-
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
India Open 2024: ప్రణయ్, ప్రియాన్షు శుభారంభం
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ 9వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్, 30వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 19వ ర్యాంకర్ లక్ష్య సేన్, 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రణయ్ 21–6, 21–19తో ప్రపంచ 13వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించగా... ప్రియాన్షు 16–21, 21–16, 21–13తో లక్ష్య సేన్కు షాక్ ఇచ్చాడు. మరో మ్యాచ్లో కిరణ్ జార్జి 12–21, 15–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) జోడీ లు తొలి రౌండ్ను దాటలేకపోయాయి. గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 14–21, 13–21తో నాలుగో ర్యాంక్ జోడీ నమి మత్సుయామ–íÙడా చిహారు (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. టింగ్ యెంగ్–పుయ్ లామ్ యెంగ్ (హాంకాంగ్) జంట 21–6, 21–7తో రితూపర్ణ–శ్వేతపర్ణ జోడీపై గెలిచింది. -
Australian Open: శ్రమించిన జొకోవిచ్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ఆదివారం మొదలైన ఈ టోరీ్నలో తొలి రౌండ్ మ్యాచ్లో జొకోవిచ్ 6–2, 6–7 (5/7), 6–3, 6–4తో ప్రపంచ 178వ ర్యాంకర్, క్వాలిఫయర్ డినో ప్రిజ్మిక్ (క్రొయేíÙయా)పై కష్టపడి గెలిచాడు. 4 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ 11 ఏస్లు సంధించాడు. 40 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ 49 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ప్రత్యర్థి సరీ్వస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సరీ్వస్ను నాలుగుసార్లు కోల్పోయాడు. సబలెంకా సులువుగా... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. రెండో సీడ్ సబలెంకా 6–0, 6–1తో 53 నిమిషాల్లో ఇలా సెడెల్ (జర్మనీ)పై గెలిచింది. ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) కూడా రెండో రౌండ్కు చేరుకున్నారు. -
శ్రీకాంత్ మరో పరాజయం
లక్నో: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మాజీ ప్రపంచ నంబర్వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈ ఏడాది తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోతున్నాడు. సొంతగడ్డపై జరుగుతోన్న సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ టోర్నీలోనూ శ్రీకాంత్ ఆటకు మొదటి రౌండ్లోనే తెరపడింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో ఆరో సీడ్ శ్రీకాంత్ 21–23, 8–21తో చైనీస్ తైపీకి చెందిన చియా హవొ లీ చేతిలో వరుస గేముల్లో పరాజయం చవి చూశాడు. ఇతర మ్యాచ్ల్లో కిరణ్ జార్జ్ 21–16, 14–21, 21–13తో భారత్కే చెందిన క్వాలిఫయర్ చిరాగ్ సేన్పై గెలుపొందగా, సమీర్ వర్మ 9–21, 21–7, 17–21తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ప్రియాన్షు రజావత్ 21–17, 21–19తో డిమిట్రి పనరిన్ (కజకిస్తాన్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్లో క్లిష్టమైన డ్రా ఎదురవడంతో మాల్విక బన్సోద్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆమె 21–18, 17–21, 10–21తో జపాన్ స్టార్ నజొమి ఒకుహర చేతిలో ఓడిపోయింది. భారత సహచరుల మధ్య జరిగిన పోరులో ఉన్నతి హుడా 15–21, 21–19, 21–18తో ఆకర్షి కశ్యప్పై గెలుపొందగా, క్వాలిఫయర్ కేయూర 8–21, 16–21తో ఎనిమిదో సీడ్ సంగ్ షు యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ 21–9, 21–16తో భారత్కే చెందిన అపూర్వ –సాక్షి గెహ్లావత్ జంటపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో కోన తరుణ్–శ్రీకృష్ణప్రియ జంటకు 14–21, 15–21తో నితిన్ కుమార్–నవధ మంగళం జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
శ్రీకాంత్ పరాజయం
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్లకు నిరాశ ఎదురైంది. ఈ ముగ్గురూ తొలి రౌండ్ను దాటలేకపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–14, 13–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 18–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ షి యు కి (చైనా) చేతిలో... 30వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 14–21తో 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) ద్వయం 15–21, 9–21తో షు జియాన్ జాంగ్–యు జెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
అల్కరాజ్ అలవోకగా...
న్యూయార్క్: గత పదిహేనేళ్లుగా యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వరుసగా రెండేళ్లు ఒకే ప్లేయర్కు టైటిల్ దక్కలేదు. ఈ ఘనత సాధించేందుకు ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ చేరువయ్యాడు. సీజన్ నాలుగో గ్రాండ్స్లామ్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ అలవోక విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 2 గంటల 30 నిమిషాల్లో 6–3, 6–2, 6–4తో గెలుపొందాడు. మూడు ఏస్లు సంధించిన అల్కరాజ్ మూడు డబుల్ ఫాల్ట్లు కూడా చేశాడు. నెట్వద్దకు 35 సార్లు దూసుకొచ్చిన అతను 28 సార్లు పాయింట్లు గెలిచాడు. నాలుగుసార్లు జ్వెరెవ్ సర్విస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్విస్ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. 2020లో ఈ టోర్నీలో రన్నరప్గా నిలిచిన జ్వెరెవ్ నాలుగు డబుల్ ఫాల్ట్లు, 35 అనవసర తప్పిదాలు చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–3, 6–4తో ఎనిమిదో సీడ్, తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్ను ఓడించి ఈ టోర్నీలో నాలుగోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్తో మెద్వెదెవ్ తలపడతాడు. 2021లో చాంపియన్గా నిలిచిన మెద్వెదెవ్ ... 2020లో సెమీఫైనల్లో, 2019లో ఫైనల్లో ఓడిపోయాడు. వొండ్రుసోవాకు కీస్ షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) పోరాటం ముగిసింది. 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–4తో వొండ్రుసోవాను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో 2018 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో కీస్ మూడుసార్లు వొండ్రుసోవా సర్వీస్ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్స్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)తో కీస్; ముకోవా (చెక్ రిపబ్లిక్)తో కోకో గాఫ్ (అమెరికా) తలపడతారు. -
జొకోవిచ్ శుభారంభం
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంతో యూఎస్ ఓపెన్లో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అలవోకగా రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–0, 6–2, 6–3తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. ఈ గెలుపుతో 36 ఏళ్ల జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ముగిశాక తుది ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంటాడు. ముల్లర్తో గంటా 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ ఆరు ఏస్లు సంధించాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్ను ఒకసారి కోల్పోయాడు. మరోవైపు నాలుగో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన రూనె 3–6, 6–4, 3–6, 2–6తో కార్బెలాస్ బేనా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), పదో సీడ్ టియాఫో (అమెరికా), తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో ఆరో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కష్టపడి రెండో రౌండ్కు చేరగా... రెండుసార్లు మాజీ రన్నరప్ వొజి్నయాకి (డెన్మార్క్) సులువుగా రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. కోకో గాఫ్ 2 గంటల 51 నిమిషాల్లో 3–6, 6–2, 6–4తో సిగెముండ్ (జర్మనీ)పై, వొజి్నయాకి 6–3, 6–2తో ప్రొజోరోవా (రష్యా)పై గెలిచారు. -
సంచలనాలతో బోణీ...
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అదరగొట్టే ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై... ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాలు సాధించారు. లీ షి ఫెంగ్పై ప్రణయ్కిది వరుసగా మూడో విజయంకాగా... చౌ తియెన్ చెన్పై శ్రీకాంత్కిది రెండో గెలుపు. 2014లో హాంకాంగ్ ఓపెన్లో చౌ తియెన్ చెన్ను తొలిసారి ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్తో ఆడిన ఆరుసార్లు ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ నంబర్వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్లో ఆకర్షి 17–21, 17–21తో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 11–21, 21–15, 21–14తో సయాకా హొబారా–యు సుజు (జపాన్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–18, 9–21, 18–21తో యె హోంగ్ వె–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
వింబుల్డన్-2023లో సంచలనం.. టాప్ ప్లేయర్కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో సంచలనం నమోదైంది. బ్రిటన్ ప్లేయర్, వైల్డ్కార్డ్ ఎంట్రీ, ప్రపంచ 142వ ర్యాంకర్ లియామ్ బ్రాడీ 3 గంటల 27 నిమిషాల పోరులో 6–4, 3–6, 4–6, 6–3, 6–0తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లలో, ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన రూడ్ వింబుల్డన్ టోర్నీలో నాలుగో ప్రయత్నంలోనూ రెండో రౌండ్ను దాటలేకపోయాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 6–3, 6–4, 7–5తో కరాత్సెవ్ (రష్యా)పై, వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 4–6, 6–4, 6–2తో ఎచెవరి (అర్జెంటీనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్ లో ఐదో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 3–6, 6–4, 7–6 (10/6)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా) పై నెగ్గింది. తొలి రౌండ్ మ్యాచ్లో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 7–5, 1–6తో జూలీ నిమియెర్ (జర్మనీ) చేతిలో ఓడింది. -
Wimbledon 2023: అల్కరాజ్ అలవోకగా...
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో అల్కరాజ్ 6–0, 6–2, 7–5తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ పది ఏస్లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. చార్డీ సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఈ స్పెయిన్ స్టార్ తన సరీ్వస్ను ఒకసారి కోల్పోయాడు. నెట్ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చిన అల్కరాజ్ ఏడుసార్లు పాయింట్లు గెలిచాడు. 38 విన్నర్స్ కొట్టిన అతను 14 అనవసర తప్పిదాలు చేశాడు. మరో మ్యాచ్లో రెండుసార్లు చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కూడా అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రియాన్ పెనిస్టన్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ముర్రే 6–3, 6–0, 6–1తో విజయం సాధించాడు. వర్షం కారణంగా రెండో రోజు పలు మ్యాచ్లకు అంతరాయం కలిగింది. పైకప్పు కలిగిన సెంటర్ కోర్టు, నంబర్వన్ కోర్టులోని మ్యాచ్లు సజావుగా సాగాయి. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. రిబాకినా 4–6, 6–1, 6–2తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై నెగ్గింది. మరో మ్యాచ్లో ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిషియా) 6–3, 6–3తో మగ్ధలినా ఫ్రెచ్ (పోలాండ్)ను ఓడించింది. సోమవారం ఆలస్యంగా ముగిసిన తొలి రౌండ్ మ్యాచ్లో ఏడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 4–6, 6–4, 2–6తో 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. -
జొకోవిచ్ రికార్డు
పారిస్: కెరీర్లో 23వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్లో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ రికార్డు సృష్టిస్తూ 17వసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో రాఫెల్ నాదల్ అత్యధికంగా 16 సార్లు క్వార్టర్ ఫైనల్ చేరగా... నాదల్తో సమంగా ఉన్న జొకోవిచ్ తాజా విజయంతో ఈ స్పెయిన్ దిగ్గజాన్ని దాటి ముందుకు వెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)పై గెలుపొందాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఏడు ఏస్లు సంధించాడు. ప్రత్యర్థి సర్విస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన అతను నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఓవరాల్గా గ్రాండ్స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రికార్డు ఫెడరర్ (స్విట్జర్లాండ్; 58 సార్లు) పేరిట ఉంది. జొకోవిచ్ (55 సార్లు) రెండో స్థానంలో, నాదల్ (47 సార్లు) మూడో స్థానంలో, జిమ్మీ కానర్స్ (41 సార్లు) నాలుగో స్థానంలో, రాయ్ ఎమర్సన్ (37 సార్లు) ఐదో స్థానంలో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా)తో జొకోవిచ్ ఆడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 1–6, 6–4, 7–6 (9/7), 6–1తో సొనెగో (ఇటలీ)పై నెగ్గాడు. అల్కరాజ్ అలవోకగా... ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) మరో అలవోక విజయంతో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అల్కరాజ్ 6–3, 6–2, 6–2తో లొరెంజె ముజెట్టి (ఇటలీ)పై గెలిచాడు. ఆరు ఏస్లు సంధించిన అల్కరాజ్, ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), సెబాస్టియన్ ఆఫ్నర్ (ఆ్రస్టియా) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. పావ్లీచెంకోవా ముందంజ... మహిళల సింగిల్స్ విభాగంలో 2021 రన్నరప్ పావ్లీచెంకోవా (రష్యా), ముకోవా (చెక్ రిపబ్లిక్), స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో పావ్లీచెంకోవా 3 గంటల 9 నిమిషాల్లో 3–6, 7–6 (7/3), 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించగా... ముకోవా 6–4, 6–3తో అవనెస్యాన్ (రష్యా)పై గెలిచింది. స్వితోలినా గంటా 56 నిమిషాల్లో 6–4, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)ను బోల్తా కొట్టించింది. కసత్కినా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్లో టాప్–10లో నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. 44 ఏళ్ల తర్వాత... బ్రెజిల్కు చెందిన 14వ సీడ్ బీత్రిజ్ హదాద్ మాయ మూడో రౌండ్ మ్యాచ్లో 5–7, 6–4, 7–5తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన బ్రెజిల్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. బ్రెజిల్ తరఫున చివరిసారి 1979లో పాట్రిసియా మెద్రాడో ఈ ఘనత సాధించింది. -
French Open: 5 గంటల 26 నిమిషాలు.. సంచలన ఫలితం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం సంచలన ఫలితం నమోదైంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఎనిమిదో సీడ్ యానిక్ సినర్ (ఇటలీ) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 5 గంటల 26 నిమిషాలపాటు పోరాడిన ప్రపంచ 79వ ర్యాంకర్ డానియల్ అల్ట్మైర్ (జర్మనీ) రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాపాడుకొని సినర్ను బోల్తా కొట్టించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ఈ మారథాన్ సమరంలో అల్ట్మైర్ 6–7 (0/7), 7–6 (9/7), 1–6, 7–6 (7/4), 7–5తో సినర్ను ఓడించాడు. ఈ గెలుపుతో గత ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో సినర్ చేతిలో ఎదురైన ఓటమికి అల్ట్మైర్ బదులు తీర్చుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నాలుగో సెట్లోనే సినర్ విజయం అంచుల్లో నిలిచాడు. నాలుగో సెట్లో 5–4తో ఆధిక్యంలో నిలిచి తన సర్వీస్లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కూడా సంపాదించాడు. అయితే అల్ట్మైర్ పట్టుదలతో పోరాడి రెండుసార్లూ మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. అదే జోరులో సినర్ సర్వీస్ను కూడా బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో అల్ట్మైర్ పైచేయి సాధించి సెట్ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్ ఏకంగా 93 నిమిషాలు జరగడం విశేషం. నిర్ణాయక ఐదో సెట్లోని 11వ గేమ్లో సినర్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్ట్మైర్ 12వ గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. ఈ గేమ్లో సినర్కు నాలుగుసార్లు అల్ట్మైర్ సర్వీస్ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా వృథా చేసుకున్నాడు. రూడ్ ముందంజ పురుషుల సింగిల్స్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. జొకోవిచ్ 7–6 (7/2), 6–0, 6–3తో ఫచ్సోవిచ్ (హంగేరి)పై, రూడ్ 6–3, 6–2, 4–6, 7–5తో జెపెరి (ఇటలీ)పై నెగ్గారు. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–0తో క్లెయిరి లియు (అమెరికా)ను ఓడించి మూడో రౌండ్కు చేరింది. నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఏడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) కూడా మూడో రౌండ్కు చేరారు. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న సుమీత్ నగాల్
ఏటీపీ చాలెంజర్ యూరోపియన్ క్లే సీజన్లో భారత ఆటగాడు సుమీత్ నగాల్ జోరు కొనసాగుతోంది. రోమ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో నగాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీస్లో ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 2–6, 7–5, 6–4 స్కోరుతో 198వ ర్యాంకర్ జోరిస్ డి లూర్ (బెల్జియం)పై విజయం సాధించాడు. 2 గంటల 31 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఫైనల్లో జెస్పర్ డి జోంగ్ (నెదర్లాండ్స్)తో నగాల్ తలపడతాడు. ఇక్కడ విజయం సాధిస్తే యూరోపియన్ క్లే పై ఏటీపీ చాలెంజర్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. నగాల్ ఇప్పటి వరకు కెరీర్లో 3 ఏటీపీ చాలెంజర్ టోర్నీలు సాధించాడు. -
‘నంబర్వన్’ అల్కరాజ్.. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సొంతం
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న స్పెయిన్ యువ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ ర్యాంక్ను అందుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6–3, 6–2తో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందాడు. అల్కరాజ్కు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 42 లక్షలు) ప్రైజ్మనీ, రన్నరప్ మెద్వెదెవ్కు 6,62,360 డాలర్ల (రూ. 5 కోట్ల 46 లక్షలు) ప్రైజ్మనీ లభించాయి. మయామి ఓపెన్లోనూ టైటిల్ సాధిస్తేనే... ఇండియన్ వెల్స్ టోర్నీకి ముందు రెండో ర్యాంక్లో ఉన్న అల్కరాజ్ తాజా విజయంతో 7,420 పాయింట్లతో మరోసారి నంబర్వన్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీకి ముందు సెర్బియా స్టార్ జొకోవిచ్ టాప్ ర్యాంక్లో ఉన్నాడు. కోవిడ్ టీకా వేసుకోని విదేశీయులకు అమెరికాలో ప్రవేశం లేకపోవడంతో జొకోవిచ్ ఈ టోరీ్నకి దూరం కావాల్సి వచ్చింది. 7,160 పాయింట్లతో జొకోవిచ్ రెండో ర్యాంక్కు పడిపోయాడు. సోమవారం మొదలైన మయామి ఓపెన్ టోర్నీలోనూ అల్కరాజ్ విజేతగా నిలిస్తేనే నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకుంటాడు. లేదంటే ఏప్రిల్ 3న విడుదల చేసే ర్యాంకింగ్స్లో జొకోవిచ్ మళ్లీ టాప్ ర్యాంక్ను దక్కించుకుంటాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ 18 ఏళ్ల తర్వాత తొలిసారి టాప్–10 ర్యాంకింగ్స్లో చోటు కోల్పోయి 13వ ర్యాంక్లో నిలిచాడు. రిబాకినా తొలిసారి... ఇండియన్ వెల్స్ ఓపెన్ మహిళల టోరీ్నలో కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తొలిసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో రిబాకినా 7–6 (13/11), 6–4తో రెండో ర్యాంకర్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సబలెంకా (బెలారస్)పై గెలిచింది. తాజా ప్రదర్శనతో రిబాకినా ప్రపంచ ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్కు చేరుకుంది. విజేత రిబాకినాకు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 42 లక్షలు) ప్రైజ్మనీ, రన్నరప్ సబలెంకాకు 6,62,360 డాలర్ల (రూ. 5 కోట్ల 46 లక్షలు) ప్రైజ్మనీ లభించాయి. -
German Open 2023: లక్ష్య సేన్కు షాక్
జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) 21–19, 21–16తో ఆరో సీడ్ లక్ష్య సేన్ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. పొపోవ్పై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ రెండోసారి ఓటమి చవిచూశాడు. -
Australian Open 2023: జొకోవిచ్ అలవోకగా...
మెల్బోర్న్: కోవిడ్ టీకా వేసుకోనందున... గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడే అవకాశం కోల్పోయిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఈసారి అలవోక విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–0తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలుపొందాడు. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ తొమ్మిది ఏస్లు సంధించి, కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. కార్బెలాస్ సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 26 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచిన ఈ మాజీ నంబర్వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో వరుసగా 22వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ టోర్నీలో 2019, 2020, 2021లలో విజేతగా నిలిచిన జొకోవిచ్ గతేడాది బరిలోకి దిగలేదు. ముర్రే మారథాన్ పోరులో... మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్లో అత్యధికంగా ఐదుసార్లు రన్నరప్గా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్వన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్లో అతికష్టమ్మీద విజయం అందుకున్నాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 49వ ర్యాంకర్ ఆండీ ముర్రే 6–3, 6–3, 4–6, 6–7 (7/9), 7–6 (10/6)తో గెలుపొందాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ముర్రే 10 ఏస్లు సంధించి, 34 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు బెరెటిని 31 ఏస్లు సంధించినా, ఏకంగా 59 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నెట్ వద్దకు 39 సార్లు దూసుకొచ్చిన ముర్రే 23 సార్లు పాయింట్లు గెలుపొందగా... బెరెటిని 49 సార్లు నెట్ వద్దకు వచ్చి 32 సార్లు పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా శ్రమించి గెలుపొందాడు. ‘లక్కీ లూజర్’ యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)తో జరిగిన తొలి రౌండ్లో జ్వెరెవ్ 4–6, 6–1, 5–7, 7–6 (7/3), 6–4తో గెలిచాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జ్వెరెవ్ 21 ఏస్లు కొట్టాడు. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–6 (8/6), 6–7 (5/7), 6–3తో టొమాస్ మచాచ్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–4, 6–2తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై, ఎనిమిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–2, 4–6, 7–5తో బాసిలాష్విలి (జార్జియా)పై విజయం సాధించారు. ముగురుజాకు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో 2020 రన్నరప్, ప్రపంచ మాజీ నంబర్వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) 3–6, 7–6 (7/3), 6–1తో ముగురుజాను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా) 7–6 (10/8), 4–6, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–0తో కేథరీన్ సెబోవ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో తెరెజా మార్టిన్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. -
Australian Open 2023: శ్రమించి... శుభారంభం
మెల్బోర్న్: కెరీర్లో 23వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్కు తొలి రౌండ్లోనే గట్టిపోటీ ఎదురైంది. బ్రిటన్కు చెందిన ప్రపంచ 40వ ర్యాంకర్ జాక్ డ్రేపర్తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రాఫెల్ నాదల్ 7–5, 2–6, 6–4, 6–1తో నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 41 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో నాదల్ ఆరు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. ఏకంగా 46 అనవసర తప్పిదాలు చేసిన నాదల్ 41 విన్నర్స్ కొట్టి పైచేయి సాధించాడు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడుతున్న డ్రేపర్ 13 ఏస్లతో అదరగొట్టాడు. అయితే 46 అనవసర తప్పిదాలు చేయడం... కీలకదశలో తడబడటంతో డ్రేపర్కు ఓటమి తప్పలేదు. నాదల్ సర్వీస్ను 11 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా డ్రేపర్ నాలుగుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు నాదల్ ఆరుసార్లు డ్రేపర్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. మెద్వెదెవ్ అలవోకగా... పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఏడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ ఫీలిక్స్ అలియాసిమ్ (కెనడా), పదో సీడ్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మెద్వెదెవ్ 6–0, 6–1, 6–2తో మార్కోస్ గిరోన్ (అమెరికా)పై, సిట్సిపాస్ 6–3, 6–4, 7–6 (8/6)తో క్వెంటిన్ హేల్స్ (ఫ్రాన్స్)పై, అలియాసిమ్ 1–6, 7–6 (7/4), 7–6 (7/3), 6–3తో పోస్పిసిల్ (కెనడా)పై, హుర్కాజ్ 7–6 (7/1), 6–2, 6–2తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలిచారు. అయితే 2014 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 4 గంటల 22 నిమిషాల్లో 7–6 (7/3), 3–6, 6–1, 6–7 (2/7), 4–6తో అలెక్స్ మొల్కాన్ (స్లొవేకియా) చేతిలో... ప్రపంచ 23వ ర్యాంకర్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా) 3–6, 3–6, 3–6తో జిరీ లెహెక్సా (చెక్ రిపబ్లిక్) చేతిలో... ప్రపంచ 19వ ర్యాంకర్ ముసెట్టి (ఇటలీ) 4–6, 1–6, 7–6 (7/0), 6–2, 6–7 (4/10)తో హ్యారిస్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయారు. స్వియాటెక్ కష్టపడి... మహిళల సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్ స్వియాటెక్ (పోలాండ్) గంటా 59 నిమిషాల్లో 6–4, 7–5తో జూల్ నెమియర్ (జర్మనీ)పై శ్రమించి గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ పెగూలా (అమెరికా) 6–0, 6–1తో జాక్వెలిన్ (రొమేనియా)పై, ఆరో సీడ్ సాకరి (గ్రీస్) 6–1, 6–4తో యు యువాన్ (చైనా)పై, ఏడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచారు. -
Malaysia Open 2023: క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ప్రణయ్ 21–9, 15–21, 21–16 స్కోరుతో చికో అరా వర్డొయో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్స్కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–19, 22–20తో 49 నిమిషాల్లోనే షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా)ను చిత్తు చేశారు. అయితే మహిళల డబుల్స్లో మాత్రం భారత్ కథ ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో భారత ద్వయం పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 13–21, 21–15, 17–21 తేడాతో గాబ్రియా స్టోవా – స్టెఫానీ స్టోవా (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యారు. -
Adelaide International 1: జొకోవిచ్... టైటిల్ నంబర్ 92
అడిలైడ్: కొత్త ఏడాదిని సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్తో మొదలుపెట్టాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల జొకోవిచ్ చాంపియన్గా నిలిచాడు. 3 గంటల 9 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (8/10), 7–6 (7/3), 6–4తో ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై శ్రమించి గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 92వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. అంతేకాకుండా 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడిలైడ్ ఓపెన్లో ఈ మాజీ నంబర్వన్ విజేతగా నిలిచాడు. 2007లో 19 ఏళ్ల ప్రాయంలో జొకోవిచ్ తొలిసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు. 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ పీటర్ కోర్డా తనయుడైన సెబాస్టియన్ కోర్డాతో తొలిసారి తలపడ్డ జొకోవిచ్ ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచాడు. తొలి సెట్ కోల్పోయిన జొకోవిచ్ రెండో సెట్లో 5–6తో వెనుకబడి తన సర్వీస్లోని 12వ గేమ్లో 30–40తో మ్యాచ్ పాయింట్ను కాచుకున్నాడు. ఓవర్హెడ్ షాట్తో పాయింట్ గెలిచి 40–40తో సమం చేసిన జొకోవిచ్ అదే జోరులో తన సర్వీస్ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. ఆ తర్వాత టైట్రేక్లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాక 12వ గేమ్లో కోర్డా సర్వీస్ను బ్రేక్ చేసి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్కు 94,560 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 77 లక్షల 85 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జొకోవిచ్, రాఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిల్స్తో సమఉజ్జీగా నిలిచారు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా/చెకోస్లొవేకియా; 94 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
టాటా ఓపెన్ విజేత గ్రీక్స్పూర్
పుణే: భారత్లో నిర్వహించే ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్ మహారాష్ట్ర (ఏటీపీ 250) శనివారం ముగిసింది. సింగిల్స్లో నెదర్లాండ్స్ ఆటగాడు గ్రీక్స్పూర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో గ్రీక్స్పూర్ 4–6, 7–5, 6–3 స్కోరుతో బెంజమిన్ బోన్జి (ఫ్రాన్స్)ను ఓడించాడు. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్ను కోల్పోయినా...పట్టుదలతో ఆడిన 26 ఏళ్ల గ్రీక్స్పూర్ తన కెరీర్లో తొలి ఏటీపీ టైటిల్ సొంతం చేసుకోవడం విశేషం. మరో వైపు డబుల్స్లో భారత జోడి శ్రీరామ్ బాలాజీ – జీవన్ నెడుంజెళియన్ రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో సాండర్ గిల్ – జొరాన్ వీగన్ (బెల్జియం) ద్వయం 6–4, 6–4తో శ్రీరామ్–జీవన్లపై విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్
ట్యురిన్ (ఇటలీ): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ ర్యాంకింగ్స్లో స్పెయిన్ టీనేజర్ కార్లోస్ అల్కరాజ్ కొత్త చరిత్ర లిఖించాడు. 1973లో అధికారికంగా ర్యాంకింగ్స్ మొదలయ్యాక నంబర్వన్ ర్యాంక్తో ఏడాదిని ముగించనున్న పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల అల్కరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా; 2001లో 20 ఏళ్ల 214 రోజులు) పేరిట ఉన్న ఈ రికార్డును అల్కరాజ్ తిరగరాశాడు. గాయం కారణంగా అల్కరాజ్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్కు దూరమయ్యాడు. మరోవైపు ఈ టోర్నీలో టైటిల్ సాధిస్తే స్పెయిన్ దిగ్గజం, ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ మళ్లీ నంబర్వన్ ర్యాంక్ అందుకోవడంతోపాటు సీజన్ను టాప్ ర్యాంక్తో ముగించేవాడు. కానీ నాదల్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం నంబర్వన్గా ఉన్న అల్కరాజ్ (6,820 పాయింట్లు) డిసెంబర్ 5న ముగిసే టెన్నిస్ సీజన్ను టాప్ ర్యాంక్తో ముగించడం ఖరారైంది. ఈ ఏడాదిని 32వ ర్యాంక్తో ప్రారంభించిన అతను సెప్టెంబర్ 12న నంబర్వన్ ర్యాంకర్గా ఎదిగాడు. పిన్న వయస్కులో టాప్ ర్యాంక్ అందుకున్న టెన్నిస్ ప్లేయర్గా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సంవత్సరం అల్కరాజ్ ఐదు సింగిల్స్ టైటిల్స్ (రియోఓపెన్, మయామి మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్, మాడ్రిడ్ మాస్టర్స్, యూఎస్ ఓపెన్) సాధించాడు. మొత్తం 57 మ్యాచ్ల్లో గెలిచి, 13 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. 76 లక్షల 27 వేల 613 డాలర్ల (రూ. 62 కోట్లు) ప్రైజ్మనీ సంపాదించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్ చరిత్రలో సీజన్ను నంబర్వన్ ర్యాంక్తో ముగించనున్న 18వ ప్లేయర్ అల్కరాజ్. 2003 తర్వాత బిగ్–4 ప్లేయర్లు (ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే) కాకుండా మరో ప్లేయర్ టాప్ ర్యాంక్తో ముగించడం ఇదే ప్రథమం. నాదల్ తర్వాత స్పెయిన్ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా అల్కరాజ్ నిలిచాడు. -
జొకోవిచ్ శుభారంభం.. సిట్సిపాస్పై వరుసగా తొమ్మిదో విజయం
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్లో సెర్బియా స్టార్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో ‘రెడ్ గ్రూప్’ మ్యాచ్లో జొకోవిచ్ 6–4, 7–6 (7/4)తో మూడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. సిట్సిపాస్పై జొకోవిచ్కిది వరుసగా తొమ్మిదో విజయం. ‘గ్రీన్ గ్రూప్’ మ్యాచ్లో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 3–6, 4–6తో ఫెలిక్స్ అలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. ఇదే గ్రూప్లో టేలర్ ఫ్రిట్జ్ తదుపరి మ్యాచ్లో గెలిస్తే నాదల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో లక్ష్య సేన్
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఉత్తరాఖండ్కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు పురోగతి సాధించి ఆరో ర్యాంక్లో నిలిచాడు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు ఐదో ర్యాంక్లో ఉంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్కు చేరుకోగా... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఐదు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్లో నిలిచింది. -
French Open Badminton: శ్రీకాంత్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–18, 21–18తో భారత్కే చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ను ఓడించాడు. ఇతర మ్యాచ్ల్లో ప్రణయ్ 21–16, 16–21, 21–16తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... ప్రపంచ 31వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 21–23, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 15–21, 16–21తో ఫజర్–మొహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
మరో హోరాహోరీ పోరు.. ఫైనల్స్కు దూసుకొచ్చిన అల్కారాజ్
Carlos Alcaraz: స్పెయిన్ యువ కెరటం, మూడో సీడ్ కార్లోస్ అల్కారాజ్ యూఎస్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్స్కు దూసుకొచ్చాడు. ఆర్ధర్ యాష్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన సెమీస్లో అల్కారాజ్.. అమెరికా ఆశాకిరణం, 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోపై 6-7(6-8), 6-3, 6-1, 6-7(5-7), 6-3 తేడాతో విజయం సాధించి, ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు క్యాస్పర్ రూడ్తో ఢీకి రెడీ అయ్యాడు. అల్కారాజ్.. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో కూడా ఇదే తరహాలో పోరాడి గెలుపొందిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన క్లార్టర్స్లో 19 ఏళ్ల అల్కారాజ్.. 11వ సీడ్, ఇటలీ ఆటగాడు సిన్నర్పై 6-7, (7/9), 6-7 (0/7), 7-5, 6-3 తేడాతో గెలుపొందాడు. 315 నిమిషాల పాటు సాగిన ఈ సమరంలో అల్కారాజ్, సిన్నర్లు ఇద్దరు కొదమ సింహాల్లా పోరాడారు. యూఎస్ ఓపెన్ చరిత్రలో ఈ మ్యాచ్ రెండో సుదీర్ఘ సమరంగా రికార్డుల్లోకెక్కడం విశేషం. Never give up! 💪🏻 See you on Sunday, NYC! 🗽😍 @usopen 📸 Getty Images pic.twitter.com/u5ftKBn0Pp — Carlos Alcaraz (@carlosalcaraz) September 10, 2022 కాగా, ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అల్కారాజ్ అదిరిపోయే రీతిలో విజృంభిస్తున్నాడు. క్వార్టర్స్, సెమీస్లో సుదీర్ఘ పోరాటాలు చేసి ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ ఫైనల్కు చేరాడు. అల్కారాజ్..రఫెల్ నదాల్ తర్వాత (2019 నుంచి) యూఎస్ ఓపెన్ ఫైనల్కు చేరిన రెండో స్పెయిన్ ఆటగాడు కావడం మరో విశేషం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement