
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్: పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్క్వార్టర్స్లో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. 400 మంది సిబ్బంది వారి కుటుంబీకులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇందులో డీఎస్పీలు పో తారం శ్రీనివాస్, ఎల్.జీవన్రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మురళి, నవీన్కుమార్, కార్తీక్, పోలీస్ అసో సియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మహిళల భద్రత కోసమే షీటీంలు
మహళల భద్రత కోసం షీటీం నిర్వహణ చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో షీటీంలకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో విస్తృతంగా షీటీం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గతనెలలో 110 గ్రా మాలను ఆయా బృందాలు సందర్శించాయని పేర్కొన్నారు. నాలుగు ఎఫ్ఐఆర్, 10 పీటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆపత్కాల సమయంలో షీటీం కోసం 8712659953 నంబర్పై సంప్రదించాలని సూచించారు.
వీడీసీల అక్రమాలపై ఉక్కుపాదం..
వీడీసీల అక్రమ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఎస్పీ అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, అక్రమ దందాలు, వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. వీడీసీ బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పే ర్కొన్నారు. చట్టం చేయాల్సిన పనిని పలుచోట్ల వీడీసీలు తమ చేతిలోకి తీసుకొని పోలీసు, న్యా యస్థానాన్ని ఆశ్రయించకుండా చూస్తున్నారని, వారు చెప్పింది వినకపోతే కొందరు గ్రామాల నుంచి వెలివేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బేల, జైనథ్, బోథ్, ఇచ్చోడ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.