప్రమాదంలో పీఎఫ్‌ కార్యాలయ ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పీఎఫ్‌ కార్యాలయ ఉద్యోగి మృతి

May 28 2025 11:38 AM | Updated on May 29 2025 2:55 PM

-

గోపాలపట్నం: మర్రిపాలెం వుడా లేఅవుట్‌లో సూపరిండెంట్‌గా పనిచేస్తున్న పి.వి. నరేష్‌ బాబు (60) మంగళవారం సాయంత్రం ఎన్‌ఏడీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం పీఎఫ్‌ కార్యాలయం నుంచి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై పెందుర్తిలోని ఇంటికి వెళ్తుండగా ఓ కంటైనర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్‌ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కంచరపాలెం ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కేజీహెచ్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ సీఐ ఉమామహేశ్వరరావు నేతృత్వంలో ఎస్‌ఐ ప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement