-
బీజేపీకి 8 సార్లు ఓటు! యూపీ యువకుడు అరెస్ట్
లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర పదేశ్కు చెందిన ఓ యువ ఓటర్ చేసిన పనికి పోలీసుల చేత అరెస్ట్ అయ్యాడు.నాలుగో విడత పోలింగ్లో యూపీలోని ఫరూఖాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓ యువ ఓటరు ఏకంగా ఎనిమిదిసార్లు ఓటు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు షేర్ చేయడంతో పోలీసులు స్పందించారు.BIG EXPOSE 🚨⚡Akhilesh Yadav has shared this video from Uttar Pradesh in which a boy has voted 8 times for BJP with different slips Hi @ECISVEEP when are you going to wake up from your sleep? This is violation of election code, and must go for repolling on this booth. pic.twitter.com/Z06u9xqDor— Amockxi FC (@Amockx2022) May 19, 2024 ఏఆర్ఓ ప్రతీత్ త్రిపాఠి ఫిర్యాదు ఆధారంగా నయా గావ్ పోలీస్ స్టేషన్లో సదరు యువకుడిపై అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ యువకుడిని రాజన్ సింగ్గా పోలీసులు గుర్తించారు.అతను ఫరూఖాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్పుత్కు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంపై 8 సార్లు నొక్కి ఓటు వేసిననట్లు వీడియోలో తెలుస్తోంది.ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్పందించారు. ‘ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనించాం. జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకుంటారు’అని అన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రంలోని అధికారులను పోల్ ప్యానెల్ సస్పెండ్ చేసింది. ‘ప్రియమైన ఎలక్షన్ కమిషన్, మీరు ఇది చూశారా? ఒక వ్యక్తి 8 సార్లు ఓటు వేశాడు. ఇది స్పందించాల్సి సమయం’ అని కాంగ్రెస్ ‘ఎక్స్’లో పేర్కొంది. సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం దినికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అదేవిధంగా ‘ఈ ఘటనను ఎన్నికల సంఘం తప్పుగా భావిస్తే.. వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే బీజేపీ బూత్ కమిటి నిజమైన లూటీ చేసే కమిటీ అని అర్థమవుతుంది’అని అఖిలేష్ యాదవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
లోక్సభ ఎన్నికలు 2024: ముగిసిన ఐదో విడత పోలింగ్
Updatesసాయంత్రం 7 గంటలవరకు నమోదయిన సగటు పోలింగ్ శాతం 57.38బీహార్ - 52.35%జమ్మూ-కాశ్మీర్ - 54.21%జార్ఖండ్ - 61.90%లఢఖ్ - 67.15%మహారాష్ట్ర - 48.66%ఒడిస్సా- 60.55%ఉత్తరప్రదేశ్ - 55.80%పశ్చిమబెంగాల్ - 73%మధ్యాహ్నం 3 గంటల వరకు 47.53 శాతం పోలింగ్..లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ కొనసాగుతోందిప్రజలు తమ ఓటు హక్కు వినియోంగిచుకోవడానికి తరలి వస్తున్నారు.మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున 47.53 శాతం పోలింగ్ నమోదుబీహార్ 45.33 శాతంజమ్మూ అండ్ కాశ్మీర్ 44.90 శాతంఝార్ఖండ్ 53.90 శాతంలడఖ్ 61.26 శాతంమహారాష్ట్ర 38.77 శాతంఒడిశా 48.95శాతంఉత్తర ప్రదేశ్ 47.55 శాతంవెస్ట్ బెంగాల్ 62.72 శాతంమధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 36.73 శాతం పోలింగ్ నమోదైంది.బీహార్ 34.62%జమ్మూ కశ్మీర్ 34.79%జార్ఖండ్ 41.89%లడఖ్ 52.02%మహారాష్ట్ర 27.78%ఒడిశా 35.31%ఉత్తరప్రదేశ్ 39.55%పశ్చిమ బెంగాల్ 48.41%#LokSabhaElections2024 | 36.73% voter turnout recorded till 1 pm, in the fifth phase of elections. Bihar 34.62% Jammu & Kashmir 34.79%Jharkhand 41.89%Ladakh 52.02% Maharashtra 27.78% Odisha 35.31% Uttar Pradesh 39.55%West Bengal 48.41% pic.twitter.com/6cxi2tJsHq— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రబాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఆయన తల్లిదండ్రులు రాకేష్ రోషన్, పింకీ రోషన్, సోదరి సునైనా రోషన్తో కలసి ఓటు వేశారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Actor Hrithik Roshan, his sister Sunaina Roshan & their parents Rakesh Roshan and Pinkie Roshan cast their votes at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5h8XFTRMvA— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రశివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.Uddhav Thackeray, his wife Rashmi and son Aaditya cast their vote in MumbaiRead @ANI Story | https://t.co/Ljg2V0qtYc#UddhavThackeray #AadityaThackeray #LokSabhaElections2024 pic.twitter.com/8nSagjge6V— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్రనటుడు మనోజ్ బాజ్పాయ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Mumbai: After casting his vote, actor Manoj Bajpayee says, "This is the biggest festival and everyone should vote as you will get this opportunity after 5 years. If you haven't voted then you have no right to complain..."#LokSabhaElections2024 pic.twitter.com/ECZH5TeBU8— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రక్రికెటర్ అజింక్య రహానే దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.LS Polls 2024: India cricketer Ajinkya Rahane, wife cast their vote in MumbaiRead @ANI Story | https://t.co/MyHmMbTF55#AjinkyaRahane #LokSabhaElections2024 pic.twitter.com/EUkJ5a0ZGR— ANI Digital (@ani_digital) May 20, 2024 దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.Sachin Tendulkar, son Arjun, cast vote in Lok Sabha electionsRead @ANI Story | https://t.co/Lz7fVhAoT0#SachinTendulkar #LokSabhaPolls #cricket #LSPolls #Elections2024 #TeamIndia pic.twitter.com/Vq2cgSgYCE— ANI Digital (@ani_digital) May 20, 2024 ఢిల్లీ:ఐదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 23.66 శాతం ఓటింగ్ నమోదైంది.బీహార్- 21.11%జమ్మూ కశ్మీర్- 21.37%జార్ఖండ్- 26.18%లడఖ్- 27.87%మహారాష్ట్ర- 15.93%ఒడిశా- 21.07%ఉత్తరప్రదేశ్- 27.76%పశ్చిమ బెంగాల్- 32.70%#LokSabhaElections2024 | 23.66% voter turnout recorded till 11 am, in the fifth phase of elections. Bihar 21.11% Jammu & Kashmir 21.37% Jharkhand 26.18% Ladakh 27.87% Maharashtra 15.93% Odisha 21.07% Uttar Pradesh 27.76%West Bengal 32.70% pic.twitter.com/wr9kbCIwYN— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రమహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.థానేలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Maharashtra CM Eknath Shinde casts his vote at a polling booth in Thane. #LokSabhaElections2024 pic.twitter.com/RZvG01iVyY— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర:బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Veteran actor Dharmendra casts his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/FqXmZ5jFPG— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: ఎంపీ హేమా మాలిని, ఆమె కూమార్తె ఇషా డియోల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.#WATCH | Mumbai, Maharashtra: Actress and BJP MP Hema Malini, her daughter and actress Esha Deol show indelible ink marks on their fingers after casting their votes at a polling booth in Mumbai #LokSabhaElections2024 pic.twitter.com/T3I2wmA0H0— ANI (@ANI) May 20, 2024 ఉత్తర ప్రదేశ్:కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరూ కుటుంబసభ్యులతో వచ్చిన ఓటు వేయాలని కోరుతున్నా.#WATCH | Lucknow, Uttar Pradesh: "I appeal to the voters of the country to cast their vote along with their family members...," says Defence Minister and BJP candidate from Lucknow Lok Sabha seat, Rajnath Singh after casting his vote #LokSabhaElections2024 pic.twitter.com/tf5Pz7hjO8— ANI (@ANI) May 20, 2024 ఉత్తర ప్రదేశ్: అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.అమేథీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Amethi Lok Sabha seat, Smriti Irani arrives at a polling station in Amethi to cast her vote for #LokSabhaElections2024Congress has fielded KL Sharma from this seat. pic.twitter.com/yAeOMBZZxP— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Bollywood actor Paresh Rawal shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5FVCXjNMqn— ANI (@ANI) May 20, 2024 ఢిల్లీ: ఐదో విడత పోలింగ్ కొనసాగుతోందిప్రజలు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.ఉదయం 9 గంటల వరకు 49 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్ శాతం 10.28 శాతం బీహార్ - 8.86% జమ్మూ-కాశ్మీర్ - 7.63% జార్ఖండ్ - 11.68% లఢఖ్ - 10.61% మహారాష్ట్ర - 6.33% ఒడిస్సా- 6.87% ఉత్తరప్రదేశ్ - 12.89% పశ్చిమబెంగాల్ - 15.35% #LokSabhaElections2024 | 10.28% voter turnout recorded till 9 am, in the fifth phase of elections.Bihar 8.86% Jammu & Kashmir 7.63%Jharkhand 11.68%Ladakh 10.51%Maharashtra 6.33%Odisha 6.87%West Bengal 15.35% pic.twitter.com/bNP5RqOg7d— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, సాన్య మల్హోత్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Actor Sanya Malhotra shows the indelible ink mark on her finger after casting her vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/ajbM69mtqJ— ANI (@ANI) May 20, 2024మహారాష్ట్ర: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మీడియాలో మాట్లాడారు.ఈ ఎన్నికల నాకు గొప్ప అవకాశం ఇచ్చాయి. ప్రజలను కలిసి.. ఆశీస్సులు తీసుకున్నా.#WATCH | Union Minister and BJP candidate from Mumbai North Lok Sabha seat, Piyush Goyal shows his inked finger after casting his vote at a polling station in Mumbai.#LokSabhaElections2024Congress has fielded Bhushan Patil from the Mumbai North seat. pic.twitter.com/81pfeAEiav— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.భారత్ అభివృద్ధి చెందాలిదానిని దృష్టితో పెట్టుకొని ఓటు వేశానుప్రజలు ఓటు వేయడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు.#WATCH | Actor Akshay Kumar shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.He says, "...I want my India to be developed and strong. I voted keeping that in mind. India should vote for what they deem is right...I think voter… pic.twitter.com/mN9C9dlvRD— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, డైరెక్టర్ జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Maharashtra: Actor Farhan Akhtar and Director Zoya Akhtar show their inked fingers after casting their votes at a polling station in Mumbai.#LokSabhaElections pic.twitter.com/ESpxvZNuGN— ANI (@ANI) May 20, 2024 ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. రికార్డు సంఖ్యలో ఓటు వేయండి: ప్రధాని మోదీప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కు వినియోగించుకోండిఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి"Vote in record numbers": PM Modi appeals voters to cast franchise in festival of democracyRead @ANI Story | https://t.co/CDSpNQxl1l#PMModi #LokSabhaElection2024 pic.twitter.com/pQIC7v0YRP— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్ర: వ్యాపారవేత్త అనిల్ అంబాని ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Industrialist Anil Ambani casts his vote at a polling booth in Mumbai, for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/2CpXIZ6I0l— ANI (@ANI) May 20, 2024ఉత్తర ప్రదేశ్:మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చుంటున్నారు.#WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati shows her inked finger after casting her vote for #LokSabhaElections2024 at a polling station in Lucknow. pic.twitter.com/ZmtmwJg8Yq— ANI (@ANI) May 20, 2024 బిహార్బిహార్లోని ముజఫర్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ఓటు వేయడానికి మహిళలు క్యూలైన్లో నిల్చున్నారు. #WATCH | Bihar: Women queue up in large numbers at a polling booth in Muzaffarpur as they wait for voting to begin. #LokSabhaElections2024 pic.twitter.com/AgOrKHB8FX— ANI (@ANI) May 20, 2024 ఐదో విడత పోలింగ్ ప్రారంభమైందిVoting for the fifth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 49 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 35 Assembly constituencies in Odisha. pic.twitter.com/EZ1yEm7LJG— ANI (@ANI) May 20, 2024 లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్ చేపడుతున్నారు. ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్ సాధించేలా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది. బరిలో కీలక నేతలుకేంద్ర మంత్రులు రాజ్నాథ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్ ముంబై), కౌశల్ కిశోర్(మోహన్లాల్గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేపూర్), శంతను ఠాకూర్ (పశ్చిమబెంగాల్లోని బంగావ్), ఎల్జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ (బిహార్లోని హాజీపూర్), శివసేన శ్రీకాంత్ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్), బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్లోని సరణ్), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్(ముంబై నార్త్ సెంట్రల్)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. ఒడిశాలో ఐదు లోక్సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్ జరగనుంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది.ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనుంది. -
రాహుల్ సభలో తొక్కిసలాట
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పాల్గొన్న ఎన్నికల ప్రచారసభలో అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో సభావేదిక వద్ద తొక్కిస లాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆదివారం ఫూల్పూర్ నియోజకవర్గం పరిధిలోని పడిలా ప్రాంతంలో నిర్వహించిన ప్రచారసభ ఈ ఘటనకు వేదికైంది. ప్రచారసభకు రాహుల్, అఖిలేశ్ వస్తున్నారని తెల్సి ఇరుపార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కిక్కిరిసన జనంతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది.ప్రసంగించేందుకు అఖిలేశ్ సభావేదిక మీదకు రాగానే జనం వేదికపైపు హఠాత్తుగా ముందుకొచ్చారు. బారికేడ్లు, అడ్డుగా ఏర్పాటుచేసిన కర్రలను తొలగించి మరీ దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారి తొ క్కిసలాట జరిగింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. వెనక్కి వెళ్లండి అని వేదికపై నుంచి అగ్రనేతలు హెచ్చరించినా కార్యకర్తలు ఎవ్వరూ వినిపించుకోలేదు. ఓటర్ల శాంతించాలని విన్నవించినా పట్టించుకోలేదు. చాలా మంది రాహుల్, అఖిలేశ్ దాకా వచ్చి వారితో షేక్హ్యాండ్ కోసం స్టేజీ వద్ద ఎగబడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో, భారీగా పోగైన కార్యకర్తలను నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు. దాంతో అక్కడ మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మీ భద్రతకు ముప్పుందని అక్కడి భద్రతా, పోలీసు సిబ్బంది అగ్రనేతలు రాహుల్, అఖిలేశ్లను అప్రమత్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రసంగించాలా వద్దా అని రాహుల్, అఖిలేశ్ కొద్దిసేపు మాట్లాడు కున్నారు. తర్వాత ప్రసంగించకుండానే ఇద్ద రు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభ అర్ధంతరంగా ముగిపోయింది. తర్వాత అక్కడి సమీపంలోని ముంగారీ ర్యాలీలో ప్రసంగించారు. అక్కడ కూడా దాదాపు ఇదే మాదిరిగా కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని ముందుకు రాబోయారు. యూపీలో బీజేపీకి దక్కేది ఒక్కటే సీటు: రాహుల్ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మాత్రమే బీజేపీ గెలుస్తుందని రాహుల్ గాంధీ జోస్యంచెప్పారు. ఆదివారం ఆయన ‘ఇండియా’ అభ్యర్థి ఉజ్వల్ రమణ్ సింగ్ తరఫున రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్తో కలిసి ప్రచారం చేశారు. జపాన్లోని సుందరనగరం క్యోటోలాగా వారణాసిని తీర్చిదిద్దుతానని మోదీ గతంలో ఇచ్చిన హామీని రాహుల్ ఈ ర్యాలీలో ప్రస్తావించారు. ‘‘ ఉత్తరప్రదేశ్లో బీజేపీ క్యోటో సీటును మాత్రమే మోదీ గెలవబోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీటు అదొక్కటే. కోవిడ్కాలంలో బీజేపీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్ని ఇష్టారీతిన మార్చేందుకు తెగబడింది’’ అని అన్నారు. -
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో గెలుస్తుందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి ఉజ్వల్ రామన్కు మద్దతుగా ప్రయాగ్రాజ్లో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నారు. మిగిలిన సీట్లులో తాము విజయం సాధించనున్నట్లు తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, కాంగ్రెస్ దానిని కాపాడేందుకు కృషి చేస్తోందన్నారు.అనంతరం, రైతులకు, నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు కొత్త చట్టాల్ని అమలు చేస్తామని అన్నారు. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. -
Narendra Modi: ప్రతిపక్షాలు గెలిస్తే అయోధ్యపైకి బుల్డోజర్లే
బారాబంకీ/ఫతేపూర్/హమీర్పూర్: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తాయని, బాలరాముడు మళ్లీ టెంట్లోకి వెళ్లాల్సి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బుల్డోజర్లను ఎక్కడికి పంపించాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని ఆ రెండు పారీ్టలకు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో దశ పోలింగ్ జరుగుతున్నకొద్దీ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పేకమేడలా కూలిపోతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము హ్యాట్రిక్ సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో పేదలకు, యువతకు, మహిళలకు, రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ, ఫతేపూర్, హమీర్పూర్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జూన్ 4వ తేదీ ఇక ఎంతోదూరంలో లేదని, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న సంగతి కేవలం మనకే కాదు, మొత్తం ప్రపంచానికి తెలుసని స్పష్టంచేశారు. ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగాల్లోని విశేషాలివీ.. ఎన్నుకోవాల్సిన ఏకైక పార్టీ బీజేపీ ‘‘దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అంకితమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఒకవైపు, దేశంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. మనకు మంచి చేసే ఎంపీలు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి. కేవలం మోదీని దూషిస్తూ ఐదేళ్లు కాలం గడిపే ఎంపీలు మనకు అవసరమా? 100సీసీ ఇంజన్తో 1,000 సీసీ వేగం సాధ్యమా? బలమైన ప్రభుత్వమే అత్యంత వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదు. అలాంటి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. నిజంగా దేశ ప్రగతిని కోరుకుంటే మనం ఎన్నుకోవాల్సిన ఎకైక పార్టీ బీజేపీ. అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ పెద్దలు అనుచితంగా మాట్లాడారు. రామాలయం విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తిరగదోడాలని కాంగ్రెస్ భావిస్తోంది. వారికి సొంత కుటుంబ ప్రయోజనాలు, రాజకీయ అధికారమే ముఖ్యం. కాంగ్రెస్–సమాజ్వాదీ పారీ్టలకు అధికారం అప్పగిస్తే అయోధ్యలో అలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారు. రామ్లల్లా మళ్లీ టెంట్లోకి పంపిస్తారు. ఆ రెండు పారీ్టలకు ఓటు బ్యాంకు కంటే ఏదీ ఎక్కువ కాదు. రిజర్వేషన్లపై ప్రతిపక్ష నేతలు దారుణంగా మాట్లాడుతున్నారు. మొత్తం రిజర్వేషన్లను ముస్లింలకే ఇవ్వాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి(లాలూ ప్రసాద్ యాదవ్) అన్నారు. అంటే దళితులు, గిరిజనులు, ఓబీసీలకు అన్యాయం చేయాలా? వారు ఉన్నత స్థాయికి చేరుకోవద్దా?’’ అని మోదీ ప్రశ్నించారు. -
Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
అజంగఢ్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, ఉత్తరప్రదేశ్తోపాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ చట్టాన్ని మాత్రం మీరు ఎప్పటికీ రద్దు చేయలేరు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి తేలి్చచెప్పారు. గురువారం ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్, జాన్పూర్, బదోహీ, ప్రతాప్గఢ్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. సీఏఏ కింద కాందీశీకులకు భారత పౌరసత్వం కలి్పంచే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, వీరంతా హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులేనని చెప్పారు. మతం ఆధారంగా భారత్ను విడగొట్టడంతో వీరంతా బాధితులుగా మారి మన దేశానికి వచ్చారని, చాలాఏళ్లుగా ఇక్కడే కాందిశీకులుగా బతుకుతున్నారని తెలిపారు. ప్రాణభయంతో వలస వచి్చన బాధితులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. ఈసారి మూడు డోసుల బుజ్జగింపు విధానాలు ‘‘ఉత్తరప్రదేశ్లో గతంలో భయానక పరిస్థితులు ఉండేవి. పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష ప్రసాదించి వదిలేసేవారు. ముష్కరులకు రాజకీయ ముసుగేసి కాపాడుతూ ఉండేవారు. దీనివల్ల ఉగ్రవాదం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. అయినా కొందరు విపక్ష నాయకుల ధోరణిలో మార్పు రావడం లేదు. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం వచి్చన తర్వాత మార్పు మొదలైంది. కాంగ్రెస్, సమాజ్వాదీ అనేవి రెండు పార్టీలు. నిజానికి అవి ఒకే దుకాణం. అక్కడ బుజ్జగింపు రాజకీయాలు, అబద్ధాలు, కుటుంబస్వామ్యం, అవినీతిని అమ్ముతుంటారు. ఈసారి వారు మూడు డోసుల బుజ్జగింపు విధానాలతో ముందుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కాజేసి ఓటు బ్యాంక్కు కట్టబెట్టాలని ప్రయతి్నస్తున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో సగం దోచుకొని ఓటు బ్యాంక్కు అప్పగించాలని కుట్రలు పన్నుతున్నారు. దేశ బడ్జెట్లో ఏకంగా 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత రాహుల్, అఖిలేశ్ విదేశాలకు వెళ్లిపోతారు పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచక, అవినీతి పాలనను ఉత్తరప్రదేశ్లోనూ తీసుకురావాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పారీ్టలు భావిస్తున్నాయి. హిందువులను హత్య చేయడం, దళితులను, ఆదివాసీలను వేధించడం, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడమే తృణమూల్ కాంగ్రెస్ పాలన. అలాంటి పాలన మనకు కావాలా? అనేది ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. జూన్ 4 తర్వాత మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది. ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్లూ పని చేస్తానని గ్యారంటీ ఇస్తున్నా. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ), సమాజ్వాదీ పార్టీ యువరాజు(అఖిలేశ్ యాదవ్) విదేశాలకు వెళ్లిపోతారు. నోట్లో బంగారు చెంచాతో పుట్టిన బడాబాబులు ఈ దేశాన్ని సమర్థంగా నడపలేరు’’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎక్స్–రే యంత్రాలు ‘‘ఈ లోక్సభ ఎన్నికలు మనకొక సువర్ణావకాశం. బలమైన ప్రభుత్వాన్ని నడిపించడంతోపాటు ఇండియా బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పే నాయకుడిని ఎన్నుకోవాలి. అందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలి. ప్రజలు వేసే ఓటు బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు నేరుగా నరేంద్ర మోదీ ఖాతాలోకి చేరుతుంది. ఇండియా కూటమి నాయకులు అధికారంలోకి వస్తే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఇందుకోసం రాజ్యాంగాన్ని సైతం మార్చేస్తామంటున్నారు. నేను బతికి ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగనివ్వను. ఎక్స్–రే యంత్రాలతో ప్రజల ఆస్తులను సర్వే చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. అందుకే మనమంతా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ అజెండాను నేను బయటపెట్టా. దాంతో కాంగ్రెస్ ఎక్స్–రే యంత్రాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయి’’. -
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సెగ్మెంట్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్ను తిరస్కరణకు గురైంది. దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.ఇక.. రాజస్థాన్లోని హనుమాన్గర్హ్ జిల్లాలోని మనక్తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
నామినేషన్కు ముందు వారణాసిలో పీఎం మోదీ ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)
-
Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎంలకు ఆహా్వనాలు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ముఖ్యమంత్రుల్లో యోగి (ఉత్తరప్రదేశ్), నితీశ్ కుమార్ (బిహార్), పుష్కర్ ధామి (ఉత్తరాఖండ్), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్గఢ్ ), ఏక్నాథ్ షిండే (మహారాష్ట్ర), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), నయాబ్ సైనీ (హరియాణా), ప్రమోద్ సావంత్ (గోవా), ప్రేమ్ సింగ్ తమంగ్ (సిక్కిం), మాణిక్ సాహా (త్రిపుర) ఉన్నారు. ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. -
చిడతలు వాయిస్తూ బీజేపీ ఎమ్మెల్యే సందడి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో లోక్సభ నాలుగో దశ పోలింగ్ సందడిగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్కు చేరుకోవడం ప్రారంభించారు. ఈ దశలో యూపీలోని 13 స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు.కాన్పూర్లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైతాని సందడి చేశారు. చిడతలు, తాళాలు, డోలు వాయిస్తూ ఊరేగింపుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటర్లందరూ ఉత్సాహంగా బయటకు వచ్చి ఓటేసేలా చైతన్యపరచడానికి ఇలా చేసినట్లు ఆయన వివరించారు. -
ఉత్తరప్రదేశ్లో పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు!
ఉత్తరప్రదేశ్లో లోక్సభ నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సీతాపూర్లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్కు చేరుకోవడం ప్రారంభించారు. నగరంలోని మెథడిస్ట్ చర్చి స్కూల్లో జిల్లా యంత్రాంగం గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. బహ్రైచ్ లోక్సభ స్థానంలో మొత్తం 880 పోలింగ్ కేంద్రాలు, 1885 బూత్లను ఏర్పాటు చేశారు. నాలుగో దశ లోక్సభ ఎన్నికల్లో షాజహాన్పూర్, ఖేరీ, ధౌరహర లోక్సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ మూడు స్థానాల్లో మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీనితో పాటు దాద్రాల్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా ఓటింగ్ మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికలో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్కు ముందు అన్ని బూత్లలో మాక్పోల్ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ ప్రారంభమైంది.యూపీలోని 13 స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎయిర్ అంబులెన్స్, హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంచామని సీఈవో రిన్వా తెలిపారు. ఈ హెలికాప్టర్ లొకేషన్ కాన్పూర్లో, ఎయిర్ అంబులెన్స్ లొకేషన్ లక్నోలో ఉంటుందన్నారు. -
‘వరుణ్ విషయంలో బీజేపీని సవాల్ చేయలేను’
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. 400 స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో వేగం పెంచింది. ఇక.. ఈసారి కొంతమంది సిట్టింగ్లకు బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. అందులో ప్రముఖంగా వరుణ్గాంధీకి ఫిలిభీత్ స్థానంలో బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవటంపై చర్చ జరిగింది. అయితే తాజాగా శనివారం వరణ్ గాంధీకి టికెట్ కేటాయించకపోవటంపై ఆయన తల్లి మేనకా గాంధీ స్పందించారు. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘వరుణ్ గాంధీ విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తాను సవాల్ చేయలేను. నేను పార్టీకి నిర్ణయానికి గౌరవిస్తాను. అలాగే వరుణ్ గాంధీపై నాకు అపారమైన నమ్మకం, విశ్వాస ఉంది. నా కుమారుడు వరుణ్ గాంధీ చాలా సమర్థవంతుడు, తన స్థాయికి తగినట్లు కృషి చేస్తాడు. కొంతమంది ఎంపీ కావాలనుకుంటారు. కానీ, కొంతమంది ఎంపీ పదవికి ఎంపిక కాకుండానే ప్రజల కోసం రాజకీయనాయకులు అవుతారు. జీవితం మన కోసం ఏం నిక్షిప్తం చేసి ఉందో తెలియదు’’ అని మేనకా గాంధీ అన్నారు. ఇక.. మేనకా గాంధీ ఉత్తర ప్రదేశ్లోని సుల్తాన్పూర్ పార్లమెంట్ నుంచి బరిలో ఉన్నారు. ప్రజలకు సేవ చేయటం కోసం మరోసారి బీజేపీ టికెట్ కేటాయించటంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఎన్ని ఓట్లను సాధిస్తార్న ప్రశ్నకు స్పందిస్తూ.. వీలైనన్ని ఎక్కువ ఓట్లు సంపాదించటం కోసం ప్రతిరోజూ ప్రయత్నం చేస్తూ ఉంటానని తెలిపారు.వరుణ్ గాంధీ రెండుసార్లు ఫిలిభీత్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. బీజేపీ, ప్రభుత్వ విధానాలకు వరుణ్ గాంధీ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ ఫిలిభీత్ టికెట్ నిరారించినట్లు ప్రచారం జరిగింది. -
దారుణం : తల్లిపై కాల్పులు, భార్యా పిల్లల హత్య, ఆపై ఆత్మహత్య
ప్రపంచవ్యాప్తంగా మదర్స్ వేడుకలకు సిద్ధమవుతుండగా ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. మత్తుమందులు, మద్యానికి అలవాటు పడిన వ్యక్తి మొత్తం కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం లక్నోకు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్లోని రాంపూర్ మధురలోని పల్హాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అనురాగ్ సింగ్ (45) మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. మానసికంగా వికలాంగుడిగా మారిపోయాడు. దీంతో అతగాడిని డీ-అడిక్షన్ సెంటర్కి పంపాలని కుటుంబం భావించింది. కానీ విషయంలో సభ్యులతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే మరోసారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్మాదిలా మారి పోయాడు. తొలుత 65 ఏళ్ల తల్లి సావిత్రిని కాల్చి చంపాడు, తరువాత భార్య ప్రియాంక (40)ని సుత్తితో కొట్టి హత్య చేశాడు. అంతటితో ఆగలేదు ముగ్గురు పిల్లలను (కుమార్తె అశ్విని (12), చిన్న కుమార్తె అశ్విని (10)లను హత్య చేశాడు.ఆ తర్వాత అనురాగ్ తనను తాను కాల్చుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడని సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారుఈ వార్త దావానలంలా వ్యాపించడంతో సంఘటనా స్థలం వద్ద జనం పెద్ద ఎత్తున గుమి గూడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షించారు. -
హోటల్ గదిలో భార్య.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
లక్నో: భార్య పరాయి వ్యక్తులతో గడుపుతుండగా.. భర్త రెడ్హ్యండెడ్గా పట్టుకున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త.. ఆమెను ఫాలో అవ్వగా.. గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని కాస్గంజ్ వెలుగుచూసింది. కాగా భార్యభర్తలిద్దరూా వైద్యులు కావడం గమనార్హం.మహిళ పట్టుబడటంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది భౌతిక ఘర్షణకు దారి తీసింది. దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైద్య దంపతుల మద్య గతకొంతకాలంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఇద్దరు ఏడాదిగా వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో భార్య కదలికలపై అనుమానం పెంచుకున్న భర్త... ఆమెను అనుసరించాడు. గురవారం ఆమె హోటల్ గదిలో ఉన్న సమాచారంతో తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త హోటల్ గదిలోకి చొరబడ్డాడు. ఇద్దరు వ్యక్తులతో భార్య ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పట్టకున్నాడు. దీంతో పట్టుబడిన భార్య, వ్యక్తులపై భర్త, బంధువులు తీవ్రంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళతోపాటు ఘజియాబాద్, బులంద్షహర్కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతోపాటు భార్య, ఇద్దరు వ్యక్తులపై భర్త ఫిర్యాదు చేశాడు. మహిళ మాత్రం ఇప్పటి వరకు తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. -
Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
కనౌజ్/కాన్పూర్: విపక్షాల ‘ఇండియా’ కూటమి తుపాను ఉత్తరప్రదేశ్లోకి దూసుకొస్తోందని ఈ ధాటికి మరోసారి మోదీ ప్రధాని కాలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యూపీలో 80 స్థానాలకుగాను కనీసం 50 చోట్ల మా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని కనౌజ్, కాన్పూర్లలో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘‘ దేశ ప్రధానిగా మోదీ మరోసారి పగ్గాలు చేపట్టలేరని లిఖితపూర్వక గ్యారెంటీగా భావించండి. ఇక అంతా అయిపోయింది. బీజేపీ ఓటమి ఖాయం. అందుకు అనుగుణంగానే విపక్షాల కూటమి చాన్నాళ్ల క్రితమే ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించింది. విద్వేష బజార్లలో ప్రేమ దుకాణాలను తెరిచాం. భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర చేశాం. దేశవ్యాప్తంగా విపక్షాల సమావేశాలు నిర్వహించాం’’ అని అన్నారు. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్న మోదీ ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ‘‘ ఓటర్లు పదేళ్ల నుంచి చూస్తున్నారు. ఒక్కసారైనా మోదీ అదానీ, అంబానీల పేరెత్తలేదు. కానీ ఇప్పుడు ఓటమి సుడిగుండం నుంచి కాపాడతారేమోనని వాళ్ల పేర్లు తొలిసారిగా ప్రస్తావిస్తున్నారు. ఓడిపోతున్నాను.. కాపాడండి అదానీ, అంబానీజీ అంటూ మోదీ ప్రాథేయపడుతున్నారు’’ అని రాహుల్ వెటకారంగా మాట్లాడారు. మోదీకి టెంపో బాగా తెలుసు టెంపోల నిండా అదానీ, అంబానీల నుంచి నగదు మూటలు వచ్చినందుకేæ కాంగ్రెస్ నోరుమూసుకుందని మోదీ అనడంపై రాహుల్.. ‘‘ అంటే మోదీకి తరచూ అదానీ డబ్బులను టెంపోలో పంపిస్తారన్నమాట. ఏ రకం టెంపోలో డబ్బులు పంపిస్తారో ఆయనకు బాగా తెలుసు. టెంపోల గురించి మోదీకి బాగా అవగాహన ఉన్నట్లుంది’’ అని అన్నారు. -
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ అభ్యర్థిని స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి సవాల్ విసిరారు. ఏ ఛానెల్ అయినా, హోస్ట్ ఎవరైనా, టైం, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్లో మాట్లాడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్మృతి ఇరాని ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ చేశారు.‘‘నేను ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నా. ఛానెల్, యాంకర్, ప్రదేశం, టైం విషయం ఏదైనా డిబేట్ చేయడానికి బీజేపీ సిద్ధం. ఒకవైపు.. సోదరుడు, సోదరీ. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారు. మా పార్టీ నుంచి అయితే సుధాంశు త్రివేది చాలు. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారు’’అని స్మృతి ఇరానీ బుధవారం అమేథీలో సవాల్ చేశారు.దేశంలోని ముఖ్యమన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఇరానీ పైవిధంగా ఛాలెంజ్ విసిరారు. 2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 55 వేల మేజార్టీతో ఓడించారు. మరోసారి బీజేపీ స్మృతి ఇరానీకి అమేథీ టికెట్ కేటాయించింది. ఇప్పటికే స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరిగి ప్రచాం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్కు కంచుకోట స్థానమైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ సింగ్ను బరిలోకి దిపింది. ఇక.. అమేథీ, రాయ్ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
లక్నో: తన మేల్లుడైన ఆకాశ్ ఆనంద్ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తొలగించారు. ఈ తొలగింపుపై తాజాగా గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆకాష్ ఆనంద్ స్పందించారు. ‘బీఎస్పీ చీఫ్ మాయావతి.. బహుజన సమాజానికి రోల్ మోడల్. బహుజనలు అంటే.. దళితులు, ఎస్టీలు, ఓబీసీలు. మీ పోటం వల్లనే నేడు బహుజన సమాజానికి ఇంత రాజకీయం బలం చేకూరింది. బహుజన సమాజం గౌరవంగా బ్రతకటం నేర్చుకుంది. మీరే మా అధినేత్రి. నా కడ శ్వాస వరకు భీమ్ మిషన్, బహుజన సమాజం కోసం పోరాడతాను’’ అని ఆకాష్ ఆనంద్ ‘ఎక్స్’లో తెలిపారు.ఇక.. ఇటీవల ఆకాశ్ ఆనంద్ బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకాశ్ రాజకీయంగా పరిణతి సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్ మాట్లాడుతూ యూపీలోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్గా అభివర్ణించారు.आदरणीय बहन @mayawati जी, आप पूरे बहुजन समाज के लिए एक आदर्श हैं, करोड़ों देशवासी आपको पूजते हैं। आपके संघर्षों की वजह से ही आज हमारे समाज को एक ऐसी राजनैतिक ताक़त मिली है जिसके बूते बहुजन समाज आज सम्मान से जीना सीख पाया है। आप हमारी सर्वमान्य नेता हैं। आपका आदेश सिर माथे पे।…— Akash Anand (@AnandAkash_BSP) May 9, 2024 రాష్ట్రంలోని యువతను ఆకలితో ఉంచుతూ, పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ అధికారులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. ఆకాశ్తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆకాశ్కు సంబంధించిన అన్ని ర్యాలీలను బీఎస్పీ రద్దు చేసింది.2023 డిసెంబరులో మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్ లండన్లో ఎంబీఏ చదివారు. ఇక.. 2017లో బీఎస్పీలో చేరారు. అనంతరం 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
బీజేపీ ‘ప్యూన్’ వ్యాఖ్యలు.. స్పందించిన అమేథీ అభ్యర్థి
లక్నో: కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార స్పీడ్ను పెంచింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట స్థానమైన అమేథీ స్థానంలో పోటీ చేస్తున్న కిషోరి లాల్ శర్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ గెలవాలనుకుంటే? కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి చెందిన ‘ప్యూన్’ను బరిలోకి దించిందని కిషోరి లాల్ను ఉద్దేశించి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మరోసారి కిశోరి లాల్ శర్మ స్పందించారు.‘ఇటువంటి వ్యాఖ్యలు వారి నీచమైన విలువకు నిదర్శనం, నా తండ్రి నిరక్షరాస్యుడు. అయినా నా తండ్రి ఎన్నో విలువు నేర్పుతూ పెంచారు. వారి మాటలను నేను ఎక్కువగా స్పందించలేను. ఆ వాఖ్యలను వారికే వదిలేస్తున్నా’అని కిషోరి లాల్ అన్నారు.‘ఈసారి కాంగ్రెస్ నాయకత్వం నాకు ఇచ్చిన బాధత్య చాలా భిన్నమైంది. నేను గతంలో లాగానే ఉన్నా. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకు పనిచేస్తా. అమేథీ సెగ్మెంట్ గాంధీ కుటుంబానికి కంచుకోట స్థానం. ఇప్పటీకి ఏదైనా అవకాశం ఉంటే.. ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేయాలి కోరుకుంటా’అని కిషోరి లాల్ తెలిపారు.కాంగ్రెస్కు కంచుకోట స్థానాలైన అమేథీ, రాయ్బరేలీ స్థానాల్లో గెలుపు కోసం ప్రియాంకా గాంధీ అన్నీ ప్రచారం చేస్తోంది. మారథాన్ సమావేశాలు నిర్వహించి.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకువస్తోంది. పోలింగ్ సమయం వరకు ఈ రెండు స్థానాల్లో ప్రచారాన్ని ఉధృతం చేయాలని ప్రియాంకా గాంధీ సోమవారం నుంచి కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు.అమేథి స్థానంలో 3 సార్లు గెలిచిన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. మరోస్థానం కేరళలోని వాయ్నాడ్లో గెలుపొందారు. ఈసారి వాయ్నాడ్తో పాటు బార్బరేలీ స్థానంలో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. వాయ్నాడ్ పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. -
బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
బాకీ తీర్చని ఓ టీనేజర్పై సీనియర్లు దాష్టికానికి దిగారు. తీర్చాల్సిన బాకీ కంటే ఎన్నో రెట్ల డబ్బులివ్వాలంటూ బెదిరించారు. ఇవ్వలేనని చెప్పడంతో వేధింపులకు దిగారు. ఆ వేధించడం మరీ హింసాత్మకంగా ఉండడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఉత్తరప్రదేశ్ ఎటావాకు చెందిన టీనేజర్.. నీట్ కోచింగ్ కోసం కాన్పూర్ వచ్చాడు. కోచింగ్ సెంటర్లో సీనియర్లతో స్నేహం కుదిరి..వాళ్లు ఉంటున్న ప్లాట్కి మకాం మార్చాడు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ కోసం వాళ్ల దగ్గరి నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. అయితే గేమ్లో ఆ డబ్బంతా పొగొట్టుకున్నాడు.దీంతో.. ఆ సీనియర్లు 20 వేలకు బదులు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. సదరు విద్యార్థి చెల్లించకలేకపోయేసరికి.. అతన్ని చిత్రహింసలు పెడుతూ ఆ తతంగం అంతా వీడియో తీశారు. ఆ విద్యార్థినిని కింద పడేసి చితకబాదారు. కాళ్లు మొక్కుతున్నా విడిచిపెట్టకుండా.. బలవంతంగా అతని దుస్తులు విప్పించారు. మర్మాంగానికి ఇటుకను కట్టి వేలాడదీస్తూ వేధించారు. ఈ దాష్టీకం ఇంతటితోనే ఆగలేదు. అతని వెంట్రుకల్ని తగలబెట్టే ప్రయత్నమూ చేశారు.#UttarPradesh: Students preparing for #NEET in #Kanpur brutally beat up their classmate. He was hung by tying a rope around his private part. They tried to burn his hair with fire spray.Actually, the victim student lost 20K in an online game. pic.twitter.com/TO1MhtAt0y— Siraj Noorani (@sirajnoorani) May 7, 2024చివరకు బాధితుడు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎటావా పోలీసులు నిందితులను పిలిపించి.. కేవలం మందలించి వదిలేశారు. ఈలోపు టీనేజర్ను వేధించిన వీడియోలు వాట్సాప్ ద్వారా బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వీడియోలో ఉన్న ఆరుగురు నిందితులను గుర్తించి.. అరెస్ట్ చేశారు. ఒక ముఠాగా మారి కోచింగ్సెంటర్కు వచ్చే విద్యార్థులను వీళ్లు టార్గెట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. -
పాక్తో రాహుల్కు సంబంధం ఏంటి: స్మృతి ఇరానీ
