
నలుగురిని కాపాడిన లైఫ్గార్డ్స్
డాబాగార్డెన్స్: ఆర్కే బీచ్లో విషాదం తప్పింది. హైదరాబాద్కు చెందిన ఎనిమిది మంది యువకులు సరదాగా గడిపేందుకు బీచ్కు వచ్చారు. వారిలో నలుగురు సముద్రంలో మునిగిపోతూ ఉండగా జీవీఎంసీ లైఫ్గార్డ్స్ వెంటనే స్పందించి కాపాడారు. జీవీఎంసీ ఇన్చార్జి స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు తెలిపిన వివరాలివి. హైదరాబాద్ నుంచి వచ్చిన షబ్బీర్, అబ్బాస్, విడ్రస్, హుస్సేన్ అనే యువకులు శుక్రవారం ఉదయం ఆర్కే బీచ్లో స్నానానికి దిగారు. అయితే సముద్ర అలల ఉధృతికి వారు నీటిలో మునిగిపోవడం గమనించిన బీచ్ లైఫ్గార్డ్స్ ధనరాజు, నవీన్, ఆనంద్, లక్ష్మణరావు, కేపీ వాసు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం వారికి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం వారిని పంపించివేశారు.