ఏటీసీ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఏటీసీ పనుల పరిశీలన

May 27 2025 12:01 AM | Updated on May 27 2025 12:01 AM

ఏటీసీ పనుల పరిశీలన

ఏటీసీ పనుల పరిశీలన

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)ని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ గోవర్ధన్‌ రెడ్డి సోమవారం పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టాటా ఫౌండేషన్‌ సంయుక్తంగా రూ.40 కోట్లతో నిర్మాణం చేపడుతుందని పేర్కొన్నారు. ఇందులో రూ.35 కోట్లు ఫౌండేషన్‌ వాటా, రూ.5 కోట్లు ప్రభు త్వ వాటాతో పనులు చేపడుతున్నట్లు వివరించారు. జూన్‌ వరకు నిర్మాణం పూర్తి కావా ల్సి ఉండగా, మరికొన్ని పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు వరకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఐటీఐని ఉన్నతీకరణ చేసేందుకు ఈ సెంటర్‌ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రోబోటిక్‌, ఏఐ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ఆయన వెంట ఐటీఐ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ప్రశాంత్‌, విక్రమ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement