
జిల్లాలో 93.55 శాతం మేర పింఛన్ల పంపిణీ
సాక్షి,పాడేరు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే జిల్లాలో శనివారం సాయంత్రం 6గంటల సమయానికి 93.55శాతం సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. మండలంలోని కిండంగి పంచాయతీ సేరుబయలులో ఆయన సామాజిక పింఛన్లను అందజేశారు. జిల్లాలో 1,22,994మంది పింఛనుదారులకు రూ.51,38,87,500 సామాజిక పింఛన్సొమ్మును మంజూరు చేయగా, తొలిరోజు సాయంత్రానికి 1,14,120 మందికి రూ.47,98,47,500 పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు.
కలెక్టర్ దినేష్కుమార్