-
ఓవర్ టు రిసీవింగ్ సెంటర్
చేవెళ్ల: లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో సోమవారం రాత్రి పోలింగ్ కేంద్రాల నుంచి అధికారులు, సిబ్బంది పోలింగ్ యంత్రాలు, సామగ్రితో రిసీవింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. అయితే ఈసారి పోలింగ్ సమయం సాయంత్రం 6గంటల వరకు పెట్టడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి యంత్రాల ప్యాకింగ్, పోలైన ఓట్ల లెక్కలు సరిచేసుకునేసరికి రాత్రి అయ్యింది. అక్కడి నుంచి సెక్టార్ల వారీగా వచ్చే బస్సుల్లో ఎక్కి చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి సమీపంలోని బండారు శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రిసీవింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడ అధికారులు ముందస్తుగా సెక్టార్ల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో పోలింగ్ బూత్వారీగా ఈవీఎంలు, వీవీప్యాట్ల యంత్రాలు, ఎన్నికల సామగ్రిని అప్పగించారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలోని ఐదు మండలాల నుంచి అంతా ఇక్కడేకి రావాల్సి రావడంతో ఉద్యోగులకు అర్ధర్రాతి దాటింది. దీంతో ఎన్నికల సామగ్రిని అప్పగించి తిరిగి వారివారి ఇళ్లకు వేళ్లేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ముందస్తుగానే వ్యక్తిగత వాహనాలు ఏర్పాటు చేసుకున్న వారు ఇళ్లకు చేరుకోగా ఆలస్యమైన వారు ఇబ్బంది పడ్డారు. పోలింగ్ కేంద్రాలనుంచి వచ్చే ఉద్యోగులకు రిసీవింగ్ కేంద్రం వద్ద భోజన వసతిని కల్పించారు. ఓట్ల అనంతరం పోలింగ్ సామగ్రితో తిరిగి వచ్చిన సిబ్బంది అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈవీఎం, వీవీ ప్యాట్ల అప్పగింత ప్రక్రియ -
పూరీ బాగుంది
మొయినాబాద్రూరల్: లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం హిమాయత్నగర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ హోటల్లోకి వెళ్లి యువకులను ఆప్యాయంగా పలకరించారు. ఇక్కడ ఏం స్పెషల్ అని అడుగగా యువకులంతా పూరీ స్పెషల్ సర్ అని చెప్పారు. వెంటనే నాకు కూడా పూరీ ఇవ్వండి అని ఆర్డర్ ఇచ్చి యువకులతో పాటు తిన్నారు. పూరీ బాగుంది అని హోటల్ సిబ్బందిని అభినందించారు. 1.50 కోట్ల మంది బస్సుల్లో ప్రయాణించారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గచ్చిబౌలి: తెలంగాణ వ్యాప్తంగా గడచిన గత రెండు రోజుల్లో 1.50 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమతమ స్వగ్రామాలకు తరలివెళ్లారని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ తెలిపారు. కొండాపూర్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 5 వేల టీఎస్ఆర్టీసీ బస్సులను నడిపామని వివరించారు. ప్రస్తుతం వర్కింగ్ డేస్ కావడంతో వెళ్లిన వారంతా ఓటు వేసిన తర్వాత తిరిగి అదే రోజు తిరుగు ప్రయాణంలో కూడా వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, సంతోష్నగర్, లింగంపల్లి ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఆయా ప్రాంతాలలో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా అన్ని టెంట్లు ఏర్పాటు చేసి వసతి కల్పించామని ఎండీ వివరించారు. రెండు రోజులుగా డ్రైవర్లు, కండక్టర్లు, ఆఫీసర్లు, సిబ్బంది చాలా కష్టపడ్డారని తెలిపారు. వారందరినీ యాజమాన్యం పక్షాన, సంస్థ పక్షాన అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. చాలా ఒత్తిడి ఉన్నా వారంతా ప్రయాణికుల శ్రేయస్సు కోసం చేసిన సేవలు మరువలేనివని వీసీ సజ్జనార్ కొనియాడారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం తథ్యం హైదరాబాద్: అత్యధిక లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి సదానంద్ అన్నారు. ఓటర్లంతా కాంగ్రెస్ పక్షాన ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... ఓటింగ్ సరళి చూసిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 12–14 స్థానాలు లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసిన నేపథ్యంలో లబ్ధిపొందుతున్న ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకోని కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ ఎందుకు తగ్గింది..? ● వరుస సెలవులతో లక్షలాదిగా సొంత ఊళ్లకు తరలిన జనం ● గ్రేటర్లో ఓటువేసేందుకు అనాసక్తి! సాక్షి, సిటీబ్యూరో: ఎండలు నిప్పులు చెరగలేదు. వడగాలులు వీచలేదు. వడగండ్ల వానలు లేనేలేవు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగర వాతావరణం చల్లగానే ఉంది. ఆహ్లాదంగానే ఉంది. కానీ పోలింగ్ మాత్రం మందకొడిగానే సాగింది. ప్రతి ఎన్నికల్లో నమోదైనట్లుగానే సాయంత్రం ఐదింటి వరకు 50 శాతం లోపే ఓట్లు పోలయ్యాయి. సాధారణంగా ఈసారి ఎండల కారణంగా సిటీలో ఓటింగ్ తగ్గవచ్చునని విశ్లేషకులు భావించారు. కానీ అందుకు భిన్నంగా వాతావరణం సహకరించింది. అయినప్పటికీ ఓటింగ్ ఆశించిన స్థాయిలో పెరగలేదు. నగరవాసులు పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్లడం వల్లనే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఆ రాష్ట్రానికి చెందిన నగరవాసులు లక్షలాదిగా తరలి వెళ్లారు. నగరంలో ఓటింగ్ శాతం పెరగకపోవడానికి ఇది ప్రధాన కారణం. అదే సమయంలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన నగర వాసులు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పెద్ద సంఖ్యలోనే సొంత ఊళ్లకు వెళ్లారు. వేసవి సెలవుల కారణంగా చాలా మంది ఇంటిల్లిపాది కలిసి పర్యాటక ప్రాంతాలకు, సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఓటింగ్ తక్కువగా నమోదు కావడానికి వేసవి సెలవులు కూడా కారణమే. -
ఓటు హక్కు బాధ్యతే..
కేశంపేట: ఎన్నికల సంఘం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఓటర్లు వంద శాతం పోలింగ్కు సహకరించడం లేదు. శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారే పోలింగ్ కేంద్రాలకు రాక బాధ్యతను మరుస్తున్నారు. కానీ మండల పరిధిలోని అల్వాల గ్రామానికి చెందిన కృష్ణయ్య అంగ వైకల్యాన్ని లెక్క చేయకుండా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కొద్దిరోజులు క్రితం విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్నారు. సార్వత్రిక సమరంలో భాగంగా కృష్ణయ్య సోమవారం సహాయకురాలుగా భార్య జయమ్మను కేంద్రానికి తీసుకువెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వ్యక్తికి రెండు చేతులు లేకపోవడంతో అధికారులు ఆయన కాలికి ఇంకును వేశారు. -
మందకొడిగా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే అప్పటికే రిజర్వ్లో ఉంచుకున్న ఈవీఎంలను వాటి స్థానంలో ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా కందుకూరు మండలం తిమ్మాపూర్ అనుబంధ గ్రామం చీమలవానికుంట పాటు కొత్తూరు మండలం కోడిచర్ల తండాలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ఆయా గ్రామాల ఓటర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారులు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఇక చేవెళ్ల లోక్సభ స్థానంలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం మందకొండిగా ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. మహిళలు, వృద్ధులు, రైతులు, కూలీలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల వరకు 8.34 శాతం ఓటింగ్ నమోదు కాగా, 11 గంటల వరకు 20.23 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 34.56 శాతం ఓటింగ్ నమోదైంది. 3 గంటల వరకు 45.35 శాతం ఓటింగ్ నమోదు కాగా, సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 68.23 శాతం ఓటింగ్ నమోదు కాగా, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 41.07 శాతం నమోదయ్యింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యింది. మొరాయించిన ఈవీఎంలు మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలోని 142 పోలింగ్ కేంద్రంలో కొద్దిసేపు ఈవీఎం మొరాయించింది. కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బడంగ్పేటలోని 235, 237 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు సైతం మొరాయించడంతో అక్కడ 50 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి పోలింగ్బూత్ 112లోని ఈవీఎం పనిచేయకపోవడంతో అధికారులు మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. షాద్నగర్ పట్టణంలోని 247 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో ఇక్కడ పోలింగ్ కొద్దిగా ఆలస్య మైంది. ఫరూక్నగర్ మండలం పీర్లగూడలోని ఓ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్లోని 225 బూత్లో ఈవీఎం దాదాపు 40 నిమిషాల పాటు మెరాయించింది. ఫరూక్నగర్ మండలం ఎలికట్టలోని 169 పోలింగ్ బూత్లోని ఈవీఎం మెరాయించడంతో ఓటర్లు చాలాసేపే క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. అయితే పలు కేంద్రాల్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి ఓటువేసేందుకు యువత ఉత్సాహం చూపారు. ట్రాన్స్జెండర్ల కూడా క్యూలో నిల్చొని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా ఈవీఎంలు మొరాయించిన చోట క్యూలో ఎక్కువ సేపు నిలబడాల్సి ఉండటంతో వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. ఓటేసిన ప్రముఖులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి కౌకుంట్లలో ఓటేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఖానాపూర్లో, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తొర్రూర్లో, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వీర్లపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బడంగ్పేట మేయర్ పారిజాత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే టీకేఆర్ తమ ఓటుహక్కును వినియోగించున్నారు.చేవెళ్ల లోక్సభ స్థానంలో ఓటింగ్ శాతం ఇలా..అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం 9గం మ.1గం మ.3గం సా.5 గంటలకు రా.7గంటలకు మహేశ్వరం 7.26 31.84 41.23 49.77 51.70 రాజేంద్రనగర్ 7.12 31.49 42.15 50.54 53.13 శేరిలింగంపల్లి 6.59 27.49 35.55 41.07 43.11 చేవెళ్ల 10.31 43.11 58.62 68.23 70.84 పరిగి 11.38 43.57 56.36 62.59 65.98 వికారాబాద్ 10.37 45.16 57.63 66.86 69.44 తాండూరు 11.85 41.05 54.95 63.00 66.34 మొత్తం 8.34 34.56 45.35 53.15 60.07 (అంచనా)షాద్నగర్, మహేశ్వరంలో నిరసనలు కందుకూరు మండలం తిమ్మాపూర్ అనుబంధ గ్రామం చీమలవాని కుంటకు పోలింగ్ కేంద్రం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమ్మాపూర్లో ఏర్పాటు చేశారు. అంత దూరం మేం పోలేమని చీమలవాని కుంట ఓటర్లు నిరసనకు దిగారు. అధికారులు నచ్చజెప్పడంతో చివరకు వారు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కొడిచర్ల తండావాసులు స్థానికంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయకుండా నాలుగు కిలోమీటర్ల దూరంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు తండాకు చేరుకుని నచ్చజెప్పడంతో చివరకు వారు శాంతించి ఓటింగ్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం తర్వాత ఊపందుకున్న ఓటింగ్ పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్న గ్రామాల్లో ఓటర్ల నిరసన ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు చేవెళ్లలో అత్యధికం..శేరిలింగంపల్లిలో అత్యల్పం -
ఈవీఎంల మొరాయింపు
బడంగ్పేట్ పరిధిలో ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్ బడంగ్పేట్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో భాగంగా సోమవారం బడంగ్పేట మున్సిపాలిటీలోని 235, 237 పోలింగ్ బూతులను స్థానికంగా ఉన్న శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఈవీఎంలు మొరాయించడంతో రెండు చోట్ల 50 నిమిషాలు ఆలస్యంగా మొదలయ్యాయి. టెక్నీషియన్ వచ్చి మరమ్మతు చేసేవరకు ఓటర్లు క్యూలైన్లోనే పడిగాపులు కాశారు. అనంతరం వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలాపూర్ మండలంలోని అల్మాస్గూడ, బాలాపూర్, నాదర్గుల్, వెంకటాపూర్, మామిడిపల్లిలో పరిధిల్లోని పోలింగ్ బూత్ల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ముచ్చటైన ‘ఎన్నికల’ పందిరి!
బంజారాహిల్స్: పచ్చని పందిరి.. పూల తోరణాలు.. ఫొటో బూత్లు... చల్లని నీరు... ఇవన్నీ ఏదో శుభకార్యంలో కనిపించాయని అనుకుంటే పొరబడినట్లే. ఇవన్నీ సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కొన్ని ఎంపిక చేసిన పోలింగ్ బూత్లలో కనిపించిన దృశ్యాలు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎంపిక చేసిన పోలింగ్ బూత్లను మోడల్ పోలింగ్ బూత్లుగా మార్చేందుకు అధికారులు రచించిన ప్రణాళికలు విజయవంతం అయ్యాయి. సఖి, యువ, ఆదర్శ పేరుతో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆయా పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లతో ఓ మంచి ఫీల్ను అధికారులు ఓటర్లకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో బూత్లలో ఓటర్లు ఫొటోలు తీసుకొని తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేసుకున్నారు. -
స్వేచ్ఛగా ఓటు వేయాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న జరుగనున్న పోలింగ్లో ప్రతి ఓటరు పాలుపంచుకుని, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజేంద్రనగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఓటరు కార్డు లేకపోయినా, ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకుని ఓటు వేయొచ్చని సూచించారు. జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రచార, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా పోలింగ్కు 72 గంటల ముందు నుంచి నిఘా ముమ్మరం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. లోక్సభ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ప్రతి పోలింగ్ కేంద్రంలో టెంట్లు, టాయిలెట్, ర్యాంపు, వీల్ చైర్, తాగునీరు, ఫ్యాన్ వంటి వసతులు కల్పించినట్టు వెల్లడించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరాల నిఘా నీడలో పోలింగ్ ఉంటుందన్నారు. 216 మంది సూక్ష్మ పరిశీలకులు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సేవలందిస్తారని ఆయన వివరించారు. విధుల్లో 23 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో 23,752 మంది పాల్గొననున్నట్టు కలెక్టర్ శశాంక తెలిపారు. సెక్టోరియల్, ప్రిసైడింగ్ ఆఫీసర్, సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని.. వీరంతా ఆదివారం ఉదయం ఆయా పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుని, బ్యాలెట్ బాక్సులను తీసుకుని కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారన్నారు. పోలింగ్ రోజున ఉదయం 5.30 గంటలకు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్పోల్ ఉంటుందన్నారు. మాక్పోల్, పోలింగ్ ప్రక్రియలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే వెంటనే సెక్టోరల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, వీరు తమ వద్ద రిజర్వ్లో ఉంచిన యూనిట్లను సమకూర్చుతారని చెప్పారు. పోలింగ్ రోజున ఓటింగ్ శాతాన్ని ప్రతి గంటకోసారి ఎన్కోర్ యాప్లో నమోదు చేయాలని, డాక్యుమెంట్, పీఓ డైరీ, విజిట్ షీట్, మాక్ పోల్ సర్టిఫికెట్, 17 కాలమ్ ప్రొఫార్మా వంటివి తప్పులు లేకుండా చూడాలన్నారు. పోలింగ్ ముగిసిన మీదట ఈవీఎంలను జాగ్రత్తగా రిసెప్షన్ సెంటర్లకు చేర్చాలని, వాటిని సరిచూసుకుని స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచే వరకు సెక్టోరల్ అధికారులు అక్కడే అందుబాటులో ఉంటారని వివరించారు. మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శనివారం పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ప్రక్రియ పూర్తి చేశారు. సాధారణ పరిశీలకుడు రాజేందర్ కుమార్ కటారియా కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, ఓపీఓలతో కూడిన బృందాలను ర్యాండమైజెషన్ ద్వారా కేటాయించారు. వీరికి ఇప్పటికే పలు విడతలుగా ఎంపిక చేసిన వివిధ కేంద్రాల్లో మాస్టర్ ట్రైనర్స్తో శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,459 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 3,796 టీములను పోలింగ్ విధుల కోసం నియమించినట్టు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం పరిధిలో ప్రత్యేకంగా ఐదు పోలింగ్ కేంద్రాల చొప్పున మహిళా బృందాలు, ఒక దివ్యాంగుల బృందం, ఒక యువతతో కూడిన పోలింగ్ బృందాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను సైతం పూర్తి చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ సంగీత, ఎన్ఐసీ అధికారి స్వర్ణ లత, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి శ్రీలక్ష్మి, ఎన్నికల విభాగం అధికారి సైదులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా కలెక్టర్ శశాంక నియోజకవర్గం ఓటింగ్ కిట్ల పంపిణీ కేంద్రం స్ట్రాంగ్రూమ్స్/కౌంటింగ్ కేంద్రం మహేశ్వరం స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ, నాదర్గుల్ బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గొల్లపల్లి రాజేంద్రనగర్ ఓల్డ్ వెటర్నరీ కాలేజీ, రాజేంద్రనగర్ ,, శేరిలింగంపల్లి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి ,, చేవెళ్ల బండారి శ్రీనివాసరావు ఇనిస్టిట్యూట్, గొల్లపల్లి ,, పరిగి మినీ స్టేడియం, పరిగి ,, వికారాబాద్ మేరీ ఏ నాట్స్ స్కూల్స్ ,, తాండూరు సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ హైస్కూల్ ,, -
రూ.40.72 కోట్లకుపైగా సీజ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు, రిటర్నింగ్ అధికారుల తనిఖీల్లో జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. రూ.50 వేలకు మించిన నగదు సహా కొనుగోలు రసీదు చూపని బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,534 కేసుల్లో రూ.49.72 కోట్లకుపైగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడినట్లు రిటర్నింగ్ అధికారి శశాంక వెల్లడించారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై నిఘా ఉంటుందని ప్రకటించారు. -
‘జన’జాతర
సభకు హాజరైన జనం తాండూరు: కాంగ్రెస్ పార్టీ శనివారం తాండూరు పట్టణంలో నిర్వహించిన జనజాతర సభ విజయవంతమైంది. ప్రియాంక గాంధీ ప్రసంగం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. పట్టణంలోని విలియం మూన్ స్కూల్ మైదానం జనాలతో నిండిపోయింది. ఉదయం 10 గంటలకే వేలాది మంది తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి జన సమీకరణలో సక్సెస్ అయ్యారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హెలిక్యాప్టర్లో ప్రియాంక గాంఽధీ, సీఎం రేవంత్రెడ్డితోపాటు అగ్రనేతలు సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గాంధీ కుటుంబాన్ని గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. సీఎం రేవంత్రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించగానే అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. ముఖ్యమంత్రి బీజేపీపై విమర్శనా స్త్రాలు సంధించారు. సభ ఆలస్యం కావడంతో.. ప్రియాంక గాంధీ జనజాతర సభ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం నాలుగు గంటలకు మొదలైంది. ఉదయం 10 గంటలకే గ్రామాల నుంచి తాండూరుకు వచ్చిన జనం నేతల కోసం నిరీక్షించక తప్పలేదు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రియాంక గాంధీ ప్రసంగించే సమయానికి సభలో చాలా కుర్చీలు ఖాళీగా కనిపించాయి. కార్యకర్తల్లో జోష్ నింపినప్రియాంక గాంధీ సీఎం రేవంత్ ప్రసంగానికి అభిమానుల కేరింతలు సభ సక్సెస్తో నేతల సంబరాలు -
No Headline
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎక్కడి ప్రచార రథాలు అక్కడే నిలిచిపోయాయి. శనివారం సాయంత్రం 6 గంటల వరకు హోరెత్తించిన మైక్లు ఆరు తర్వాత మూగబోయాయి. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రచారం ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. పోలీంగ్ బూతుల వారీగా ఓటర్లకు ఓటరు స్లిప్పులతో పాటు గుట్టుగా నగదు, మద్యం సీసాల పంపిణీకి తెరలేపారు. పేదలు ఎక్కువగా నివసించే బస్తీలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రవాహం ఎక్కువగా జరుగుతోంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, వారి కళ్లుగప్పి నగదు ప్రవాహం కొనసాగుతోంది. అభ్యర్థుల బంధువులు, స్నేహితులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, అనుచరులు ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫైనల్ టచ్ ఇచ్చిన అగ్రనేతలు చేవెళ్ల లోక్సభ స్థానాన్ని అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలోకి దిగారు. ఆయా పార్టీల ముఖ్య నేతలు అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల కేంద్రం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. సెగ్మెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ జాతీయ గ్యారంటీలను ప్రకటించింది. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ వంటి ముఖ్య నేతలు పర్యటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర చేవెళ్ల నుంచే మొదలు పెట్టారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం తాండూరులో ప్రియాంకగాంధీ ప్రచారం చేశారు. వికారాబాద్లో అమిత్షా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల అంకానికి ఫైనల్ టచ్ ఇచ్చారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు యాచారం: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు హెచ్చరించారు. రంగారెడ్డి–నల్లగొండ జిల్లాల సరిహద్దు మాల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టును శనివారం ఆయన సందర్శించారు. సాగర్రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాల తనిఖీని పరిశీలించారు. ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉన్న దృష్ట్యా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు గట్టి నిఘా ఉంచాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపించాలని సిబ్బందికి సూచించారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో 49 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో యాచారం సీఐ శంకర్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్వారీ గుంతలో మునిగి విద్యార్థి గల్లంతు కేశంపేట: వేసవికాలం కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన విద్యార్థి గల్లంతైన సంఘటన మండల పరిధిలోని దత్తాయపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టోనిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కాంకిరాళ్లతండాకు చెందిన మూడవత్ సుశీల, రాజుకు ఇద్దరు అడపిల్లలు, నితిన్ సంతానం. నితిన్ షాద్నగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం దత్తాయపల్లి గ్రామ శివారులో ఉన్న క్వారీలోకి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. బట్టలు, చెప్పులను క్వారీ దగ్గర ఉంచి, పై నుంచి క్వారీ గుంతలోకి దూకిన తర్వాత పైకి రాకపోవడంతో అక్కడే ఉన్న స్నేహితులు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహకారంతో క్వారీలో వెతికారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి గాలించినా మృతదేహం లభ్యం కాలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నితిన్ తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తప్పవుఎన్నికల వ్యయ పరిశీలకుడు కుమార్ రాకేష్ రాజన్ ఇబ్రహీంపట్నం రూరల్: లోక్సభ ఎన్నికల వేల ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల వ్యయ నియంత్రన పరిశీలకుడు కుమార్ రాకేష్ రాజన్ పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని బొంగ్లూర్లో ఎస్ఎస్టీ చెక్పోస్టును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్ని వాహనాలు తనిఖీ చేశారు.. పట్టుబడిన నగదెంత అని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శేరిగూడ పోలింగ్ కేంద్రం పరిశీలన ఇబ్రహీంపట్నం: లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడు కుమార్ రాకేష్ రాజన్ శనివారం మండల పరిధిలోని శేరిగూడను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి తదితరులు ఉన్నారు. -
సతుల్.. సుతుల్.. హితుల్..
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ సంపాదించడం ఒక ఎత్తయితే.. లక్షలాది మంది ఓటర్లను కలసి తమకే ఓటు వేయాలని అభ్యర్థించడం అంతకంటే పెద్ద టాస్క్. దీంతో అభ్యర్థులు మాట పక్కన పెడితే వారి కుటుంబ సభ్యులు మాత్రం ప్రచారంలో పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఏసీ గదుల నుంచి మండే ఎండల వైపు.. గేటెడ్ కమ్యూనిటీ నుంచి మురికి వాడల వరకు కష్టనష్టాలను లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకెళ్లారనేది స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. మల్కాజిగిరిలో సునీతకు.. చేవెళ్లలో కాసానికి.. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత తరఫున ఆమె భర్త, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మహేందర్రెడ్డికి కుమారుడు, అల్లుడు కూడా సహకరించారు. లాగే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భార్య జమున సైతం విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉందని చెప్పకనే చెప్పారు. బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ సతీమణి చంద్రకళ, కుమారుడు కాసాని వీరేశ్ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొని ఓటు వేయాలని అభ్యర్థించారు. లష్కర్లో ఫ్యామిలీలదే హవా సికింద్రాబాద్ లోక్సభ బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భార్య కావ్య సైతం ఆయనకు చేదోడుగా నిలిచారు. గతం నుంచి స్వచ్ఛంద సంస్థ నడిపిస్తుండటం ఆమెకు కలిసొచ్చిన అంశం. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రచారంలో ఆయన కుమారుడు రామేశ్వర్గౌడ్, కోడలు శిల్ప కీలకంగా వ్యవహరించారు. అటు సీత.. ఇటు సంగీత.. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజితరెడ్డిలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేశారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి భార్య సంగీతారెడ్డి, కుమారుడు విశ్వజిత్ ప్రచారంలో దూసుకుపోయారు. కొండా కుటుంబ సభ్యులు కొందరు విదేశాల నుంచి వచ్చి మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డి భార్య సీత సైతం విస్తృతంగా పర్యటనలు చేశారు. పార్టీ మహిళా నాయకులతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సకుటుంబ సపరివారం అభ్యర్థులకు అండగా.. లోక్సభ ఎన్నికల ప్రచారం -
57 రోజుల్లో రూ.11.9 కోట్లు స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: లోకసభ ఎన్నికల్లో రాచకొండ పోలీసులు అడుగడుగునా నిఘా పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 8 అంతర్ జిల్లా చెక్ పోస్ట్లను, 29 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 25 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రారంభమైన మార్చి 16 నుంచి ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.11.9 కోట్ల నగదు పట్టుబడింది. అలాగే రూ.2 కోట్లు విలువైన గంజాయి, ఓపియం, ఎండీఎంఏ, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.75.78 లక్షల విలువైన 12,240 లీటర్ల మద్యం, రూ.14.7 లక్షల విలువైన ఆభరణాలతో పాటు రూ.9.26 లక్షల విలువైన వస్తువులను తనిఖీలలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ తరున్ జోషి శనివారం మీడియాకు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద పోలీసు కమిషనరేట్ అయిన రాచకొండలో 62 లక్షల జనాభా ఉండగా.. 35.27 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కమిషనరేట్ పరిధిలో ఐదు లోక్సభ, 13 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 3,396 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా.. వీటిలో 533 క్రిటికల్ స్టేషన్లున్నాయి. ఆయా కేంద్రాలను జియో ట్యాగింగ్ చేశారు. ● కమిషనరేట్ పరిధిలో మొత్తం 1,114 లైసెన్స్డ్ ఆయుధాలు ఉండగా.. వీటిలో 806 ఆయుధాలు పోలీసుల వద్ద డిపాజిట్ అయ్యాయి. మిగిలినవి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మినహాయింపు ఇచ్చారు. 1,036 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయగా..4,892 మంది అనుమానితులు, రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. ● 8 డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కలెక్షన్ సెంటర్లను, మూడు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బందోబస్తులో 6 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఐటీ బృందంలోని 72 మంది పోలీసులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తుంటారు. రూ.2 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు కూడా Æ>-^èl-Mö…yýlÌZ 533 çÜÐ]l$ÝëÅ™èlÃMýS ´ùÍ…VŠæ õÜtçÙ¯]l$Ï ఆరు వేల మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడి -
ప్రచారంలో మాటల తూటాలు
సాక్షి, సిటీబ్యూరో: మహాభారత కురుక్షేత్రంలో యోధానుయోధులు పాల్గొన్నట్లే.. ప్రజాస్వామ్య రణక్షేత్రంలో తమ పార్టీని గెలిపించేందుకు అతిరథ మహారథులు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు తాము అమలు చేయబో యే సంక్షేమ కార్యక్రమాల కంటే ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు మాటల తూటాలనే ప్రధాన ఆయుధాలుగా మలచుకున్నారు. నువ్వొకటంటే నేను రెండంటా అన్న చందంగా అవినీతి, రిజర్వేషన్లు, కరెంటు, రాజ్యాంగం, యూటీ తదితర అంశాలను ప్రస్తావించారు. గ్రేటర్ పరిధిలో 4 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గెలిస్తే మూడొంతుల ప్రజల మనసులు గెలుచుకున్నట్లు కావడంతో ప్రత్యేక శ్రద్ధ చూపారు. పాతబస్తీ పరిధిలో సైతం గతానికి భిన్నంగా పరిస్థితి మారింది. ప్రచా రం కంటే చేసే పనులే గెలిపిస్తాయని నమ్మే మజ్లిస్ పార్టీ సైతం ఈసారి ప్రచారంలోకి దిగడం పోటీ తీవ్రతను చాటింది. మిగతా మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ ప్రచారాలతో దుమారం రేపాయి. ప్రధాని మోదీ, అమిత్ షా.. ప్రధాని మోదీ గ్రేటర్ పరిధిలోని నియోజక వర్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. మల్కాజిగిరిలో రో డ్షోలో, ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పా ల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహిస్తున్న హోంమంత్రి అమిత్షా ఓల్డ్సిటీలో రోడ్షోతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో, చేవెళ్ల లోక్సభ పరిధిలోని వికారాబాద్లలో ప్రచారాల్లో పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ పార్టీకి చెందిన మరికొందరు జా తీయ నాయకులు రాజ్నాథ్ సింగ్, తేజస్వీ సూర్య, నవనీత్కౌర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రా ష్ట్రాల సీఎంలు భూపేంద్ర పటేల్, మోహన్ యాద వ్, భజన్లాల్ శర్మలు సైతం పర్యటనలు చేశారంటే ఎంతటి ప్రాధాన్యమిచ్చారో ఊహించుకోవచ్చు. రాహుల్.. ప్రియాంక.. రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ తదితరులు పార్టీ విజయం కోసం ప్రచారాల్లో పా ల్గొన్నారు. రాహుల్ గాంధీ సరూర్నగర్ ఇండోర్ స్టే డియంలో బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చే శారు. ప్రియాంకా గాంధీ తాండూరు, పటాన్చెరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేశారు. కేసీఆర్, కేటీఆర్.. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ బస్సుయాత్రతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేశారు. ఇలా ఎవరికి వారుగా అన్ని పార్టీల హేమాహేమీల ప్రచారాలకు ప్రజలు హాజరైనప్పటికీ, ఎవరికి ఓట్లేస్తారో చెప్పే పరిస్థితి లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపుగా ఇదే స్థాయిలోనేతలు వచ్చినా ఆ ప్రభావం పోలింగ్లో కనిపించకపోవడం తెలిసిందే. గతానికి భిన్నంగా అంశాల ప్రస్తావన -
ఓటేయండి.. రాయితీ పొందండి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలూ నడుం బిగించాయి. రకరకాల ఆఫర్లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కమ్యూనిటీ యాప్ ర్యాపిడో ఓటర్లను పోలింగ్ రో జున ఉచితంగా సేవలు అందించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘంతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఓటర్లు ర్యాపిడో యాప్లో ‘ఓట్ నౌ’ కోడ్ను ఉపయోగించి ఉచితంగా బైక్, ఆటో, క్యాబ్ సేవలను అందుకోవచ్చు. తాజాగా అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా ఓటర్లకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. వేలిపై సిరా చుక్కను చూపిస్తే వండర్లా టికెట్పై 20 శాతం రాయితీని ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 15 తేదీల్లో ఆన్లైన్, ఆఫ్లైన్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వండర్లా హాలిడేస్ ఎండీ అరుణ్ చిట్టిలపిల్లి ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ప్రముఖ డైనింగ్ ఔట్ ఫ్లాట్ఫాం స్విగ్గీ డైన్ఔట్ భోజన ప్రి యులకు భలే ఆఫర్ను ప్రకటించింది. ఓటర్లు వేలి పై సిరా చుక్కను చూపించి స్విగ్గీ డౌన్ఔట్లోని ఎంపిక చేసిన రెస్టారెంట్ల బిల్లులో 50 శాతం తగ్గింపు ఆఫర్ను అందిస్తుంది. అంతేరా కిచెన్ అండ్ బార్, పపాయ, ఎయిర్ లైవ్, ఫుడ్ ఎక్స్ఛేంజ్–నోవాటెల్, రెడ్ రీనో, కాఫీ కప్ వంటి పలు రెస్టారెంట్లలో ఈ ఆఫర్ను అందుకోవచ్చని స్విగ్గీ డౌన్ఔట్ హెడ్ స్వప్నిల్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ శాతం పెంచేందుకుస్పెషల్ ఆఫర్లు -
రూ.16,143 విలువైన మద్యం సీజ్
యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో శనివారం రూ.16,143 విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు సీఐ నర్సింహరావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న పద్మ, గీతాబాయిలను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వృద్ధురాలి పుస్తెలతాడు చోరీ శంషాబాద్ రూరల్: నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడుతో పాటు సెల్ఫోన్ను ఎత్తుకెళ్లిన ఘటన సుల్తాన్పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాటకారి లక్ష్మి (60) శుక్రవారం రాత్రి భోజనం చేసి మేడపై నిద్రించింది. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి మేడపైకి వచ్చి.. ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లాడు. గమనించిన లక్ష్మి దుండగుడిని పట్టుకునేందుకు యత్నించినా.. తప్పించుకున్నాడు. అంతేగాకుండా ఇంట్లోని సెల్ఫోన్ను కూడా దోచుకెళ్లినట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. రోడ్డు తవ్వకంపై ఫిర్యాదు శంషాబాద్: పట్టణంలోని ఎయిర్పోర్టు ముఖద్వారం వద్ద ఉన్న ప్రధాన రహదారి పక్కనే గల రోడ్డును ఓ రిటైర్డ్ అధికారి తవ్వించాడని పక్కనే ఉన్న భూ యజమాని ఫసీయుద్దీన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్పోర్టు నిర్మాణం సమయంలో రోడ్డులో సంబంధిత వ్యక్తి భూమిని సేకరించినప్పటికీ ఆయన ప్రస్తుతం ఉన్న రహదారి కూడా తనదేనని వాదిస్తున్నారన్నారు. దీనిపై రెవెన్యూ, పోలీసులు స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రహదారిని అడ్డంగా తవ్వడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. రైల్వేస్టేషన్లోప్రత్యేక భద్రతా చర్యలు సికింద్రాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక్కమారుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. పొరుగు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు తరలి వెళ్లేందుకు పెద్దసంఖ్యలోని ప్రయాణికులు రైల్వేస్టేషన్కు తరలివస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించడం, గందరగోళ పరిస్థితులు నివారించడం కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు శనివారం ప్రత్యేక చర్యలు అమలులోకి తెచ్చారు. ఆర్పీఎఫ్ సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ బీఎస్ సరస్వత్ నేతృత్వంలో 60 మంది అదనపు రక్షణ బలగాన్ని రైల్వేస్టేషన్కు తరలించారు. రైళ్లు వచ్చి వేళ్లే సమయంలో ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు ప్రయాణికుల క్యూ లైన్లు ఏర్పాటు చేసి గందరగోళ పరిస్థితులను నివారిస్తున్నారు. చోరీలు జరుగకుండా ఉండేందుకు గస్తీని పెంచారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైనా 139 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేసి ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. -
Swimming Pool: అయ్యో శివశౌర్య
మొయినాబాద్: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని.. ఆటలో మెలకువలు నేర్చుకుందామని వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారాడు. స్విమ్మింగ్పూల్లో మునిగి ఒకటో తరగతి చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం సుజాత స్కూల్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్కు చెందిన గాండ్ల విక్రమ్ చిన్న కుమారుడు గాండ్ల శివశౌర్య (7) నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని సుజాత స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్కూల్లో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు క్రికెట్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, యోగాతో పాటు స్విమ్మింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విక్రమ్ తన కుమారుడు శివశౌర్యను బ్యాడ్మింటన్ నేరి్పంచేందుకు క్యాంపులో చేరి్పంచాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో శివÔౌర్య స్విమ్మింగ్ చేస్తూ నీటిలో మునిగాడు. సిబ్బంది గమనించి విద్యారి్థని బయటకు తీశారు. నీళ్లు మింగి అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. నాలుగు రోజులుగా పిల్లల స్విమ్మింగ్ పూల్ రిపేర్లో ఉంది. దీంతో పెద్దల స్విమ్మింగ్ పూల్లోనే పిల్లలను స్విమ్మింగ్ చేయిస్తున్నారు. పిల్లలకు సేఫ్టీ బెలూన్స్ లేవని.. అవి తేవాలని కోచర్లు యాజమాన్యానికి సూచించినా వారు పట్టించుకోలేదని తెలిసింది. గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు సమ్మర్ క్యాంపులో భాగంగా బ్యాడ్మింటన్ శిక్షణకు పంపామని.. స్విమ్మింగ్ చేయిస్తున్నట్లు తమకు తెలియదని చిన్నారి తండ్రి విక్రమ్ రోదించారు. తమ కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమని వాపోయారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. -
కేశంపేటలో టెన్షన్.. టెన్షన్
కేశంపేట: ఆ రెండు పార్టీల నేతల పోటాపోటీ నినాదాలతో షాద్నగర్ నియోజకవర్గం కేశంపేటలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వివరాలు.. జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేటలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బుధవారం దాదాపు ఒకే సమయంలో ప్రచారం చేపట్టాయి. ప్రచారానికి సంబంధించి ఆయా పార్టీల నాయ కులు అనుమతులు కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకె అరుణతో పాటు ఆ పార్టీ ముఖ్యనాయకులు కేశంపేటకు చేరుకున్నారు. ఈ క్రమంలో బీజీపీ నాయకులు కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ వైపు వెళ్లకుండా వైఎస్సార్ చౌరస్తా వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వారిని నిలువరించారు. అయితే ఈ మార్గం గుండా ర్యాలీ నిర్వహించేందుకు తమకు అనుమతులు ఉన్నాయని, ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోటాపోటీ నినాదాలు.. ఈ క్రమంలో వైఎస్సార్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడంతో పాటు పోలీసు లను తోసుకుంటూ బీజేపీ నాయకులు.. కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ జరుగుతున్న అంబేద్కర్ చౌరస్తా వైపు దూసుకెళ్లారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకేచోటకు రావడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు జై మోదీ, జై బీజేపీ, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు జై కాంగ్రెస్, జై సోనియా అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటకముందే పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పి శాంతింపజేశారు. ఒకే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రచారం కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ వైపు దూసుకెళ్లేందుకు కమలదళం యత్నం బారికేడ్లు, పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లిన నేతలు పోటాపోటీగా ఇరువర్గాల నినాదాలు -
స్వాగత తోరణం కూలి మహిళ మృతి
మొయినాబాద్: బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల స్వాగత తోరణం ఈదురు గాలులకు కూలి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని చిన్నమంగళారంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జహీరాబేగం(45) మంగళవారం రాత్రి కూరగాయలకు వెళ్తుండగా వేగంగా ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో గ్రామంలో ఇటీవల బీరప్ప బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుద్దీపాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈదురు గాలికి ఆ తోరణం కూలి మహిళపై పడింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.చిన్నమంగళారంలో ఈదురుగాలుల బీభత్సం -
మెజార్టీ సీట్లు సాధిస్తాం
కొత్తూరు: దేశ రక్షణ కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. కొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పాలనలోనే దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని, ప్రపంచంలో భారత దేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వల్లనే ఒక ప్రత్యేకత వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గత పదేళ్లలో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినప్పటికీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అదేపనిగా ఎన్డీఏ సర్కార్ను విమర్శిస్తున్నాయన్నారు. అయితే ప్రజలు అన్నిటిని గమనిస్తున్నారని.. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీవర్ధన్రెడ్డి, నర్సింహగౌడ్, సదానంద్గౌడ్, రమేష్, మాణిక్యం, నాగరాజుచారి తదితరులు పాల్గొన్నారు. పదేళ్లలో విప్లవాత్మక మార్పులు షాద్నగర్: దేశం మరింత అభివృద్ధి సాధించాలంటే కేవలం బీజేపీ ద్వారానే సాధ్యమని ప్రముఖ నటి, ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలో బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నిర్వహించిన రోడ్షోలో నవనీత్ కౌర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశాభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. తద్వారా పదేళ్లలో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. కమలం పుప్పు గుర్తుకు ఓటువేసి డీకే ఆరుణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీవర్ధన్రెడ్డి, నాయకులు.. అందెబాబయ్య, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ -
బీజేపీని బొందపెట్టాలి
ఇబ్రహీంపట్నం: మతోన్మాద బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందపెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ను గెలిపించాలని కోరుతూ బుధవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ. విద్వేషాలను రెచ్చగొడుతోందని బీజేపీపై ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతు ఆదాయం రెట్టింపు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరల కోసం ఢిల్లీలో ఆందోళన చేపట్టిన 760 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పాపం ఆ పార్టీదేనని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణకు లేకుండాపోయిందని, వీరిపై జరుగుతున్న అఘాయిత్యాల కేసుల్లో బీజేపీ నేతలే ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారని తెలిపారు. రాజ్యాంగ సంస్థలను అణగదొక్కేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీలో చేరని వారిపై వీటిని ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలకు చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేసీఆర్ కుమార్తైపె కేసులు పెట్టిందన్నారు. ఎలక్షన్ కమిషన్ను నిర్వీర్యం చేసే విధంగా చట్టాన్ని మార్చారన్నారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్లో గెలిచిన ఎంపీలు ఆ పార్టీలో ఉంటారనే గ్యారంటీలేదని ఎద్దేవా చేశారు. అధికారంతో ప్రమేయం లేకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసేదే ఎర్రజెండా అని తెలిపారు. 2006లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైఒత్తిడి తెచ్చి ఉపాధి హామి పథకం చట్టాన్ని తెచ్చేలా చేసిన ఘనత కమ్యూనిస్టులదేనని స్పష్టంచేశారు. అటవీ చట్టాన్ని అమలు చేసేలా కేసీఆర్పై ఒత్తిడి చేసింది తామేనన్నారు.పార్లమెంట్లో మాట్లాడలేని అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపిస్తే ప్రయోజనం లేదని తెలిపారు. ప్రజల, కార్మికుల పక్షాన పోరాడే ఆదర్శ కమ్యూనిస్టు ఎండీ జహంగీర్ను భువనగిరి నుంచి పార్లమెంట్కు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్, నేతలు సామేల్, పి.యాదయ్య, కే. జగన్, జగదీశ్, అలంపల్లి నర్సింహ్మ, కవిత, జయలక్ష్మి పాల్గొన్నారు. ఆ పార్టీ మాట వినని వారిపై ఈడీ, సీబీఐని ఉసిగొల్పుతోంది ముఖ్యమంత్రులతో పాటు కేసీఆర్ కూతురుపై కేసులు పెట్టింది రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం -
పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ల (వీఎఫ్సీ) ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసే ఓటింగ్ గడువును ఎన్నికల సంఘం ఈనెల 10వ తేదీ(శుక్రవారం) వరకు పొడిగించిందని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. వాస్తవానికి బుధవారంతో గడువు ముగియగా.. ఎన్నికల కమిషన్ మరో రెండు రోజుల పాటు గడువు పొడిగించిందని.. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఈనెల 7వ తేదీ వరకు 16,088 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. అలాగే 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు 994 మంది.. ఓట్ ఫ్రమ్ హోమ్లో భాగంగా ఇంటినుంచే ఓటుహక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. సెకెండ్ ర్యాండమైజేషన్ పూర్తి.. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ స్థానానికి సంబంధించిన అదనపు ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక నేతృత్వంలో సాధారణ పరిశీలకులు రాజేందర్ కుమార్ కటారియా, వ్యయ పరిశీలకులు రాజీవ్ చావ్రా సమక్షంలో అదనపు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల రెండవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని వికారాబాద్ జిల్లాలో గల పరిగి, వికారాబాద్, తాండూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కమిషనింగ్ సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన ఈవీఎంల స్థానంలో అదనంగా కేటాయించబడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బుధవారం రెండవ విడత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించారు. పోలింగ్ సమయంలో ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే, నిమిషాల వ్యవధిలోనే సెక్టోరల్ అధికారులు సంబంధిత పోలింగ్ స్టేషన్కు చేరుకుంటే తమ వద్ద రిజర్వ్లో ఉండే కంట్రోల్ యూనిట్లను సమకూరుస్తారని కలెక్టర్ తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, వారి తరఫున ప్రతినిధులు, సంబంధిత అధికారులు ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ సందర్శన.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్ను, కంట్రోల్ రూమ్ను ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్ చావ్రా బుధవారం పరిశీలించారు. ఎంసీఎంసీలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఐడీఓసీలో నెలకొల్పిన కంట్రోల్ రూంను సందర్శించారు. 1950 టోల్ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరుతెన్నులు గమనించారు. చెక్పోస్ట్ల వద్ద తనిఖీ బృందాల పని తీరు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును కంట్రోల్ రూంలో జీపీఆర్ఎస్ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. 10వ తేదీ వరకు ఓటువేసే అవకాశం ఎన్నికల సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి: ఆర్ఓ, కలెక్టర్ శశాంక -
కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి కేశంపేట: దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి రావాలని మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్ధి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని సంగెం, కేశంపేట, కొండారెడ్డిపల్లిలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డితో కలసి చల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే షాద్నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. హస్తం గుర్తుకు ఓటువేసి చల్లాను ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం మండల పరిధిలోని పొల్కొనిగుట్ట తండాకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో సీ్త్రశిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ జిల్లా చైర్పర్సన్ తాండ్ర విశాల శ్రావణ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, నాయకులు.. శ్రీధర్రెడ్డి, ఆనంద్కుమార్, సుందరయ్య, రూప్లానాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.. షాబాద్: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని రాజ్యసభ ఎంపీ అనిల్కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి నగంరంలో శ్రీనివాస్గౌడ్, జీఎంఎస్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్, ఫహీమ్ ఖురేషీ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. హస్తం గుర్తుకు ఓటువేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షరీఫ్, జాకీర్షరీఫ్, నాయకులు తదితరులున్నారు. రంజిత్రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం.. మొయినాబాద్ రూరల్: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమష్టిగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ అన్నారు. మొయినాబాద్ మండలంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సీపీఎం, సీపీఐ, జనసమితి, మిగతా ప్రజా సంఘాలన్నిటికి సంబంధించి పీసీసీ కార్యవర్గం తనను కమిటీ సభ్యుడిగా నియమించిందనితెలిపారు. అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. తన నియామకానికి సహకరించిన మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్కుమార్, ఎమ్మెల్సీ వెంకట్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
భువనగిరి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
ఇబ్రహీంపట్నం: భువనగిరి ప్రాంత అభివృద్ధిపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చర్చకు రావాలని సీపీఎం ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పాషానరహరి స్మారక కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జహంగీర్ మాట్లాడుతూ.. భువనగిరి లోక్సభ పరిధిలో తాగు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని.. ఇబ్రహీంపట్నం వేదికగా ఈ అంశంపై చర్చకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. స్థానిక సమస్యలపై ఎటువంటి అవగాహన లేని నాయకులు కేవలం డబ్బుతోనే ఎన్నికల్లో గెలవచ్చనే అపోహలో ఉన్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సీపీఎంకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జాన్వెస్లీ, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు జయలోమ్మ, జిల్లా కార్యదర్శి భాస్కర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్, నాయకులు.. సామేల్, యాదయ్య, జగదీశ్, నర్సింహ, కవిత, జగన్, జంగయ్య, ఎల్లేశ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకుసీపీఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ సవాల్ ఇబ్రహీంపట్నంలో ముమ్మర ప్రచారం -
కొండాను గెలిపించండి
కందుకూరు: చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. కందుకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పలువురు నాయకులు బుధవారం ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. లేమూరు ఎంపీటీసీ సభ్యుడు యాదయ్య, ఆ గ్రామ బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్రెడ్డి, నారాయణరెడ్డి, అగర్మియాగూడ మాజీ ఉపసర్పంచ్ ఆదీబ్ తదితరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ దేవేందర్రెడ్డి, సీనియర్ నాయకులు భిక్షపతి, జగదీశ్వర్రెడ్డి, ఆంజనేయులు, యాదగిరిరెడ్డి, నారాయణ, వెంకటేశ్, బాలకృష్ణ, శ్రీకాంత్, రవీందర్రెడ్డి, రాజు, రాఘవేందర్, ఆకాష్రెడ్డి, నారాయణ పాల్గొన్నారు. శంషాబాద్లో బీఆర్ఎస్కు షాక్ కాంగ్రెస్లో చేరిన కారు పార్టీ కౌన్సిలర్లు శంషాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్లో బీఆర్ఎస్కు ఎదురుదెెబ్బ తగిలింది. మాజీ మంత్రి కేటీఆర్ రోడ్షో సక్సెస్ అయిందన్న సంతోషంలో ఉన్న బీఆర్ఎస్కు మరుసటిరోజే కౌన్సిలర్లు షాకిచ్చారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో 2వ వార్డు కౌన్సిలర్ భద్రునాయక్, 22 కౌన్సిలర్ ఎం.శ్రీకాంత్యాదవ్, 23వ వార్డు కౌన్సిలర్ శ్రవంత్శ్రీకాంత్రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ బండి భాగ్యలక్ష్మి, 5వ వార్డు కౌన్సిలర్ మస్రజ్జాతాజ్బా సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి రోడ్షోలో 15వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంజయ్యాదవ్, పీసీసీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు జల్లపల్లి నరేందర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్తోనే బీసీలకు గుర్తింపు పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని హుడాకాంప్లెక్స్: బీఆర్ఎస్ పార్టీతోనే బీసీలకు గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం సరూర్నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. ఉచితాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యలు, బీసీల గళం వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఎంపీ సీట్లు గెలిపించాలని కోరారు. సబితారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జ్ఞానేశ్వర్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు గోపాల్, అంకిరెడ్డి, అరవింద్కుమార్, జహీర్, రుషిగుప్తా, సలీం, కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాశాలను తరలించుకుపోయారు.. కందుకూరు: బీఆర్ఎస్ హయాంలో తాము కందుకూరులో శంకుస్థాపన చేసిన మెడికల్ కళాశాల, ఆస్పత్రులను.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి ఇక్కడ నిర్మించకుండా రద్దుచేసి కొడంగల్ తరలించుకుపోయారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. బుధవారం రాత్రి కందుకూరులో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్తో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు సేకరిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీని రద్దు చేసిందని.. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయన్నారు. కాసాని జ్ఞానేశ్వర్కు ఓటువేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జయేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్రెడ్డి, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనర్సింహారెడ్డి, అంజయ్యగౌడ్, దశరథ, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్రెడ్డి, మహిళా నాయకురాలు జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement