
మెగా ఆధార్ శిబిరానికి విశేష స్పందన
మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి..
చింతూరు: కొండరెడ్ల కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఆధార్ శిబిరానికి విశేష స్పందన లభిస్తున్నట్లు చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ మంగళవారం తెలిపారు. ప్రతి కొండరెడ్లకు ఆధార్కార్డు కల్పించడమే లక్ష్యంగా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా మంగళవారం 70 మంది ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్పురం మండలాల్లోని గ్రామాలకు చెందిన కొండరెడ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.