-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!
అక్కినేని హీరోల్లో నాగచైతన్య కాస్త డిఫరెంట్. పెద్దగా బయట కనిపించడు. సినిమా షూటింగ్స్ ఫొటోలు ఏమైనా వైరల్ అయితే తప్ప సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్గా ఉండడు. అలాంటిది మదర్స్ డే సందర్భంగా అమ్మతో ఉన్న ఓ క్యూట్ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో చైతూ తల్లిని చాలామంది తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అంతలా మారిపోయి కనిపించారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)టాలీవుడ్ దిగ్గజ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మి. ఈమె హీరో నాగార్జునని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు పుట్టిన సంతానమే నాగచైతన్య. వ్యక్తిగత కారణాలతో నాగార్జున-లక్ష్మి విడాకులు తీసుకున్నారు. కానీ కొడుకు చైతూ మాత్రం తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మితో మంచి రిలేషన్ మెంటైన్ చేస్తుంటాడు. అప్పట్లో పూర్తి హెయిర్తో కనిపించిన లక్ష్మి.. ఇప్పుడు చైతూ షేర్ చేసిన పిక్లో తక్కువ జుత్తులో ఉండేసరికి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఆమె ఈమె ఒకరేనా అని మాట్లాడుకుంటున్నారు.ఇక చైతూ సినిమాల విషయానికొస్తే.. 'తండేల్' సినిమా చేస్తున్నాడు. నిజ జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ మూవీలో చైతూ.. జాలారిగా కనిపించబోతున్నాడు. ఇతడి సరసన సాయిపల్లవి హీరోయిన్గా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్లో ఉంది. అక్టోబరు రిలీజ్ అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
Tandel: ప్రేమ కబుర్లు
మొబైల్లో ప్రేమ కబుర్లు చెబుతున్నారు సాయి పల్లవి. ‘లవ్స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ లవ్స్టోరీ ఫిల్మ్కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారని తెలిసింది. కాగా నేడు (మే 9) సాయి పల్లవి బర్త్ డే. ఈ సందర్భంగా ‘తండేల్’ సినిమాలోని ఆమె కొత్త ఫొటోను బుధవారం విడుదల చేశారు మేకర్స్. సత్యభామ ఎవరితోనో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. బహుశా రాజుతో ప్రేమ కబుర్లు చెబుతుందేమో! ఇక ఈ పాత్ర తాలూకు వీడియోను నేడు విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
తెలుగుమ్మాయి శోభిత ధూళిపాళ టాలీవుడ్, బాలీవుడ్లోనే కాదు ఏకంగా హాలీవుడ్లోనూ ఆఫర్ అందుకుని అక్కడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. ఈ మధ్య వెకేషన్కు వెళ్లగా.. తెలుగు హీరో నాగచైతన్య కూడా తన వెంటే ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేసిందీ బ్యూటీ. 'ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్ (chai), అండ్ దట్స్ ఓకే' అని రాసుకొచ్చింది. నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు అని దానర్థం.కప్ ఆఫ్ చాయ్/చైసాధారణంగా కప్ ఆఫ్ టీ అంటారు. కానీ శోభిత కప్ ఆఫ్ చాయ్ అని పేర్కొంది. దీంతో కొందరు నెటిజన్లు చైతన్యను ప్రస్తావిస్తూనే చై అని రాసిందని అభిప్రాయపడుతున్నారు. టీకి బదులుగా చాయ్/ చై అని రాయడం దేనికో అని కామెంట్స్ చేస్తున్నారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఈ పోస్ట్కు స్పందిస్తూ.. నేను కూడా నా విషయంలో అలాగే ఫీలవుతుంటాను అని రాసుకొచ్చాడు.కెరీర్శోభిత కెరీర్ విషయానికి వస్తే.. గూడచారి, మేజర్ సినిమాలతో తెలుగు వారికి దగ్గరైంది. రామన్ రాఘవన్ 2.0, పొన్నియన్ సెల్వన్ 1, ఘోస్ట్ స్టోరీస్ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించింది. మేడ్ ఇన్ హెవెన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సితార అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) చదవండి: 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు -
తండేల్ - భారీ ధరకు డిజిటల్ రైట్స్
-
భారీ ధరకు తండేల్ డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రాజు అనే మత్స్యకారుడి పాత్రలో చైతూ కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. తండేల్ మూవీ ఓటీటీ డీల్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. నాగచైతన్య కెరీర్లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ను దక్కించుకుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న తండేల్ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
సమంత రుతు ప్రభు.. ఈ పేరు చెప్పగానే సినిమాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ట్రోల్స్ ఇలా చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే ఈమె జీవితం సినిమాని మించిపోయేలా ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్తో పాటు ట్రాజెడీ అనిపించే సంగతులు చాలానే వినిపిస్తాయి. వీటి గురించి కొందరికి తెలిస్తే మరికొందరికి తెలియదు. ఇప్పుడు సమంత 37వ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వాటిని అలా గుర్తుచేసుకుందాం.తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగిన సమంత.. అక్కడే చదువుకుంది. డిగ్రీ చివర్లో ఉండగానే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం పార్టీలు, ఈవెంట్స్లో వెల్కమ్ గర్ల్గా పనిచేసింది. అలానే 'ఏ మాయ చేశావె'.. ఈమె తొలి సినిమా అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకంటే ముందే తమిళంలో 'మాస్కోవిన్ కావేరి' అనే మూవీ చేసింది.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్.. ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. 2010-19 వరకు దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వరస చిత్రాలు చేసిన సమంత.. ఆ తర్వాత మాత్రం వరస ఫ్లాపుల దెబ్బకు డౌన్ అయిపోయింది. మధ్యలో ఈమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్టు తెలియడంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది.సినిమాలతో పాటు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఉగ్రవాది తరహా పాత్రలో నటించి షాకిచ్చింది. అప్పటివరకు గ్లామరస్ రోల్స్లో సామ్ని చూసిన ఫ్యాన్స్.. ఈ సిరీస్లో సమంత డీ గ్లామర్ గెటప్, ఫైట్స్ చేయడం చూసి అవాక్కయ్యారు.(ఇదీ చదవండి: సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్)సమంతకు యశోద అనే మరోపేరు కూడా ఉంది. ఈ విషయం దాదాపు ఎవరికీ తెలియదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆమెని ఈ పేరుతో పిలుస్తారు. 'యశోద' పేరుతో సమంత ఓ సినిమా కూడా చేయడం విశేషం. అలానే 2012లో తెలుగు, తమిళంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. రేవతి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హీరోయిన్గా ఘనత సాధించింది.2013లో తనకు డయాబెటిస్ ఉన్నట్లు బయటపెట్టిన సమంత.. జిమ్, హెల్తీ ఫుడ్ తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడింది. కానీ ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. 2022 అక్టోబరులో ఈ విషయాన్ని బయటపెట్టింది. దీని వల్ల దీర్ఘకాలిక కండరాల వాపు వస్తుంది. ప్రస్తుతం కొంతమేర దీన్నుంచి కోలుకుంది. పూర్తిగా నార్మల్ అవ్వాలంటే మాత్రం కొన్నేళ్లు పట్టొచ్చు!(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!)సినిమాల సంగతి పక్కనబెడితే సమంత వ్యక్తిగత జీవితం అంతకు మించి అనేలా ఉంటుంది. అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించింది. 2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ ఏమైందో ఏమో గానీ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీలో అందరూ షాకయ్యారు. కారణం ఏంటో తెలియకుండానే సమంతపై చాలా విమర్శలు చేశారు. పర్సనల్ స్టైలిష్ట్తో ఎఫైరే దీనికి కారణమని అన్నారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుటికీ సస్పెన్సే.సాధారణంగా హీరోయిన్లు పెద్దగా వివాదాలు జోలికి వెళ్లరు. కానీ సమంత మాత్రం ఈ విషయంలో కాస్త డిఫరెంట్. కోరి తెచ్చుకునేలా కొన్నింటిని నెత్తిన పెట్టుకునేది. ట్రోలింగ్కి గురయ్యేది. అయితే ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా సరే సమంతలో ఓ మంచి మనిషి కూడా ఉంది. పేద పిల్లలు, మహిళల సంక్షేమం కోసం 'ప్రత్యూష సపోర్ట్' అనే ఎన్జీవో స్థాపించి చాలామందికి సహాయపడుతోంది. ఇలా సమంత జీవితం చూసుకుంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని స్థాయి నుంచి మొదలై.. స్టార్ హీరోయిన్ హోదా అనుభవించి.. పెళ్లి జీవితంతో విమర్శలు ఎదుర్కొని.. పరిస్థితులు ఎదురు తిరిగిన నిలబడి గెలిచిన బ్యూటీ సామ్.(ఇదీ చదవండి: ఎక్కడెక్కడో టచ్ చేశారు.. వస్తావా అంటే తెలియక సరే అన్నాను: కీర్తి భట్) -
పెళ్లి జ్ఞాపకాల్ని అలా మార్చేసిన సమంత.. వీడియో వైరల్
సమంత పేరు చెప్పగానే ఆమె పెళ్లి, విడాకులే చాలామందికి గుర్తొస్తాయి. ఎందుకంటే కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఎన్నాళ్లు బంధాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కారణమేంటో గానీ విడాకులు తీసేసుకుంది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. పెళ్లి పెటాకులు అయినా.. సామ్ దగ్గర ఆ జ్ఞాపకాల ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు వాటితో ప్రయోగం చేసింది. ఇంతకీ అసలేంటి విషయం?'ఏ మాయ చేశావె'తో హీరోయిన్ అయిపోయిన సమంత.. ఇదే సినిమాలో హీరోగా చేసిన నాగచైతన్యని లవ్ చేసింది. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో వీళ్లిద్దరూ జంటగా నటించారు. అలా కొన్నేళ్ల పాటు సాగిన ప్రేమకు 2017లో ఎండ్ కార్డ్ వేశారు. పెద్దల్ని ఒప్పించి చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ నాలుగేళ్లలో అంటే 2021లో విడాకులు తీసుకున్నారు.అయితే పెళ్లిలో సమంత.. వైట్ కలర్ వెడ్డింగ్ గౌన్ ఒకటి అప్పట్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అయితే పెళ్లి, విడాకులు తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు. కానీ దాన్ని అలానే జాగ్రత్తగా దాచుకున్న సమంత.. ఇప్పుడు ఆ గౌన్కి ఉన్న చిన్న చిన్న పూలని తీసి కొత్త డ్రస్ కోసం ఉపయోగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామ్ ఇన్ స్టాలోనే ఉంది. పెళ్లి జీవితం సరిగా లేనప్పటికీ.. ఆ జ్ఞాపకాల్ని ఇంకా పదిలంగా అలా ఉంచుకోవడం ఇంట్రెస్టింగ్ విషయమే. View this post on Instagram A post shared by Krésha Bajaj (@kreshabajajofficial) -
అమాయకుడైన 'చై'ని మోసం చేశావ్.. సమంత దిమ్మతిరిగే ఆన్సర్
-
చై అమాయకుడు, ఎందుకు మోసం చేశావ్? సామ్ ఆన్సరిదే!
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎందుకు విడిపోతుంది? పెళ్లికి ముందు ఉన్న ప్రేమ తర్వాత ఎందుకు ఉండట్లేదు? జీవితాంతం కలిసుండాలనుకున్న లవ్ బర్డ్స్ భార్యాభర్తలుగా ఎందుకు కంటిన్యూ అవలేకపోతున్నారు? ఈ ప్రశ్నలకు కారణాలెన్నో...! కొన్నిసార్లు తప్పు ఒకరివైపు ఉండొచ్చు, మరికొన్నిసార్లు ఇరువైపులా ఉండొచ్చు. మూడో వ్యక్తి మధ్యలో దూరడం వల్ల కూడా అవొచ్చు లేదా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడమూ ఓ కారణం కావొచ్చు. మోసం చేశావని కామెంట్స్ సెలబ్రిటీలైతే అవన్నీ బయటకు చెప్పుకోలేక భేదాభిప్రాయాల వల్ల విడిపోతున్నామని సింపుల్గా చెప్పేస్తారు. కానీ దాని వెనక ఉన్న బాధను లోలోపలే భరిస్తూ పైకి నవ్వుతూ కనిపిస్తారు. ఇది అర్థం చేసుకోలేని జనాలు.. ఎంతసేపూ నువ్వు మా వాడిని మోసం చేశావు.. నువ్వు మా హీరోయిన్ను మోసం చేశావంటూ వారిని నిందిస్తూనే ఉంటారు. హద్దులు దాటిన నెటిజన్ అలా సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ వారిని విమర్శించడం ఆపడం లేదు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సామ్ ఆరోగ్యం గురించి తెలుపుతూ ఓ పాడ్కాస్ట్ వీడియో షేర్ చేసింది. ఓ నెటిజన్ ఈ వీడియో గురించి మాట్లాడకుండా ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ హద్దులు దాటాడు. సామ్ స్ట్రాంగ్ కౌంటర్ అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావో చెప్పు అని కామెంట్ చేశాడు. ఇది చూసిన సామ్.. సారీ, ఇలాంటివి చేయడం మీకంత మంచిది కాకపోవచ్చు. మీకింకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా అని చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీతో రిప్లై ఇచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ నిన్ను కిందకు దిగజార్చాలనుకునే ట్రోలర్స్కు ఇలాగే ఇచ్చిపడేయ్.. ఎవరికీ అవకాశం ఇవ్వకు అని కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అఫీషియల్ ప్రకటన.. ఆ రోజు నుంచే భీమా స్ట్రీమింగ్ -
అర్జున్కి కనెక్ట్ అయ్యా!
‘‘ఓపెన్ చేస్తే వైజాగ్లో అందమైన ఇల్లు...’’ అంటూ నాగచైతన్య ఇచ్చిన వాయిస్ ఓవర్తో మొదలైంది ‘డియర్’ చిత్రం ట్రైలర్. జీవీ ప్రకాశ్కుమార్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన చిత్రం ‘డియర్’. తమిళంలో ఈ నెల 11న, తెలుగులో 12న ఈ చిత్రం విడుదల కానుంది. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి. పృథ్వీరాజ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంధ్రాలో అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణలో ఏషియన్ సినిమాస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. భార్య (ఐశ్వర్యా రాజేశ్) గురక కారణంగా భర్త (జీవీ ప్రకాశ్) సతమతమవుతుంటాడు. ఆ గురక కారణంగా వారి అనుబంధంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది ‘డియర్’ కథాంశం. ‘‘ఈ ప్రపంచంలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? రాత్రిపూట మంచి నిద్ర. ఈ కథను (‘డియర్’కి ఇచ్చిన వాయిస్ ఓవర్ని ఉద్దేశించి) నెరేట్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. అర్జున్ (జీవీ ప్రకాశ్ పాత్ర) భయానికి నేను కనెక్ట్ అయ్యాను. మీరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో ‘డియర్’ ట్రైలర్ని షేర్ చేశారు నాగచైతన్య. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
మాస్ డిష్యుం
‘తండేల్’ సెట్స్లో డిష్యుం డిష్యుం అంటూ అదిరిపోయే మాస్ ఫైట్స్ చేస్తున్నాడు రాజు. నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. నాగచైతన్యతో ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ సినిమాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ మాస్ యాక్షన్ సీక్వెన్స్ను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ‘యానిమల్’ సినిమాకు చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ను డిజైన్ చేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ‘తండేల్’లో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. -
పదేళ్ల తర్వాత...
హీరో నాగచైతన్య, హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. 2014లో విడుదలైన ‘ఒక లైలా కోసం’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారని టాక్. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఆ తర్వాతి చిత్రాన్ని ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్నారట. నాగచైతన్య కోసం మిస్టరీ, పౌరాణిక, థ్రిల్లర్ అంశాలతో కథ రెడీ చేస్తున్నారట కార్తీక్ దండు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన పూజా హెగ్డేని కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారని భోగట్టా. ఇక 2022లో విడుదలైన ‘ఆచార్య’ సినిమా తర్వాత (‘ఎఫ్ 3’లో ప్రత్యేక పాట చేశారు) మరో తెలుగు సినిమా కమిట్ కాలేదు పూజాహెగ్డే. నాగచైతన్యతో నటించే తాజా చిత్రం ఆమెకు తెలుగులో పెద్ద కమ్బ్యాక్ అవుతుందని టాక్. ప్రస్తుతం బాలీవుడ్లో ‘దేవా’ అనే సినిమా చేస్తున్నారు పూజా హెగ్డే. -
హైదరాబాద్లో తండేల్
నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘తండేల్’. ‘లవ్ స్టోరీ’ వంటి హిట్ మూవీ తర్వాత నాగచైతన్యతో రెండోసారి ‘తండేల్’లో నటిస్తున్నారు సాయి పల్లవి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్పై ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా షూట్ డైరీస్ పేరుతో సెట్స్లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు మేకర్స్. ‘‘దేశభక్తి అంశాలతో కూడిన రస్టిక్ లవ్ స్టోరీ ‘తండేల్’. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. పాత్రలకు అనుగుణంగా నాగచైతన్య–సాయిపల్లవి డీ –గ్లామర్గా కనిపిస్తారు. నటీనటుల గెటప్, క్యాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చందు మొండేటి’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్దత్. -
Thandel Shooting Pics: సాయి పల్లవి ఒళ్లో క్యూట్ పాప.. తండేల్ షూటింగ్ ఫోటోలు
-
ఈవెంట్లో మెరిసిన చై- సామ్.. కానీ ఓ చిన్న ట్విస్ట్
-
ఓకే ఈవెంట్లో సందడి చేసిన సామ్- చైతూ.. కాకపోతే!
హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్లో అగ్ర కథానాయకిగా రాణించిన ఈమె సినీ, వ్యక్తిగత జీవితాలు రెండు సంచలనమే. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. అదే విధంగా కథానాయకిగా మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సిటాడెల్ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ నిర్వహించిన ఈవెంట్లో సందడి చేసింది సామ్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది తమ ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లకు సంబంధింటిన వివరాలను ఈ గ్రాండ్ ఈవెంట్లో వెల్లడించింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటాడెల్ సిరీస్ కూడా ఉంది. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ పేరును కూడా మార్చేశారు. సిటాడెల్: హనీ బన్నీ పేరును ఖరారు చేశారు. సిటాడెల్ యూనివర్స్లో హనీ బన్నీ ఇండియన్ సిరీస్ అనే క్యాప్షన్తో సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఊహించని విధంగా ఈ ఈవెంట్లో అక్కినేని హీరో నాగచైతన్య కూడా సందడి చేశారు. గతేడాది తాను నటించిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత సక్సెస్ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈవెంట్లో వెబ్ సిరీస్ టీమ్తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోను అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్ట్ చేసింది. తెలుగు మోస్ట్ సక్సెస్ఫుల్ ఒరిజినల్ వెబ్ సిరీస్గా దూత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయితే చాలా రోజుల తర్వాత నాగచైతన్య, సమంత ఓకే ఈవెంట్లో కనిపించారు. విడిపోయాక వీరిద్దరు కలిసి ఈవెంట్స్లో కనిపించడం చాలా అరుదు. గతంలో వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీరిద్దరు పాల్గొన్నట్లు సమాచారం. కానీ చాలా రోజుల తర్వాత ఓకే ఈవెంట్లో ఈ జంట మెరిసింది. అయితే ఇద్దరు కూడా వేరు వేరుగా తమ మూవీల ప్రమోషన్స్లో భాగంగానే ఈవెంట్కు హాజరయ్యారు. విడివిడిగానైనా చై- సామ్ ఓ ఈవెంట్కు హాజరు కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. our homegrown spy 🔎 #SamanthaRuthPrabhu #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Cd8U5RE5df — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 Celebrating #DhoothaOnPrime - Our most successful Telugu Original series.#AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/PeZ6I8bZlb — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
ఓటీటీలో మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు వెబ్ సిరీస్ ఏదో తెలుసా!
ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. గతేడాది నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ దూత. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో డిసెంబర్ 1న స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఎనిమిది ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్ను శరద్ మరార్ నిర్మించారు. ఈ సిరీస్కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగులో అత్యంత సక్సెస్ఫుల్గా నిలిచిన వెబ్ సిరీస్గా ఘనతను సొంతం చేసుకుంది. ఇవాళ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రైమ్ వీడియో ప్రజెంట్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేదికపై నాగచైతన్యతో పాటు ఈ సిరీస్ దర్శక, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. కాగా.. ఇటీవలే ఈనెల 19న దూత సీజన్-2 గురించి హింట్ ఇచ్చారు నాగచైతన్య. కానీ అప్డేట్ అయితే రాలేదు.. దూత సిరీస్ మాత్రం అమెజాన్ ప్రైమ్లో తెలుగు సక్సెస్ఫుల్ ఒరిజినల్ వెబ్ సిరీస్గా నిలిచింది. Celebrating #DhoothaOnPrime - Our most successful Telugu Original series.#AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/PeZ6I8bZlb — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
కన్ఫ్యూజ్ అవుతున్నారా?.. ఆ రోజు క్లారిటీ ఇస్తా: నాగ చైతన్య
యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. సముద్రం బ్యాక్డ్రాప్లో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ మత్య్సకారుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. అయితే ఇదిలా ఉండగా.. గతేడాది నాగ చైతన్య ఓటీటీలోను ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చైతూ ప్రధాన పాత్రలో దూత అనే వెబ్ సిరీస్ వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దూత వెబ్ సిరీస్ సక్సెస్ అవడంతో రెండో సీజన్ కూడా రానుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. దూత సీజన్ 2 గురించి ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా నాగ చైతన్య వీడియోను అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో నాగచైతన్య చదువుతున్న న్యూస్ పేపర్లో మార్చి 19 అని రాసి ఉంది. దీంతో అదే రోజున దూత సీజన్-2 అప్డేట్ అదే రోజున రానుందని అర్థమవుతోంది. ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇంకా క్లూస్ కావాలా? మార్చి 19న.. మీరు రెడీనా? అని నాగచైతన్య అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముఖ్యంగా దూత వెబ్ సిరీస్లో న్యూస్ పేపర్ ప్రధానంగా ఉంటుంది. ఈ వీడియోలో న్యూస్ పేపర్తో చైతూ కనిపించడంతో సీజన్ 2 గురించే నని క్లారిటీ ఇచ్చినట్లు ఉంది. మార్చి 19న ఈ రెండో సీజన్కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన చేసేలా కనిపిస్తోంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఆ రోజు వరకు వేచి చూడాల్సిందే. Are you ready Are you ready Are you ready 𝟏𝟗 𝐌𝐚𝐫𝐜𝐡 ✅ Em plan chesav mawa @PrimeVideoIN...?🤔@chay_akkineni || #NagaChaitanya pic.twitter.com/kLEJ6jg3Rh — ChayAkkineni ™ 🏹 (@MassChayCults) March 17, 2024 -
తండేల్ పైనే చైతూ ఆశలు..!
-
హైదరాబాద్లో పాకిస్తాన్ జైలు!
హైదరాబాద్లో పాకిస్తాన్ జైలు ఏంటి? అనే సందేహం తలెత్తడం ఖాయం. ఇంతకీ విషయం ఏంటంటే.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా కోసం హైదరాబాద్లో పాకిస్తాన్ జైలు సెట్ వేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆ జైలు సెట్లోనే జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్పై బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. చేపల వేటలో భాగంగా పోరపాటున పాకిస్తాన్ సముద్రంలోకి వెళ్లి పట్టుబడిన కొందరు మత్స్యకారుల వాస్తవ ఘటనలతో ‘తండేల్’ రూపొందుతోంది.పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించిన వారిలో ఓ వ్యక్తిపాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ మూవీ కోసం హైదరాబాద్లోపాకిస్తాన్ జైలు సెట్ వేశారు. ప్రస్తుతం ఈ సెట్లో షూటింగ్ జరుగుతోంది. హీరో, హీరోయిన్, ఇతర ముఖ్య తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగేపాకిస్తాన్ జైలు నుంచి విడుదలై భారతదేశానికి వచ్చిన మత్స్యకారులు ఒక రైల్వే స్టేషన్లో దిగే సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారట మేకర్స్. హైదరాబాద్లోని రైల్వేస్టేషన్లో ఈ సీన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. -
తండేల్ సెట్లో నాగ చైతన్య.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న హీరో!
అక్కినేని హీరో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. నాగచైతన్య మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేశ్ బర్త్ డేను సెట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. తండేల్ మూవీ సెట్లో కేక్ కట్ చేసి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ చందు కూడా అతనికి విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా సొంతవాళ్లలా చూసుకునే చైతూపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Our Queen @Sai_Pallavi92 🥹🤍 from the sets of #Thandel movie celebrating @chay_akkineni 's assistant Venki Bday ❤️#SaiPallavi @chandoomondeti pic.twitter.com/YwbFzksCSG — SaiPallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) March 10, 2024 -
ఉత్తరాంధ్రపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్
టాలీవుడ్లో ఒకప్పుడు రాయలసీమ నేపథ్యంగా సాగే సినిమాలు ఎక్కువ వచ్చేవి. హీరోలు కూడా రాయలసీమ యాసలోనే మాట్లాడేవాళ్లు. ఆ తర్వాత తెలంగాణ నేపథ్య కథలు వెండితెరపై సందడి చేశాయి. కేవలం విలన్లకు, కమెడియన్లకు మాత్రమే వాడే తెలంగాణ యాసను.. హీరో పాత్రతో మాట్లాడించి హిట్ కొట్టారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో పాటు నాని, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, నాగచైతన్య లాంటి యంగ్ స్టార్స్ సైతం తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ అంతా ఉత్తరాంధ్ర బాషపై మక్కువ చూపుతున్నారు. టాలీవుడ్లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం కథ ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుంది. ఓ ఆటను ప్రధానంగా చేసుకొని బలమైన భావోద్వేగాలతో ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నాడట బుచ్చిబాబు. ఇందులో హీరోతో పాటు అన్ని మిగతా పాత్రధారులంతా ఉత్తరాంధ్ర యాసలోనే మాట్లాడతారట. ఉత్తరాంధ్ర యాసను అనర్గళంగా మాట్లాడే నటీనటులను వెతికే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర యాస కోసం రామ్ చరణ్ శిక్షణ తీసుకుంటున్నారట. ఈ మూవీలో ఆయన లుక్ చాలా రస్టిక్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జాలరి ప్రేమ కథ నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం తండేల్. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరు ఉత్తరాంధ్ర యాసలోనే మాట్లాడతారు.ఇటీవలే వచ్చిన గ్లింప్స్లో నాగచైతన్య ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంది. ‘మట్కా’ఆడనున్న వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పలాస ఫేం కరుణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే సాగనుంది. మట్కా అనేది ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఆడే ఒక జూదం.1958-1982 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా మట్కా స్టోరీ రాసుకున్నాడు కరుణ కుమార్. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా స్టోరీ సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో వరుణ్ నాలుగు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారు. ఉత్తరాంధ్ర యాసలో అనుష్క మాటలు అనుష్క, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో ఓ లేడి ఓరియెంటెండ్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వేదం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై ఓ యువతి ఎలాంటి పోరాటం చేసిందనే పాయింట్తో ఈ కథను రాసుకున్నాడట క్రిష్. ఇందులో అనుష్క ఉత్తరాంధ్రకు చెందిన యువతిగా కనిపించబోతున్నారట. ఇవి మాత్రమే కాదు.. తెలుగులో మరిన్ని చిత్రాలు ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. - పోడూరి నాగ ఆంజనేయులు -
'ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయా'.. నాగచైతన్య హీరోయిన్పై సామ్ కామెంట్స్!
హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్లో అగ్ర కథానాయకిగా రాణించిన ఈమె సినీ, వ్యక్తిగత జీవితాలు రెండు సంచలనమే. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. అదే విధంగా కథానాయకిగా మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడుదాని నుంచి బయటపడటానికి శత విధాలుగా పోరాడుతున్నారు. ఈ కారణంగా సినిమాలను కూడా కోల్పోతున్నారు. కాగా తాజాగా వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. గతంలోనే అంగీకరించిన సిటాడెల్ అనే వెబ్సిరీస్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ వెబ్సిరీస్లో నటిస్తున్న సమయంలో ఒకసారి స్పృహతప్పి పడిపోయారు కూడా. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది మళ్లీ ఆ వెబ్సిరీస్ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. కాగా త్వరలోనే తాను నటించే నూతన చిత్రాల వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇటీవల ఆమె ఓ వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో ద్వారా విడుదల చేశారు. సాయిపల్లవిపై ప్రశంసలు మరో టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. సాయిపల్లవి మంచి డాన్సర్ అన్న విషయం తనకు తెలుసన్నారు. గతంలో ఆమె పాల్గొన్న డాన్స్ కార్యక్రమం పోటీలకు తాను జడ్జిగా కూడా వెళ్లానన్నారు. అప్పుడు సాయి పల్లవి డాన్స్ను చూసి దృష్టి మరల్చలేక కళ్లప్పగించి చూస్తుండి అలాగే పోయానన్నారు. కాగా..ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సముద్ర జాలర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తండేల్’ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెల్లడికానుందని సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
ఆ ఏడాది నాకు చాలా కష్టంగా గడిచింది: సమంత
హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకే తమిళమ్మాయి గానీ టాలీవుడ్లో వరస సినిమాలు చేసింది. అలానే హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలైపోయింది. అయితే వ్యక్తిగత కారణాలతో 2021లో సమంత-చైతూ విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన ఏడాది సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు సామ్ బయటపెట్టింది. ఇప్పుడు దాన్నుంచి కోలుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. 'ఏ మాయ చేశావె' సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న సమంత.. ఆ తర్వాత తెలుగులో మహేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. చివరగా 'ఖుషి' చేసింది. ప్రస్తుతం ఈమె చేతలో కొత్త ప్రాజెక్టులేం లేవు. దీంతో యూట్యూబ్ ఛానెల్లో పాడ్ కాస్ట్ మొదలుపెట్టింది. తాజాగా తొలి ఎపిసోడ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులోనే ఆటో ఇమ్యూనిటీ గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) సమంతతో పాటు ఈ పాడ్ కాస్ట్లో ప్రత్యేక నిపుణుడు అల్కేశ్తో కనిపించింది. అతడు ఆటో ఇమ్యూనిటీ గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. 'శరీరంలోని చెడు కారకాలు.. బయటికి వెళ్లే చెడు కారకాల మధ్య బ్యాలెన్స్(సమ తుల్యత) దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుత జీవన విధానంలో పర్యావరణానికి సంబంధించిన టాక్సిక్స్ (చెడు కారకాలు) ఎక్కువగా ఉన్నాయి. కాస్మోటిక్స్, దుస్తులు, వంట సమాన్లతో పాటు చాలా విషయాలు.. ఆటో ఇమ్యూనిటీ విషయంలో ప్రభావం చూపిస్తాయి' అని ఇతడు చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన సమంత.. 'చాలామంది మంచి ఆహారం తింటూ బాగున్నామని, ఎలాంటి సమస్యలు రావని అనుకుంటున్నారు. నేను కూడా అలానే అనుకున్నాను కానీ ఆటో ఇమ్యూనిటీ సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. తద్వారా మయోసైటిస్ బారిన పడ్డాను. అయితే వ్యాధి రావడానికి ముందు ఏడాది అయితే నాకు చాలా కష్టంగా గడిచింది' అని సమంత చెప్పుకొచ్చింది. ఈ వీడియో బట్టి సమంతకు సౌందర్య సాధనాలు (కాస్మోటిక్స్) వల్లే మయోసైటిస్ సమస్య ఏర్పడిందా అనే సందేహం కలుగుతోంది. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) -
దసరాకు తండేల్!
దసరా పండక్కి థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారట ‘తండేల్’. హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ``కాగా ‘తండేల్’ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట దర్శకుడు చందు మొండేటి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెల్లడికానుందని సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement