వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ విద్యార్థులు
ఆదిలాబాద్టౌన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 97.40 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది జిల్లా 17వ స్థానంలో నిలవగా, ఈసారి 8 స్థా నాలు మెరుగుపర్చుకొని రాష్ట్రస్థాయిలో 9వ స్థా నానికి ఎగబాకింది. సీఎం రేవంత్రెడ్డి ఎస్సెస్సీ ఫలి తాలను బుధవారం విడుదల చేశారు. జిల్లాలో బా లుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ప్రభుత్వ యాజమా న్య పాఠశాలలు ఈ సారి మంచి ఫలితా లు సాధించాయి. 65 పాఠశాలల్లో వంద శాతం ఉ త్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫలితాలు గ్రేడింగ్లో కాకుండా మార్కుల రూపంలో విడుదలయ్యాయి.
మెరుగైన ఫలితాలు..
జిల్లాలో మొత్తం 10,028 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 9,767 మంది ఉత్తీర్ణత సాధించారు. 97.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 5,049 మంది హాజరు కాగా, 4,890 మంది ఉత్తీర్ణులయ్యారు. 96.85 శాతం ఉతీర్ణత నమోదైంది. బాలికలు 4,979 మంది హాజరు కాగా, 4877 మంది పాస్ అయ్యారు. 97.95 ఉత్తీర్ణత శా తం నమోదైంది. ఉత్తీర్ణత శాతం పరంగా మెరుగుపడగా, రాష్ట్రస్థాయిలో టాప్–10లో నిలిచారు. ఆ శ్రమ పాఠశాలల్లో 98.73 శాతం, బీసీ వెల్ఫేర్లో 99.69, ప్రభుత్వ యాజమాన్యంలో 87.70, కేజీబీ వీల్లో 97.64, మోడల్ స్కూళ్లలో 99.82, ప్రైవేట్ పాఠశాలల్లో 98.76, మినీ రెసిడెన్షియల్లో 97.12, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 100 శాతం, ట్రైబ ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 99.76, జెడ్పీ యాజమాన్యంలో 96.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
జూన్ 3నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ..
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజుల గడువు ఉంది. రీకౌంటింగ్, జవాబు పత్రాల జిరాక్స్ కాపీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, వాటిని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 16 వరకు గడువు ఉందని సూచించారు.
వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు..
జిల్లాలో 65 పాఠశాలల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. మోడల్ స్కూల్ బంగారుగూడ, పొచ్చర, ప్రభుత్వ పాఠశాల ఖానాపూర్, తాటిగూడ, హిందీ హైస్కూల్, కేజీబీవీ ఆదిలాబాద్రూరల్, స్పోర్ట్స్ స్కూల్, మోడల్స్కూల్ బజార్హత్నూర్, దహెగావ్, పిప్పిరి, కేజీబీవీ బేల, సిర్సన్న, సాంగిడి, కొగ్దూర్, కరంజి, పిప్పల్కోటి, భీంపూర్, ప్రభుత్వ పాఠశాల బోథ్, మోడల్ స్కూల్ బోథ్, ధన్నూర్(బి), కౌఠ(బి), మర్లపల్లి, పొచ్చర, కన్గుట్ట, బోరిగామ, కేజీబీవీ ఇచ్చోడ, కోకస్మన్నూర్, కేజీబీవీ గాదిగూడ, ప్రభుత్వ పాఠశాల గుడిహత్నూర్, కేజీబీవీ తోషం, కొల్హారి, మన్నూర్, కేజీబీవీ ఇంద్రవెల్లి, ముత్నూర్, మోడల్స్కూల్ జైనథ్, దీపాయిగూడ, గిమ్మ, కౌట, పెండల్వాడ, అడ, పిప్పర్వాడ, బాలాపూర్, కూర, సరస్వతినగర్, వాగాపూర్, కేజీబీవీ నార్నూర్, మోడల్స్కూల్ నార్నూర్, జెడ్పీఎస్ఎస్ నార్నూర్, తడిహత్నూర్, భీంపూర్, నేరడిగొండ, వాంకిడి, తేజాపూర్, కేజీబీవీ తలమడుగు, బరంపూర్, కుచులాపూర్, తలమడుగు, కజ్జర్ల, లింగి, పల్లి(బి), ఘోట్కురి, కప్పర్ల, తాంసి, పొన్నారి పాఠశాలలు ఇందులో ఉన్నాయి.
మంచి ఫలితాలు సాధించాం
పదో తరగతిలో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. గతేడాదితో పోల్చితే ఈ సారి దాదాపు ఐదు శాతం ఉత్తీర్ణత పెరిగింది. కలెక్టర్ రాజర్షిషా పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. కరదీపికలను అందజేశారు. రాష్ట్రస్థాయిలో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. 97.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాం. – శ్రీనివాస్రెడ్డి, డీఈవో
సబ్జెక్టుల వారీగా..
జిల్లాలో సబ్జెక్టుల వారీగా ఫలితాలను చూస్తే.. తెలుగులో 99.02 శాతం, సెకండ్ లాంగ్వేజ్లో 99.75 శాతం, ఇంగ్లీష్లో 99.35 శాతం, గణితంలో 98.87 శాతం, సామాన్య శాస్త్రంలో 98.58 శాతం, సాంఘిక శాస్త్రంలో 99.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
కలెక్టర్ ప్రశంస
ఆదిలాబాద్టౌన్: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడంపై కలెక్టర్ రాజర్షిషా హర్షం వ్యక్తం చేశారు. విద్యా శాఖ అధికారులను ప్రశంసించారు. డీఈవో శ్రీనివాస్రెడ్డి, డీసీఈబీ సెక్రెటరి కందుల గజేందర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. వచ్చే సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూ చించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభా కాంక్షలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులపై శ్రద్ధ వహించాలని, సప్లిమెంటరీ పరీక్షల్లో వారు కూడా ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు.
సర్కారు విద్యార్థుల సత్తా..
పదో తరగతి ఫలితాల్లో ఈ సారి జిల్లా విద్యార్థులు అత్యుత్తమంగా రాణించారు. గతంతో పోల్చితే మెరుగైన ఫలితాలు సాధించడంతో డీఈవో శ్రీనివాస్రెడ్డితో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. బంగారిగూడ మోడల్ స్కూల్కు చెందిన చిల్కూరి రమ 578 మార్కులు సాధించగా.. సట్లవార్ హర్ష్ 575, హర్షవర్ధన్ 569, కేజీబీవీలో నేరడిగొండకు చెందిన విద్యార్థిని హార్థిక 564, తలమడుగు కేజీబీవీ విద్యార్థిని శైలజ 563, ఆదిలాబాద్రూరల్ కేజీబీవీలో వైశాలి 557, సంస్కృతి 556, మయూరి 550, గాదిగూడ కేజీబీవీకి చెందిన విద్యార్థిని లత 552, భోరజ్ మండలం పిప్పర్వాడ జెడ్పీ పాఠశాలకు చెందిన వగాడే అమృత 560 మార్కులు సాధించారు.
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీ
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీ
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీ
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీ
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీ
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీ
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీ
● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● జిల్లాలో 97.40 శాతం ఉత్తీ