
ఉత్తమ రైతుగా జిన్ను
● ఎంపిక చేసిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
● 12న పురస్కార స్వీకారం
డుంబ్రిగుడ: మండలంలోని అరమ పంచాయతీ బడిమెల గ్రామానికి చెందిన తాంగుల జిన్నును ఉత్తమ రైతుగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపికచేసింది. ఉత్తమ పురస్కారాన్ని ఈనెల 12న గుంటూరు జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. ఈయన 2017లో వన వికాస మ్యాక్స్ బోర్డు సహకారంతో మాతోట ద్వారా గులి రాగి విధానంలో ఎకరాలో 21.6 క్వింటాళ్ల గులి రాగిని పండించారు. తమ సంస్థ సహకారంతో గులి రాగితో పాటు వాణిజ్య పంటలను సేంద్రియ విధానంలో పండిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారని మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ తెలిపారు.