
● ఇంకా పూర్తి కాని ‘మనఊరు– మనబడి’ పనులు ● పెండింగ్లోన
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
ఇక్కడ అసంపూర్తిగా కనిపిస్తున్నది భీంపూర్ మండలంలోని అర్లి(టి) ప్రాథమికోన్నత పాఠశాల భవనం. ఇందులో విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేవు. దీంతో గత ప్రభుత్వ హయాంలో అదనపు గదుల నిర్మాణం కోసం మన ఊరు–మనబడి కింద రూ.38 లక్షలు మంజూరు చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదని ఇలా అసంపూర్తిగా వదిలేశాడు. రెండేళ్లుగా విద్యార్థులు సరిపడా గదులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాదైనా పనులు పూర్తి అవుతాయని తల్లిదండ్రులు భావించినా ప్రస్తుతం ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.
నిర్మాణ దశలో ఉన్న జిల్లా కేంద్రంలోని కుమురంభీం కాలనీ పాఠశాల
సమయం : ఉదయం 9 నుంచి
10 గంటల వరకు
సంప్రదించాల్సిన నంబర్లు : 89777 42697,
81063 02862
ఉత్తమ ఫలితాలకు ప్రశంస
బోథ్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాలలలో ఉత్తమ ఫలితాలకు గాను ప్రిన్సిపాల్ జి. సంగీతకు ప్రశంస దక్కింది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధించినందుకు గాను సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా బుధవా రం హైదరాబాద్లో ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రిన్సిపాల్తో పాటు పాటు ఉపాధ్యాయులను అభినందించారు.
టెండర్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి..
మన ఊరు–మనబడి ద్వారా చేపట్టిన టెండర్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు రూ.23.58 కోట్ల బిల్లులు చెల్లించడం జరిగింది. ఇంకా రూ.7కోట్ల 61 లక్షలు చెల్లించాల్సి ఉంది. పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతాం. ప్రస్తుతం పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులకు సంబంధించి ఉపాధ్యాయుల నుంచి వివరాలు తీసుకొని విద్యా శాఖ డైరెక్టర్కు పంపించాం.
– జె.నారాయణ,
విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి
ఆదిలాబాద్టౌన్: నూతన విద్యాసంవత్సరానికి వేళయింది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 6 నుంచి ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు ఈనెల 31లోగా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. ఈ ఏడాది కూడా సర్కారు బడుల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. 2021–22 సంవత్సరంలో మన ఊరు–మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం పనులు చేపట్టారు. మూడేళ్లు గడుస్తున్నా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పలు పాఠశాలల్లో చేపట్టిన పనులు కూడా ఇంకా కొన్ని అసంపూర్తిగానే నిలిచాయి. అయితే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో ఎలాంటి మౌలిక వసతులు అవసరం ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యా శాఖ అధికారులు జిల్లా యంత్రాంగం నుంచి తీసుకున్నారు. ఇందులో ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు లేరు.. విద్యార్థులు ఉన్నచోట సరిపడా టీచర్లు లేరు.. పలు పాఠశాలలకు తరగతి గదుల కొరత, మరుగుదొడ్లు, తాగునీటి సమస్య, శిథిలావస్థ బడులు వంటివి అనేకం ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం నాటికి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా..
అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా జిల్లాలో గత విద్యా సంవత్సరంలో 649 పాఠశాలల్లో పనులు చేపట్టారు. మైనర్ రిపేర్లు, తాగునీరు, మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుదీకరణ, బాలికల మరుగుదొడ్ల పనులు చేపట్టారు. వీటికోసం రూ.30 కోట్ల అంచనా వేశారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తదితర పనులు పెండింగ్లో ఉన్నాయి.
25 బడులు శిథిలావస్థలో..
జిల్లాలో 25 ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యా శాఖాధికారులకు నివేదించారు. 54 పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేవని, 17 ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, ఒక యూపీఎస్లో బాలికల మరుగుదొడ్లు, నాలుగు యూపీఎస్ల్లో బాలురకు, 12 ఉన్నత పాఠశాలల్లో బాలురకు మరుగుదొడ్లు లేవని సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు అధికారులకు నివేదించారు. ఈ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారులు ఉన్నతాధికారులకు పంపించారు.
న్యూస్రీల్

● ఇంకా పూర్తి కాని ‘మనఊరు– మనబడి’ పనులు ● పెండింగ్లోన

● ఇంకా పూర్తి కాని ‘మనఊరు– మనబడి’ పనులు ● పెండింగ్లోన

● ఇంకా పూర్తి కాని ‘మనఊరు– మనబడి’ పనులు ● పెండింగ్లోన

● ఇంకా పూర్తి కాని ‘మనఊరు– మనబడి’ పనులు ● పెండింగ్లోన