-
దుష్ట సంప్రదాయానికి తెరలేపిన కొండపి టీడీపీ ఎమ్మెల్యే స్వామి
తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కులాల మధ్య చిచ్చుపెట్టడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకే చెల్లుతుంది. ఆయన శిష్యబృందం కూడా అదే దారిలో పయనిస్తోంది. నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీశారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ సమ్మేళనం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండపి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి దుష్ట కుల రాజకీయానికి తెరలేపడంపై నియోజకవర్గంలోని మాదిగ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద ఇటీవల టీడీపీ ఆధ్వర్యంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించిన 40 సంవత్సరాల నుంచి ఏ రోజూ ఈ విధంగా కుల రాజకీయాలు చేయలేదు. కానీ, దళితులైన మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాదిగ ఆత్మీయ సమావేశం పెట్టి సరికొత్త కుటిల రాజకీయానికి ఎమ్మెల్యే స్వామి తెరతీయడంపై మాదిగ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటివరకు మాదిగలను పట్టించుకోని ఎమ్మెల్యే స్వామి.. వైఎస్సార్ సీపీ తరఫున కొండపి నుంచి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తుండటంతో మాల, మాదిగ అంటూ కుల ప్రస్తావన తెస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే మాదిగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇటీవల మంత్రి సురేష్ మాల, మాదిగ అని వేరు చేయకుండా సింగరాయకొండలో దళితుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాల, మాదిగలు తనకు రెండు కళ్లు లాంటివారని స్పష్టం చేశారు. టీడీపీకి మాదిగలు దూరమవుతున్నారని, అందుకు ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలే కారణమని అన్నారు. మాదిగల మనుగడను, ఆత్మగౌరవాన్ని కాపాడటానికి కొండపి నియోజకవర్గానికి మంత్రి సురేష్ వచ్చారని భావిస్తున్నామని మాదిగలు కూడా అంటున్నారు. కొండపికి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా మంత్రి సురేష్ వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని గమనించి మాదిగ సామాజికవర్గం టీడీపీకి దూరం అవడాన్ని గమనించిన ఎమ్మెల్యే స్వామి.. ప్రస్తుతం దుష్ట కుల రాజకీయానికి తెరలేపారని మాదిగ సామాజికవర్గం ఆరోపిస్తోంది. ఇన్నాళ్లు మాదిగ సామాజికవర్గాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే స్వామి.. గత పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడూ మాదిగల అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఇప్పటివరకు సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించని ఏకై క ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఎమ్మెల్యే స్వామి అని మాదిగలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో మంత్రి సురేష్ నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారని మాదిగలు గుర్తుచేస్తున్నారు. కొండపిలో మంత్రి సురేష్ పోటీ చేస్తుండటంతో ప్రస్తుతం మాదిగలపై టీడీపీ కల్లబొల్లి ప్రేమ ఒలకబోస్తోందని, ఇదే ప్రేమ మొదటి నుంచి చూపించి ఉంటే మాదిగలు టీడీపీకి దూరమయ్యే పరిస్థితి ఉండేది కాదని విశ్లేషకులు అంటున్నారు. ఏదిఏమైనా ఎన్నికలు దగ్గరపడుతున్నందున టీడీపీకి మాదిగలు గుర్తుకురావడం బాధగా ఉందని మాదిగ సామాజికవర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఓట్ల కోసం ఎన్ని ఆత్మీయ సమావేశాలు పెట్టినా నమ్మే పరిస్థితిలో లేమని మాదిగలు తెలియజేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది మాదిగ సామాజికవర్గం వారు ఉన్నారు. టీడీపీ ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి మాదిగల ఆత్మీయ సమావేశానికి సుమారు రెండు వేల మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో మాదిగలు కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి మాదిగలు దూరంగా ఉన్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని మాదిగలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గంలో దళితుల అభివృద్ధికి కృషిచేయాలేగానీ.. ఈ విధంగా కుల విభజన రాజకీయాలు చేస్తే కలిసికట్టుగా టీడీపీకి, స్వామికి గుణపాఠం చెబుతామని దళితులు స్పష్టం చేస్తున్నారు. -
AP Assembly: టీడీపీ సభ్యుల రచ్చ.. సభ నుంచి సస్పెండ్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు మళ్లీ ఓవరాక్షన్ చేశారు. దీంతో, టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోలేదు. ప్రతీసారి చేసిన విధంగానే ఈసారి కూడా అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. రెడ్లైన్ దాడి స్పీకర్ తమ్మినేని పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు. సభ జరుగుతుండా విజిల్స్ వేస్తూ అరాచకం సృష్టించారు. అంతటితో ఆగకుండా ప్రజాప్రతినిధులనే స్పృహ మరిచిపోయి టీడీపీ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్పై విసిరారు. స్పీకర్ తమ్మినేని పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. స్పీకర్ను అవమానపరిచేలా నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..
తిరువూరు: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీసులో కుర్చీలు విసురుకుంటున్న కార్యకర్తలు ఎస్ఐపై కార్యకర్తల దాడి.. టీడీపీ వర్గవిబేధాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల వర్గీయులు దాడికి తెగపడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని, చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయపడిన ఎస్ఐ సతీష్ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీఛార్జీ చేసి అల్లరిమూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సతీష్ను ఆసుపత్రికి తరలించారు. కవ్వింపు చర్యలకు పాల్పడిన ఇరువర్గాలు.. పార్టీ కార్యాలయంలో పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ ఎంపీ నాని, చిన్ని ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీడియాతో మాట్లాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఒక మహిళా కార్యకర్తకు సైతం గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన గురించి ఏమాత్రం సమీక్షించకుండానే గద్దె రామ్మోహన్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు వెళ్ళిపోయారు. దళితుడిని కాబట్టి షటప్, గెటవుట్ అంటారా.. ‘నేనొక దళిత నాయకుడిని. నన్ను షటప్, గెటవుట్ అంటారా. నాలుగు గోడల మధ్య మీరు అంటే సరిపోయిందా. బయటకు వచ్చి అందరి ముందు ఇవే మాటలు అనండ’ని తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఎస్.దేవదత్తు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేశినేని నాని, ఆయన వర్గీయులు తాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయానికి వచ్చి పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని తన వర్గీయులతో కలిసి పక్కనే ఉండగా దేవదత్తు మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మాటల్లోనే.. ‘దళితుడినైన నేను ఉన్నత విద్యను అభ్యసించి, 15 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి జ్ఞానం పొందా. నేనేదో సమావేశంలో మాట్లాడబోతుంటే నా ఆఫీసుకే వచ్చి నన్ను షటప్, గెటవుట్ అని కేశినేని నాని అంటారా.. నా ఆఫీసులో నాకు మాట్లాడే హక్కు లేదా? రెండు సార్లు గెలిచిన మీకే హక్కు ఉందా? మీరేనా నియోజకవర్గ నాయకులు. మేము కాదా. మాకు అవకాశం లేదా. మాకు చెప్పుకునే అర్హత లేదా. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ గెలిపించారు. మీరు మాత్రమే గెలిచారు. తక్కినవి ఓడిపోయారు’. దాడి సంఘటనపై కేసు నమోదు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు ఎస్ఐ సతీష్పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. తిరువూరు పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరువర్గాలు దాడికి పాల్పడుతుండగా అదుపు చేయడానికి యత్నించిన ఎస్ఐ సతీష్కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్ఐపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. నిందితులను అరెస్టు చేస్తాం.. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్ఐ సతీష్పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – కాంతి రాణా టాటా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
'రేయ్.. నేను రెడీగున్నా! అరెస్ట్ చెయ్రా.. చెయ్!'
తాడిపత్రి అర్బన్, సాక్షి: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. 'రేయ్.. అరెస్టు చెయ్.. నీయమ్మా.. ఖాకీ డ్రెస్సులేసుకుని సిగ్గులేదు.. రేయ్ నేను రెడీగున్నా.. అరెస్ట్ చెయ్.. చెయ్ రా చెయ్' అంటూ పోలీసులను దుర్భాషలాడారు. రోడ్డుపై పడుకుని హంగామా సృష్టించారు. రెండు రోజుల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణ సుందరీకరణ పేరుతో సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు డెకరేషన్ బల్బులను ఏర్పాటు చేసేందుకు మునిసిపల్ కమిషనర్ జి.రవిని అనుమతి కోరారు. తర్వాత మునిసిపల్ సిబ్బందితో కలసి దగ్గరుండి డెకరేషన్ లైట్లు వేయించడానికి బయలుదేరారు. అయితే స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలను పనిగట్టుకుని తొలగిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్.. తన అనుచరులతో కలిసి నడిరోడ్డుపై బైఠాయించి నానా హంగామా సృష్టించాడు. ట్రైనీ డీఎస్సీ హేమంత్ కుమార్, ఎస్ఐలు రామకృష్ణ, గౌస్మహ్మద్లు అక్కడికి చేరుకుని మునిసిపల్ కమిషనర్తో మాట్లాడి జెండాలను తొలగింపజేస్తామంటూ హామీ ఇవ్వడంతో జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీవో వెంకటేష్ను టీడీపీ కౌన్సిలర్లు కలసి సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలు తొలగించాలంటూ వినతిపత్రం ఇవ్వడమే కాకుండా.. అక్కడే బైఠాయించారు. ఇది తన పరిధిలోని అంశం కాదని, అనవసరంగా రాద్దాంతం చేయకుండా మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆర్జీవో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలసి అర్బన్ పోలీస్ స్టేషన్ వద్దకొచ్చారు. వచ్చీ రాగానే గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించాడు. ఎస్పీ ధరణీబాబు, రామకృష్ణ, గురుప్రసాద్రెడ్డి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వారిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. పోలీసులు సంయమనం పాటిస్తూ నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు జీపును తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమవగా నడిరోడ్డుపై పడుకుండిపోయాడు. పోలీసులు అతన్ని జీవులోకి ఎక్కించుకుని స్థానిక పుట్లూరు రోడ్డులో వదిలేయడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. జేసీపై కేసు నమోదు పోలీసులతో అనుచిత ప్రవర్తకు గానూ జేసీ ప్రభాకర్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం.. విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడంపై జేసీతో పాటు ఆయన ముగ్గురి అనుచరులపై కేసు నమోదు చేశారు. -
హిందూపురంలో బాలకృష్ణకు షాక్..
-
టీడీపీ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్ట్రాంగ్ వార్నింగ్
-
ఎమ్మెల్యేలను కించపరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు
రాప్తాడు రూరల్: అధికార పార్టీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ చేస్తున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై అనంతపురం రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలను సీఐ విజయభాస్కర్గౌడ్ గురువారం వెల్లడించారు. అనంతపురం మండలం సోములదొడ్డి గ్రామానికి చెందిన చల్లా రాఘవేంద్రనాయుడు, సిండికేట్నగర్కు చెందిన బత్తల మంజునాథ్, కట్టా లోకేష్... టీడీపీలో క్రియాశీలక కార్యకర్తలుగా చెలామణి అవుతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి విరుద్ధంగా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వివిధ పోస్టులను వీరు వైరల్ చేశారు. దీనిపై నందమూరినగర్కు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఇర్ఫాన్బాషా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో చల్లా రాఘవేంద్రనాయుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పార్టీలో చురుకుగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు, స్థానిక నాయకులు, కార్యకర్తల పేర్లు, ఫొటోలతో ఎమ్మెల్యేను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సిద్ధం చేసిన పోస్టులు తమకు ‘టీంపోస్ట్’ అనే డీపీ ఉన్న మొబైల్ నంబరు ద్వారా అందాయని, వీటిని టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు వైరల్ చేస్తూ వచ్చామని నిందితుడు అంగీకరించాడు. రాఘవేంద్ర నాయుడు తెలిపిన మేరకు అతనితోపాటు బత్తల మంజునాథ్, కట్టా లోకేష్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులను వైరల్ చేస్తే శాంతిభద్రతల దృష్ట్యా వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా సీఐ విజయభాస్కర్గౌడ్ హెచ్చరించారు. -
అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంపై పేపర్లు విసిరారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్కు సీఎం సిఫార్సు చేశారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగలడంతో టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. 14 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్తో 2023,24 వార్షిక బడ్జెట్ రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు.. మూలధన వ్యయం రూ. 31,061 కోట్లుగా పేర్కొన్నారు. చదవండి: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ -
బస్సులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ఓవరాక్షన్.. కౌంటర్ ఇచ్చిన మహిళలు!
పాలకొల్లు అర్బన్/పోడూరు: ఆర్టీసీ బస్సులో మహిళలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలకొల్లు నుంచి పెనుగొండ వరకు ఆదివారం అమరావతి పాదయాత్ర సాగింది. ఈ మార్గంలో ఓ ఆర్టీసీ బస్సు ఎక్కిన ‘నిమ్మల’.. ప్రయాణికులతో మాటామంతీ కలుపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపైన బురదజల్లే ప్రయత్నం చేయబోయారు. దీంతో ఆ మహిళలు.. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని, ఇంటి స్థలాలు ఇస్తున్నారని వాదించడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని ఒక మహిళ వీడియో తీసింది. దీంతో, రెచ్చిపోయిన ఎమ్మెల్యే రామానాయుడు ఆ మహిళ చేతిలోని సెల్ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. ఆ దృశ్యాలను తీసేస్తాను తన సెల్ఫోన్ తనకు ఇవ్వాలని ఆ మహిళ ప్రాథేయపడుతున్నా ఎమ్మెల్యే వినకుండా సెల్ఫోన్ను పక్కనే ఉన్న మరో టీడీపీ నేతకు ఇవ్వడం.. ఆ మహిళ ఎమ్మెల్యే మెడలోని పచ్చకండువాను, చొక్కాను లాగడం.. ఎమ్మెల్యే కేకలు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఆయన మహిళల ముందు అభాసుపాలయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. పితాని, నిమ్మలకు ఝలక్.. మరోవైపు.. ఇదే జిల్లా పోడూరు మండలం కవిటం లాకుల వద్ద కూడా బస్సు ప్రయాణికుల నుంచి పాదయాత్రలోని మాజీమంత్రి పితాని, ఎమ్మెల్యే నిమ్మలకు ఝలక్ తగిలింది. పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు బలప్రదర్శనకు దిగడం.. ట్రాఫిక్ స్తంభించడంతో ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు వారిపై మండిపడ్డాడు. గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఆ ప్రభుత్వం చేసిన మోసం చాలదా? ఇప్పుడు రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారంటూ టీడీపీ నేతలను నిలదీశాడు. దీంతో పాదయాత్ర చేస్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ తదితరులు కంగుతిన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించినట్లుగా మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలుపుతామని ప్రయాణికులు తెగేసి చెప్పారు. -
టీడీపీ నేత కొండబాబు కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
-
బాలయ్యా... గుర్తున్నామా!
సాక్షి, పుట్టపర్తి: హిందూపురం నియోజకవర్గం...టీడీపీకి అండగా ఉన్న ప్రాంతం. నందమూరి తారక రామారావుతో పాటు ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో రెండోసారి విజయం సాధించి ప్రస్తుత అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తమను ఇంతలా ఆదరిస్తున్న హిందూపురం వాసుల గురించి మాత్రం బాలయ్య పట్టించుకోవడం లేదు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. గత 8 నెలల కాలంలో బాలకృష్ణ ఒకట్రెండు సార్లు మాత్రమే హిందూపురంలో కనిపించారు. అది కూడా గృహ ప్రవేశాలు, వివాహాల్లో హాజరయ్యేందుకు వచ్చారు. అంతేకానీ ప్రజలు ఎలా ఉన్నారు.. నమ్మి ఓట్లేసిన ప్రజల యోగ క్షేమాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం బాలకృష్ణ బుధవారం హిందూపురం వస్తుండగా...జనం ఇన్నాళ్లకు గుర్తొచ్చామా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అప్పటి సీఎం చంద్రబాబు వివక్ష చూపించారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రాంతాలు, కులాలు, మతాలు, పారీ్టలు చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా జనరంజక పాలన సాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల అభివృద్ధికీ నిధులు కేటాయిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో హిందూపురం నుంచి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ప్రభుత్వం ఈ ప్రాంతంపై ఎలాంటి వివక్ష చూపలేదు. అన్ని రకాల సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల వారికి అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా.. పార్టీ చూడకుండా.. ఎమ్మెల్సీ ఇక్బాల్ సాయం చేస్తున్నారు. దీంతో బాలకృష్ణతో జనానికి పనిలేకుండా పోయింది. గత ఆరు నెలల్లో బాలకృష్ణ ఇలా.... జనవరిలో ఓసారి కూడా హిందూపురం రాలేదు. ఫిబ్రవరి 3,4 తేదీల్లో హిందూపురం జిల్లా సాధన పేరుతో ధర్నా చేసేందుకు వచ్చారు. మార్చి 27వ తేదీన హిందూపురంలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్లో ఒక్కసారి కూడా హిందూపురం సందర్శించలేదు. మే 27వ తేదీన హిందూపురం విచ్చేసి ఓ వివాహానికి హాజరయ్యారు. జూన్ 2వ తేదీన హిందూపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలైలో హిందూపురంలో పర్యటించలేదు. తాజాగా 17, 18 తేదీల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. బాలకృష్ణ స్థానిక వ్యవహారాలన్నీ పీఏ (వ్యక్తిగత కార్యదర్శి)కి అప్పగించారు. వారు ఎలా చెబితే అలా డైలాగులు చెప్పేసి వెళ్లిపోతారు. కనీసం పార్టీ కార్యకర్తలెవరో కూడా తెలియని పరిస్థితి. ఎవరైనా అభిమానంతో దగ్గరకు పోయినా లాగి లెంపకాయ కొట్టడం అలవాటు చేసుకున్నారు. దీంతో ఆయన దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయడం లేదు. పోనీ ఆయన పీఏలనైనా నమ్ముకుందామంటే... గత టీడీపీ హయాంలో అప్పటి పీఏ శేఖర్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పీఏగా వ్యవహరిస్తున్న బాలాజీ హైటెక్ పద్ధతిలో జూదం ఆడుతూ పోలీసులకు గత మార్చి 21వ తేదీన పట్టుబడ్డాడు. ఇలా బాలకృష్ణ అందుబాటులో లేక, ఆయన పీఏలు పట్టించుకోకపోవడంతో జనం ఎమ్మెల్యే గురించే మరచిపోయారు. ఈ చిత్రంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పరామర్శిస్తున్న వ్యక్తి పేరు తిమ్మారెడ్డి. ఎన్టీఆర్ వీరాభిమాని. మొదటి నుంచీ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. గత ఏడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఏళ్లుగా పారీ్టకి సేవ చేసినా టీడీపీ నేతలు గానీ, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణగానీ తిమ్మారెడ్డి గురించి పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ 2021 మే 5వ తేదీన తిమ్మారెడ్డి ఇంటికే వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2,70,000 మంజూరు చేయించారు. ప్రస్తుతం తిమ్మారెడ్డి ఆరోగ్యంగా ఉన్నారు. లేపాక్షికి చెందిన ఓ టీడీపీ కార్యకర్తకు ఇటీవల ఓ పెద్ద కష్టం వచ్చింది. సాయం కోసం బాలకృష్ణను సంప్రదించాలని చూడగా ఆయన అందుబాటులో లేరు. ఎమ్మెల్యే పీఏను కలిస్తే చీదరించుకున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే తన పరిస్థితి ఇలా అయ్యిందని సదరు కార్యకర్త మనస్తాపం చెందారు. చివరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ అతన్ని పిలిపించుకుని విషయం ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి సదరు కార్యకర్తకు అండగా నిలిచారు. ...ఇలా టీడీపీ నాయకులు, కార్యకర్తలే కాదు. హిందూపురం వాసులంతా బాలయ్య అందుబాటులో లేక ఇబ్బంది పడ్డారు. అయితే అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారీ్టలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుండటంతో జనంతో పాటు టీడీపీ నేతలూ ఇప్పుడు ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. అందువల్లే హిందూపురం వాసులు కూడా బాలయ్యతో తమకేం పెద్దగా పనిలేదంటున్నారు. (చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్) -
ప్రతీ దానికి పిల్ ఏంటి!?.. టీడీపీ ఎమ్మెల్యేకు ఏపీ హైకోర్టు చీవాట్లు
సాక్షి, అమరావతి: విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రతీ దానికీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడమేనా? అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే బాధిత వ్యక్తులు కోర్టుకు వస్తారని.. వారికిలేని అభ్యంతరం మీకెందుకని రామకృష్ణ బాబును హైకోర్టు నిలదీసింది. బాధితులు కోర్టుకు రాకుండా మీరెందుకొచ్చారని అడిగింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే వాటిని అసెంబ్లీలో ప్రస్తావించుకోవాలని ఆయనకు స్పష్టంచేసింది. చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్న్యూస్.. రెండు, మూడు రోజుల్లో.. ప్రతీ వ్యవహారంలో పిల్ దాఖలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ విషయంలో సర్కారు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆయన దాఖలు చేసిన పిల్ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆక్రమణలో ఉన్న అభ్యంతరంలేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు 2017లో జారీచేసిన జీఓ–388ని ప్రభుత్వం అమలుచేయడంలేదని, దీని ప్రకారం భూములను క్రమబద్ధీకరించేందుకు లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. 2017లో జారీచేసిన జీఓ ప్రకారం ఎంతోమంది తమ స్వాధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని.. ఇలాంటి వారు లక్షల్లో ఉన్నారని తెలిపారు. అయితే.. ఈ జీఓను అమలుచేయకుండా ప్రభుత్వం కొత్త జీఓ జారీచేసి భూములను క్రమబద్ధీకరిస్తోందని, దీనివల్ల గతంలో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ చర్యలు ఇబ్బందిగా ఉంటే బాధితులు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించింది. బాధితులకు లేని ఇబ్బంది పిటిషనర్కు ఎందుకని నిలదీసింది. ప్రతీ దానికి ఇలా పిల్ దాఖలు చేయడమేనా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. -
టీడీపీ ఎమ్మెల్యే నోటి దూల మాటలకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అదిరిపోయే కౌంటర్
-
టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్
-
వైన్ వీర ‘అనితా’... మాటలు జాగ్రత్త...! : మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ అన్నారు. తండ్రి సమానుడైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కత్తెర చూపిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని... బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలంతా కత్తితో నీ నాలుక చీరేస్తారని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన ఎంవీపీ కాలనీలో గల తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. సజ్జల కష్టపడి తన ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగారని, అలాంటి వ్యక్తిని బ్రోకర్ అని సంబోధిస్తావా..? అసలు పవిత్రమైన టీచర్గా పనిచేసిన నీవు పాయకరావుపేట ఎమ్మెల్యే స్థాయికి ఎలా ఎదిగావో నియోజకవర్గ ప్రజలను అడిగితే చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే మద్యం బ్రాండ్లు మంచివి కాదని చెబుతున్న వైన్ వీర వనితకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలన్నారు. ఏలేరు కాలువ అవకతవకల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ముందస్తుగా స్టే తెచ్చుకున్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. కాపు కులస్తులపై కపటప్రేమ ఇటీవల చంద్రబాబు, వైన్ వీర ‘అనిత’ కాపు కులస్తులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. కాపు కులస్తుడైన తన భర్తను పోలీస్స్టేషన్లో చెప్పుతో కొట్టడమే కాకుండా... జైలుకు పంపించిన ఘనత ఈ వీర వనితదని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు అయితే కాపు నాయకుడు వంగవీటి మోహన్రంగాను హత్య చేయించారన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడైన వంగవీటి రాధను చంపాలని కుట్ర పన్నుతున్నాడని తెలిపారు. తండ్రిని హతమార్చినట్టే.. అమాయకుడైన వంగవీటి రాధని హతమార్చి కాపుల ఓట్లతో సీఎం అవ్వాలని చంద్రబాబు మరో కుట్ర పన్నుతున్నాడన్నారు. ఈ కుట్రపై సీఐడీ విచారణ చేయించాలని సీఎం జగన్మోహన్రెడ్డిని కోరతానన్నారు. అప్పుడే వీరి కుట్ర బయటపడుతుందన్నారు. చదవండి: Crime: పగలు రెక్కీ.. రాత్రికి చోరీ! తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా.. -
ఎక్కడయ్యా.... బుల్ బుల్ బాలయ్యా ?
-
టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
శావల్యాపురం(వినుకొండ) : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించడంతో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు సోమవారం మీడియాతో చెప్పారు. మండల కేంద్రం శావల్యాపురంలో టీడీపీ నాయకులు జాతీయ రహదారి మార్గంలో గుంపులుగా ఏర్పడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేయడమే కాకుండా.. ట్రాఫిక్, ఎన్నికల నిబంధనలు అతిక్రమించినందున మాజీ ఎమ్మెల్యేతో పాటు.. టీడీపీ నేతలు గుంటూరు సాంబశివరావు, గడుపూడి విశ్వనాథం, చెరుకూరి చౌదరి, గోరంట్ల హనుమంతరావు, యరమాసు కోటేశ్వరరావు, పారా చౌదరి, చింతా గంగయ్య, అమృతపూడి కోటయ్య, మాదాల చిరంజీవి, బొల్లా పేరయ్య, దొడ్డా ఏడుకొండలు తదితరులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం
-
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్పోస్ట్ వద్ద ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రభాకర్ను పోలీసులు అరెస్టు చేసి ఏలూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. కాగా నిన్న దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళన చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకుగాను దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బుచ్చిరాజ్యంలో.. ఆదిపత్య పోరు
వందల ఏళ్ల చరిత్ర కలిగి.. రాజరాజనరేంద్రుడు ఏలిన పురాతన రాజమహేంద్రవరం నగరంలో ఆధిపత్యం కోసం ఇద్దరు సామంతులు ‘ఎత్తుల’ కత్తులు దూస్తున్నారు. ఒక సామంతుడు ‘బుచ్చి’రాజు. మరొకరు ‘ఆది’రాజు. రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా రాచరికపు వాసనలు వారిని వీడటం లేదు. బుచ్చిరాజును సైన్యంతో సహా పదేళ్ల క్రితమే పొరుగు రాజ్యానికి ఆదిరాజు తరిమేశారు. అప్పటి నుంచీ కోల్పోయిన రాజ్యంలో పట్టు సాధించాలనే ఆరాటంతో.. అవకాశం వచ్చినప్పుడల్లా అలక పాన్పు ఎక్కేస్తున్నారు బుచ్చిరాజు. వందిమాగధులతో రకరకాల తంత్రాలు పన్నుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవంతో రాజకీయ మాయోపాయాలు పన్ని, ఆదిరాజును ఇరుకున పెట్టి, రాజ్యంలో పట్టు సాధించాలన్నది ఆయన వ్యూహం. సాక్షి,రాజమహేంద్రవరం: ఉత్తరాంధ్ర పరగణాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆజానుబాహుడైన ఓ నాయుడికి స్వయానా బంధువైన ఆదిరాజు ఏమైనా తక్కువ తిన్నారా? బుచ్చిరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన రాజ్యంలో వేలు పెడితే యుద్ధం తప్పదని వేగుల ద్వారా బుచ్చిరాజుకు సందేశం పంపించారు. అలనాడు దుర్యోధనుడు చెప్పినట్టు ‘‘సూది మొన మోపినంత స్థలం కూడా వదులుకోన’’ని స్పష్టంగా చెప్పాడు. విషయం ఆ నోటా ఈ నోటా రాజ్యం నలుమూలలా పాకడంతో సామంతులు, ఆంతరంగికుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. భటుల ద్వారా ఇది తెలుసుకున్న బుచ్చిరాజు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అలాగని వందిమాగధులతో యుద్ధానికి సై అని సాహసించడం లేదు. తన రాజ్యంలోని సైనిక సంపత్తి, మంత్రాంగం సరిపోదనే కారణంతో.. అలకబూని.. రాజప్రసాదం తలుపులు తెరవకుండా మూడు రోజులుగా అంతఃపురానికే పరిమితమైపోయారు. ఈ తరహా రాజకీయ తంత్రం బుచ్చిరాజుకు కొత్తేమీ కాదు. రాజమహేంద్రవర రాజ్యాన్ని కోల్పోయిన గాయం ఇంకా మానకున్నా.. ‘చంద్ర’వంశ రాజదర్బార్లో కనీస మర్యాద కూడా దక్కడం లేదని ఏడు పదుల వయస్సులో ఉన్న ఈ సామంతరాజు కుమిలిపోతున్నారు. గతంలో కూడా ఇలానే కనీసం వయస్సుకు కూడా విలువ ఇవ్వడం లేదంటూ అంతఃపురంలో ఏకాంతంగా అంతర్మధనం చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయని ఆంతరంగికులు గుసగుసలాడుకుంటున్నారు. దాదాపు పదేళ్లుగా అవమాన భారంతో రగిలిపోతున్న బుచ్చిరాజు కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆయన ఎత్తులు ఆదిరాజు రాజకీయ తంత్రం ముందు చిత్తవుతున్నాయి. భవిష్యత్లో రాజమహేంద్రవరంలోని 52 పరగణాలకు జరిగే పోరు కోసమే సామంతుల మధ్య ఇంతటి రాజ్యకాంక్ష నెలకొందనే చర్చ రాజదర్బారులో నడుస్తోంది. బుచ్చిరాజు రాజ్యంలోకి వచ్చే తొమ్మిది పరగణాలతో పాటు, మిగిలిన 43 పరగణాల్లో తన సుబేదారులకే పట్టు ఎక్కువ ఉండటంతో.. వారిని యుద్ధరంగంలోకి దింపాలనేది బుచ్చిరాజు వ్యూహం. అయినప్పటికీ ఆదిరాజు సిక్కో లు రాజుల బంధుత్వం దన్నుతో ధీమాగా ఉన్నారని ఆ రాజప్రసాదంలోని భటులు చెప్పుకొంటున్నారు. సామంతుల మధ్య సంధి కోసం ‘చంద్ర’వంశ రాజు పంపించిన దూతలు బుచ్చిరాజు అంతఃపురంలో గంటన్నర చర్చించినా చివరకు తలలు పట్టుకుని వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. పైకి మాత్రం సామంతుల మధ్య యుద్ధ వాతావరణం లేదని, బుచ్చిరాజుకు అసలు అసంతృప్తే లేదని చెప్పారు. ‘చంద్ర’వంశ సామంతులు నిమ్మకాయల చినరాజు, బెజవాడలో ‘గద్దె’నెక్కిన రామ్మోహనరాజు, రాజమహేంద్రవరం రాజ్యంలో గోదావరి అవతల ఒడ్డున ప్రజలకు చుక్కలు చూపించిన హర్రర్రాజు, అనపర్తి రెడ్డి రాజు వంటి దూతల సంధి విఫలమైంది. అసలు సామంతుల మధ్య చిచ్చు పెట్టిందే ‘చంద్ర’వంశ రాజు. సంధి కోసం వెళ్లిన దూతలు మధ్యలో అంతఃపురం బయట చెప్పుకొన్న మాటలను రహస్యంగా విన్న రాజభటులు బుచ్చిరాజు చెవిన వేశారు. నాడు పిల్లనిచ్చి, మంత్రిని చేసిన మామ రాజ్యాన్నే కూల్చేసి, సింహాసనం అధిíÙ్ఠంచి, ఇన్నేళ్లవుతున్నా.. తన వ్యతిరేక కూటమితో చేతులు కలిపిన బుచ్చిరాజును ఒకప్పటి ‘చంద్ర’వంశ రాజు ఇప్పటికీ వదిలిపెట్టలేదని వేగుల ద్వారా వచ్చిన సమాచారం. అందుకే ఈ సంధి యత్నాలు ‘చంద్ర’వంశ అంతఃపురం సాక్షిగా రక్తి కట్టిస్తున్న ఎత్తుగడగా కనిపిస్తున్నాయి. చక్రవర్తిగా బుచ్చిరాజు చలామణీ అయ్యే రోజుల్లో అతడికి ఆదిరాజు సామంతుడు కావడమే విచిత్రం. సామంతుల మ«ధ్య చిచ్చు చివరకు ఏ తీరానికి చేరుతుందోనని ఇరుగు, పొరుగు రాజ్యాల్లోని నాయకులు, ప్రజలు కోటగోడలెక్కి మరీ ఆసక్తిగా చూస్తున్నారు. -
వెలగపూడి వైరస్: పేదల ఫుడ్ కోర్టుపై ‘పడగ’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు... ఈయన గారి నేర చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. వంగవీటి మోహన రంగా హత్య కేసులో నిందితుడుగా పరారై ఇక్కడకు వలస వచ్చిన దరిమిలా విశాఖ నగరంలో విష సంస్కృతికి బీజం వేసిన ప్రబుద్ధుడీయన. కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు.. అక్రమార్జన.. ఇలా విశాఖకు మునుపెన్నడూ ఎరగని నయా మాఫియాకు తెరలేపిన ’పచ్చ’ నేత ఈయన. దాదాపు పదిహేనేళ్లుగా తూర్పు నియోజకవర్గాన్ని చెరబట్టిన ఈయన గారి నిర్వాకాలకు, దందాలకు గత రెండేళ్లుగా బ్రేక్ పడుతూ వస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వెలగపూడి బ్యాచ్ భూదందాలు, కోడిపందాలు, మద్యం మాఫియాకు దాదాపు అడ్డుకట్టపడిందనే చెప్పాలి. అయితే అక్రమార్జన అలవాటుపడిన సదరు వెలగపూడి బ్యాచ్ చివరికి చిరు వ్యాపారుల ఫుడ్ కోర్ట్పై కూడా పడిపోయారు. నగరమంతటా కోవిడ్ వైరస్ కలకలం సృష్టిస్తుంటే.. నైట్ఫుడ్ కోర్టులో మాత్రం వెలగపూడి వైరస్ ప్రబలింది. ఇంతకీ.. ఆ వైరస్ ఏంటి.. నైట్ఫుడ్ కోర్టులో అసలేం జరుగుతోందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి రండి. మహా నగర పరిధిలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కోసం జీవీఎంసీ 2019 ఫిబ్రవరిలో జైల్ రోడ్డులో 27 ఫుడ్ స్టాల్స్తో నైట్ ఫుడ్ కోర్టు ప్రారంభించింది. ఆ తర్వాత క్రాఫ్ట్ బజార్ కూడా ఇందులో ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే.. అదే ఏడాది మార్చి నుంచి కరోనా కలకలం మొదలవ్వడంతో లాక్డౌన్తో కొన్నాళ్లు వ్యాపారాలు మూతపడ్డాయి. పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ అధికారులంతా కోవిడ్ నియంత్రణ చర్యల్లో 24‘‘7 బిజీగా అయిపోయారు. గతేడాది మే నుంచి నుంచి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి చెందకుండా నగర ప్రజల్ని కాపాడే బాధ్యతని జీవీఎంసీ భుజానికెత్తుకొని.. నైట్ ఫుడ్ కోర్టు విషయాన్ని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని వ్యాపారాల మాదిరిగానే ఫుడ్ కోర్టు కూడా మొదలైంది. ఇదే అదనుగా ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఫుడ్కోర్టుని ఆక్రమించేశారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో పచ్చజెండా పాతేశారు. అనుమతి 27 స్టాల్స్కి.. ఉన్నవి 138 అప్పటివరకు ఎంవీపీ కాలనీ, బీచ్రోడ్డులో స్ట్రీట్ఫుడ్ దందా సాగిస్తున్న వెలగపూడి బ్యాచ్ జైల్రోడ్డులోని నైట్ఫుడ్ కోర్టుని ఆక్రమించేసింది. వెలగపూడి తన అనుచరుల ద్వారా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయించేశారు. అక్కడితో ఆగకుండా మహారాష్ట్ర, ఒడిశా, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు ఇలా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారికీ స్టాల్స్ పెట్టుకోడానికి వాళ్లే సొంత అనుమతులిచ్చేశారు. వీరిని చూసి.. మిగిలిన మరికొందరు సైతం తమకు నచ్చినట్లుగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకురాకుండానే ఓ రకంగా. మొత్తం ఫుడ్ కోర్టుని తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. మొత్తం 27 స్టాల్స్కు మాత్రమే అనుమతులుండగా ప్రస్తుతం 138 వరకూ వచ్చేశాయి. ఇందులో సగానికి పైగా వెలగపూడి అనుచరులకు చెందిన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని అంటున్నారు. ఒక్కొక్కరూ తమ బంధువుల పేరుతోనే నాలుగైదు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారుల్ని మాత్రం వాటి దరి చేరకుండా తమ గుప్పిట్లోకి తీసేసుకున్నారు. జీవీఎంసీలో పెండింగ్లో 500 దరఖాస్తులు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 500కి పైగా దరఖాస్తులు వచ్చాయని యూసీడీ విభాగాధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్న 27 మందికి మాత్రమే ఇప్పటివరకు ఫుడ్ కోర్టులో స్టాల్స్ పెట్టుకోవాలని తాత్కాలిక అనుమతి ఇచ్చామనీ.. ఇంకెవ్వరినీ అనుమతించలేదని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాతే ఫుడ్ కోర్టు విషయమై ఏం చేయాలో ఆలోచిస్తామని అధికారులు అంటున్నారు. స్టాల్ స్టాల్కీ.. వసూళ్ల పర్వం జీవీఎంసీ తమ ఆదాయ వనరుగా నైట్ ఫుడ్ కోర్టుని ఏర్పాటు చేస్తే.. వెలగపూడి బ్యాచ్ దాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయాలంటే లక్ష నుంచి రెండు లక్షల రూపాయిల వరకూ వసూలు చేశారు. పోనీ.. జీవీఎంసీకి వీటి వల్ల ఆదాయం వస్తుందా అంటే.. ఇప్పటివరకూ నైట్ ఫుడ్ కోర్టు నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదని అధికారులే చెబుతున్నారు. మొదట అధికారికంగా ఏర్పాటు చేసిన 27 స్టాల్స్ నుంచి కూడా ఫీజు వసూలు చేయలేదనీ.. కరోనా కారణంగా మినహాయింపునిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. చిరు వ్యాపారులను తొక్కేసి.. రోడ్లపై చిరుతిళ్లు అమ్ముతూ బతుకులీడ్చుతున్న నగరానికి చెందిన చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ చివరికి బడా వ్యాపారస్తుల కేంద్రంగా మారిపోయింది. ఆ ఫుడ్కోర్టులోకి అడుగు పెడితే కొన్ని స్టాళ్లలో పెద్ద హోటల్స్తో పోటీగా ధరలుంటాయి. మొత్తంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు సదుద్దేశ్యాన్ని పక్కదారి పట్టించి... చిరు వ్యాపారులను మింగేసిన పచ్చ రాబందులపై జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా దృష్టిసారిస్తారో లేదో చూడాలి. చదవండి: టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత.. నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
రెక్కలు విరిగి.. నకనకలాడిపోతున్న వెలగ కోడి
రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటోంది.... ముప్పై ఏళ్ల కిందట తెలుగు సినీ అభిమానులను ఓ రేంజ్లో ఉర్రూత లూగించిన ఈ పాటను ఇప్పుడు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విషయానికి వచ్చే సరికి ఇదిగో ఇలా చదువుకోవాలి– రెక్కలు విరిగి నకనకలాడి అల్లాడిపోతున్న వెలగకోడి... ఎక్కడైనా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు పేరు చెబితే వెంటనే ఆ ప్రాంత అభివృద్ధి గుర్తుకు రావాలి... ఆ ప్రాంతంలో ఆయన ఆధ్వర్యంలో చేసిన మంచి పనులు జ్ఞప్తికి రావాలి.. నియోజకవర్గ ప్రజలకు చేసిన ఎన్నో మేళ్ళు స్ఫురణకు రావాలి.. కానీ మూడు దఫాలుగా విశాఖ తూర్పున వెలగబెడుతున్న రామకృష్ణ పేరు చెప్పగానే... కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు. పంచాయితీలు.. ఇంతకుమించి ఆయన వెలగబెట్టిందేమన్నా ఉందా అంటే సొంత పార్టీ నేతలు కూడా నిజాయితీగా ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి.. ప్రభుత్వం ఉన్నా.. దాదాపు పదేళ్లు అడ్డగోలుగా నియోజకవర్గంపై పడిపోయి అందినకాడికి దోచేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారైంది. అసలేమయింది అనుకుంటున్నారా... అయితే పూర్తి వివరాల కోసం లోపలికి రండి.. సాక్షి, విశాఖపట్నం : అధికారం దన్నుతో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గతంలో ఇష్టారాజ్యంగా చేసిన దందాలు, వ్యవహారాలు, దౌర్జన్యాలకు దాదాపు 20 నెలలుగా అడ్డుకట్ట పడింది. విజయవాడ మాజీ శాసనసభ్యుడు, దివంగత వంగవీటి మోహన్రంగా హత్యకేసులో మూడో నిందితునిగా పరారై ఇక్కడకి వలసొచ్చి.. ఆనక ’పరిస్థితులు’ కలసి రావడంతో ఎమ్మెల్యే గిరీ వెలగబెడుతున్న వెలగపూడి.. విశాఖ సంస్కృతికిపై తనదైన విషాన్ని చిమ్ముతూ వచ్చారు. ► ముందుగా చెప్పాలంటే కోడి పందేలు... గోదావరి జిల్లాల్లో పెద్ద పండక్కి ఆనవాయితీగా జరిగే సంప్రదాయ కోడి పందేలకు వెలగపూడి ఇక్కడ జూదం ముసుగు వేసి తెరలేపారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలకు భిన్నంగా అడ్డగోలుగా కోడిపందేలను దగ్గరుండి నిర్వహించేవారు. ఈ వ్యవహారాలపై 2018లో సాక్షిలో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో అదే ఏడాది కోడి పందేల కేసులో వెలగపూడి అభిమానం సంఘం నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ జూదం మాటున జరిగే కోడిపందేలకు పూర్తి స్థాయిలో అడ్డు కట్ట పడింది. ఐదారేళ్ళుగా కోడి పందేల బరులుతో విష సంస్కృతితో అల్లాడిన తూర్పు నియోజకవర్గంలో గతేడాది ఒక్క బరి కూడా గీయలేదు. ఇలా వెలగ’కోడి’కి పూర్తిగా రెక్కలు విరిగాయనే చెప్పాలి. ► ఇక వెలగపూడి బ్యాచ్ చేసే దందాలకు ఏడాదిన్నరగా పూర్తిగా బ్రేక్ పడింది. తూర్పున అడ్డు అదుపు లేకుండా వెలగపూడి అనుచరులు.. షాపులు, వాణిజ్య వ్యాపార సంస్థలకు పెట్టే ’ఇండెంట్స్’ లేకుండా పోయాయి. ► ఇది మరో భారీ దెబ్బ... దశాబ్దాల మద్యం మాఫియాకు ముకుతాడు పడింది. ఏడాదిన్నర కిందట వరకు ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే కాదు.. నగరం మొత్తంమీద మద్యం మాఫియాకు వెలగపూడే నాయకత్వం వహించే వారు. లెక్కకు మించిన బార్ అండ్ రెస్టారెంట్లలో వాటాలున్నా... బినామీల పేరిట సొంతంగా నాలుగు షాపులు, రెండు బార్ అండ్ రెస్టారెంట్లు నిర్వహించే వారు. ఆరిలోవ, పెదగదిలి, ఎంవీపీ కాలనీ, జగదాంబ సెంటర్లలో షాపులు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట, ఓల్డ్ టౌన్లో బార్లు ఉండేవి. జగదాంబ సెంటర్లో షాపు స్వయంగా వెలగపూడి కుటుంబసభ్యుల పేరిటే ఉండేది. ఆయా షాపుల్లో కల్తీ మద్యం ఏరులై పారినా దాదాపు పదేళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపారు. ఆ క్రమంలోనే వెలగపూడి చిట్టాలోని షాపుల్లో వరుసగా కల్తీ మద్యం విక్రయిస్తున్న దాఖలాలు బయటపడ్డాయి. కేసులు నమోదు చేసి పాత్రధారులను అరెస్టు చేశారు. వెంటనే సూత్రధారి వెలగపూడి బయటకు వచ్చి నానాయాగీ చేశారు. వెంకోజిపాలెంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న విషయం బయటపడి కేసులు రాస్తే వెలగపూడి సీరియస్గా చేసిన ’యాక్షన్’ నవ్వులు పూయించింది. స్టేషన్ వద్దనే నిద్ర చేసి హడావుడి చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దరిమిలా నూతన మద్యం పాలసీ నేపథ్యంలో వెలగపూడి పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణను నుంచి తప్పుకున్నట్టే చెప్పాలి. అంటే దాదాపు 20ఏళ్లుగా మద్యం మహమ్మారితోనే వ్యాపారం.. కాదు కాదు... ఆ ముసుగులో దందాలు చేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే చెక్ పడింది. ► ఇక తాజాగా వెలగపూడి భూదందాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. వెలగపూడి భార్య పేరిట రుషికొండలో బీచ్ రోడ్డు సర్వే నెంబరు 21లో గెడ్డ పక్కన ఆక్రమించిన ఆరు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రేకుల షెడ్ను.. చుట్టూ ఉన్న ప్రహరీని తొలగించారు. ► ఈ వరుస పరిణామాల నేపథ్యంలో విశాఖ తూర్పు ప్రజలు హాయిగా స్వేచ్ఛావాయువులు పీలుస్తుంటే... అన్ని అక్రమాల రెక్కలు తెగిన వెలగ’కోడి’ మాత్రం గిల గిలా కొట్టుకుంటోందని అంటున్నారు. అందుకే సదరు వెలగపూడి... విశాఖ సమగ్రాభివృద్ధిని కాంక్షించే రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డిపై లేనిపోని ఆయాసంతో అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని పచ్చ బ్యాచే ఆఫ్ ది రికార్డ్గా అంగీకరిస్తున్నారు. ఇంకెవరికైనా ఎనీ డౌట్స్.?. -
‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!
-
‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!
సాక్షి, అనంతపురం: వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజలకు ఉచిత సలహాలిచ్చి విమర్శలు కొనితెచ్చుకున్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన బాలయ్య 9 నెలలుగా అటువైపు కన్నెత్తైనా చూడలేదు. ఈక్రమంలో ఆయన తీరుపై స్థానికంగా విమర్శలు రావడంతో సోమవారం హిందూపురంలో పర్యటించారు. అయితే, భౌతికదూరం నిబంధనలను పాటించకుండా సమావేశంలో పాల్గొన్నారు. (దళితులు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు) దాంతోపాటు.. కరోనాకు భయపడొద్దని, వేద మంత్రాలతో కరోనాను ఎదుర్కొందామని చెప్తూ లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివి వినిపించారు. కరోనా నివారణ కోసం ఈ మంత్రాన్ని పఠించాలని ప్రజలకు సూచించారు. తాను చెప్పిన మంత్రాన్ని 108 సార్లు చెబితే కరోనా దరిచేరదని బాలకృష్ణ పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి మంత్రాలు చదవమనడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘బాలయ్య కరోనా మంత్రం’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. (టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్’) -
మాజీ ఎమ్మెల్యే తనయుడికి రెండో వివాహ యత్నం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement