
కూటమి నేతల చేతివాటం
ప్రమాదకరంగా ఇందేశమ్మవాక రోడ్డు
గొలుగొండ: ఏఎల్ పురం నుంచి కొంకసింగి రోడ్డు మూడు కిలోమీటర్లు. ఈ రోడ్డు మరమ్మతులకు రూ.లక్షా 25 వేలు ఖర్చు చేయగా కొంతకాలానికే రోడ్డు పెచ్చులూడిపోయింది. చీడిగుమ్మల నుంచి పుత్తడిగైరంపేట రోడ్డు మరమ్మతులకు రెండు లక్షల వరకు ఖర్చు చేయగా చాలా చోట్ల మళ్లీ పాడయింది. అయ్యన్నపాలెం నుంచి కరక వరకు సుమారుగా 9 కిలోమీటర్లకు రెండు లక్షల వరకు పనులు చేయగా రోడ్డు మరమ్మతులు సరిగా జరగలేదు. గొలుగొండ నుంచి ప్రముఖ ముఖ్యక్షేత్రం దారమఠం శివాలయం రోడ్డుకు మరమ్మతులు లేక భక్తులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనకాపల్లి: అనకాపల్లి మండలంలో గత ఏడాది డిసెంబర్లో తొమ్మిది రహదారులపై సుమారు రూ.72 లక్షలతో గోతులను పూడ్చారు. కూటమి నేతల చేతివాటంతో రెండు మాసాల్లోనే మళ్లీ గుంతలు ప్రత్యక్షమయ్యాయి. మండల పరిధిలో 50 కిలోమీటర్ల మేరకు అనకాపల్లి–మామిడిపాలెం, పాపయ్యసంతపాలెం, మార్టూరు, రేబాక, కొప్పాక, తోటాడ రోడ్డు, కుంచంగి, తగరంపూడి, వెంకుపాలెం పంచాయతీ పరిధిలో వేసిన రహదారులు ఛిన్నాభిన్నంగా ఉన్నాయి.
నాతవరం: స్పీకరు అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గంలోనే రోడ్ల పరిస్థితి తీసికట్టుగా ఉంది. నాతవరం గ్రామం నుంచి తాండవ రిజర్వాయరు రోడ్డు సుమారుగా 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇది తాండవ రిజర్వాయరును మూడు మండలాలను కలిపే ప్రధాన రోడ్డు. నాతవరంతోపాటు గొలుగొండ మండలం, అల్లూరి సీతారామకాజు జిల్లాలోని కొయ్యూరు మండలానికి కూడా ఈ రహదారి ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు పెద్ద గోతులు పడి ప్రమాదకంగా మారింది. ఎన్నికల సమయంలో రోడ్డుపై ఎన్నో హామీలిచ్చిన అయ్యన్నపాత్రుడు అధికారంలోకి వచ్చాక ఈ రోడ్డును పట్టించుకోలేదు.
ఎస్.రాయవరం: ఇందేశమ్మవాక రోడ్డుపై భయం భయంగా ప్రయాణం సాగించాల్సి వస్తోందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత రోడ్డు విస్తరణకు 8 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల మండలం రామచంద్రపురం వరకు రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంది. అప్పటినుంచి కాంట్రాక్టరు పలుమార్లు పనులు చేపట్టి నిలిపివేయడంతో రోడ్డంతా గతుకులు మయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గోతుల్లో నీరు చేరి చెరువుల్లా దర్శనమిస్తున్నాయి.ఆ రోడ్డుపై ద్విచక్ర వాహన చోదకులు పల్టీలు కొడుతున్నారు.
మూన్నాళ్ల ముచ్చట

కూటమి నేతల చేతివాటం

కూటమి నేతల చేతివాటం