
మహిళల వ్యధా జీవనమే ‘శిథిల జీవి’
కశింకోట: పేద మహిళలు కుటుంబ జీవనం కోసం ధన సంపాదనకు విదేశాలు వెళ్లి చాకిరీ చేసి మోసపోతూ విగత జీవులుగా స్వదేశానికి చేరుతుండటం ఇతి వృత్తంగా ‘శిథిల జీవి’ నాటిక సాగింది. కశింకోటలోని గవరపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అశోక్ ఫ్రెండ్స్ క్లబ్ సాంస్కృతిక కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి దీన్ని ప్రదర్శించారు. ఇది ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. నాటిక మధ్యలో వర్షం కురిసి ప్రదర్శనకు దాదాపు అర్ధగంట పాటు అంత రాయం కలిగింది. ఆ తర్వాత కూడా మిగిలి ఉన్న నాటికను ప్రదర్శించాలని ఆహూతులు ఒత్తిడి చేశారు. దీంతో వాయిదా వేయాలని భావించిన కళాకారులు మిగిలిన నాటికను రసవత్తరంగా పూర్తి చేశారు. ఆహూతులు నాటికను వర్షం పడి అంతరాయం కలిగినా లెక్క చేయకుండా ఆద్యంతం వీక్షించి ఇంటి ముఖం పట్టారు.
కశింకోట: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రంప విప్లవ వీరుడు ‘ద్వారబంధాల చంద్రయ్యనాయుడు’ నాటిక ఆహూతులను రంజింపజేసింది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు నాలుగు దశాబ్దాల పూర్వమే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి తాడిత పీడిత, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి బ్రిటిష్ వారికి, జమీందార్లకు చంద్రయ్య సింహ స్వప్నంగా మారుతాడు. అతడిని భోజనానికి పిలిచి అందులో మత్తు మందు కలిపి స్ప్రహలో లేకుండా చేసిన తర్వాత కిర్లంపూడి రోడ్లపై చిత్ర హింసలకు గురి చేసి చెట్టుకు కట్టి వేలాడదీసి చంపుతోంది. ఇది ఇతివృత్తంగా నాటికను ఆద్యంతం రక్తి కట్టించి ఆహూతులను అలరించింది. ఎక్కువ సంఖ్యలో కళాకారులు నాటికలో ప్రదర్శన నిర్వహించారు.
అలరించిన అనగనగా ఒక రోజు...
విశాఖపట్నం జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రచించిన ‘అనగనగా ఒక రోజు’ నాటిక చివరి ప్రదర్శన ఆహూతులను అలరించింది. రాజు దయా దాక్షిణ్యాలపై బతికే ప్రజలు అరాచక పాలనను ఎలా అంతం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదురుకుంటారు. అనుకోకుండా ఊహించని రీతిలో రాజు అవినీతిని అంతం చేస్తున్న సమయంలో అతని అంగ రక్షకులే చిత్ర వధ చేసి రాజ సింహాసనాన్ని ఆక్రమించి అధిష్టిస్తారు. అవినీతిని పునః ప్రతిష్ట చేస్తే అప్పుడు ధర్మం ఎన్ని పాదాలపై నడుస్తున్నట్లు? ఒకటా? రెండా? మూడా? నాలుగా? అని ప్రశ్నించడం నాటిక కథాంశం.

మహిళల వ్యధా జీవనమే ‘శిథిల జీవి’

మహిళల వ్యధా జీవనమే ‘శిథిల జీవి’

మహిళల వ్యధా జీవనమే ‘శిథిల జీవి’