లక్నో: పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ప్రశంసల అంశంపై స్పందిసస్తూ.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఓ ర్యాలీలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. అమెథీలో ప్రస్తుతం ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఉందని అన్నారు. వాటిని ఉపయోంగించి దేశ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదలను అంతం చేస్తామని తెలిపారు.‘‘పాక్ మాజీ మంత్రి ఆయన దేశం గురించి ఆందోళన పడాలి కానీ, అమేథీ కోసం కాదు. లోక్సభ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ నేతతో పోటీ పడుతుంటే.. పాకిస్తాన్ నేత మాత్రం నన్ను ఓడించాలంటున్నారు. పాకిస్తాన్ను పాలించటం చేతకాని వాళ్లు.. అమేథీ గురించి ఆందోళన పడుతున్నారు.నా మాటలు పాక్ మంత్రికి చేరితే.. నేను ఒక్కటి చెప్పదల్చుకున్నా. అమేథీలో ప్రధాని మోదీ ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. వాటితో హరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులను అంతం చేస్తాం’’ అని స్మృతి ఇరానీ అన్నారు. పాకిస్తాన్ మాజీ మంత్రి వ్యాఖ్యల రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్తో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటని నిలిదీశారు. భారత్లో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు పొరుగు దేశాల మద్దతు కోరుతున్నారని విమర్శించారు. అమేథీలో స్మృతి ఇరానీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ కిషోరి లాల్ సింగ్ను బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
చార్ధామ్ వెళ్లాలనుకుంటున్నవారికి శుభవార్త. 2025 నుండి చార్ధామ్ యాత్రకు రైలులో వెళ్లే అవకాశం కలగబోతోంది. ఈ రూట్లోని 327 కిలోమీటర్ల రైలు మార్గాన్ని రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రిషికేష్-కర్ణప్రయాగ్ మధ్య 125 కి.మీ. రైల్వే లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.రైల్వేశాఖ చేపట్టిన చార్ధామ్ ప్రాజెక్టు కింద గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను రైల్వేలతో అనుసంధానం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు సీఈవో జయ వర్మ సిన్హా ఇటీవల ఈ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో ఇంకా 327 కి.మీ రైల్వే ట్రాక్ను సిద్ధం చేయాల్సి ఉంది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని రైల్వే పేర్కొంది.ఈ ప్రాజెక్టులో 153 కి.మీ. రైలు మార్గం మొరాదాబాద్ డివిజన్లో ఉంది. దీనిలో 105 కి.మీ. రైల్వే లైన్ సొరంగం గుండా వెళుతుంది. ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. రూ.16 వేల 216 కోట్లతో 125 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.హిమాలయాల్లోని చార్ధామ్ దేవాలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు రైలు కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సొరంగాల్లో రైల్వే లైన్లు వేయడం, ఇతర పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2025 నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం
లక్నో: లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లోని కీలకమైన అమేథీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. పార్టీ కార్యాయంలో బయట పార్కింగ్ చేసిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటన సమాచారం అందుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.यूपी के अमेठी में स्मृति ईरानी और BJP के कार्यकर्ता बुरी तरह डरे हुए हैं।सामने दिख रही हार से बौखलाए BJP के गुंडे लाठी-डंडों से लैस होकर अमेठी में कांग्रेस कार्यालय के बाहर पहुंचे और वहां खड़ी गाड़ियों में तोड़फोड़ की। कांग्रेस के कार्यकर्ताओं और अमेठी के लोगों पर भी जानलेवा… pic.twitter.com/Knv7BBN8bk— Congress (@INCIndia) May 5, 2024పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని దాడికి వ్యతిరేకంగా నిసన తలిపారు. దీంతో కార్యకర్తలను నిరసనను పోలీసులు శాంతింపచేశారు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తామని, ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలపారు.మరోవైపు.. ఈ దాడిని బీజేపీ చేయించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ‘‘స్మృతి ఇరానీ, బీజేపీ కార్యకర్తలు భయపడుతున్నారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ కార్యకర్తలు గూండాల్లా కాంగ్రెస్ పార్టీపై దాడి చేశారు. కార్లను ధ్వసం చేశారు. అక్కడితో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులపై కూడా బీజేపీ రౌడీలు దాడి చేశారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో బీజేపీ అమేథీలో దారుణంగా ఓడిపోతుందని అర్థమవుతోంది’’అని కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ వేదికగా బీజేపీపై మండిపడింది. బీజేపీ కార్యకర్తల దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనతే మండిపడ్డారు. -
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
ఎటావా/సీతాపూర్: కాంగ్రెస్, సమాజ్వాదీ పారీ్టలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలను పక్కనపెట్టి, కేవలం సొంత కుటుంబాల బాగు కోసమే ఆరాటపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రాబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి తాను శ్రమిస్తున్నానని చెప్పారు. తనకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బిడ్డలు లేరని, ప్రజల బిడ్డల శ్రేయస్సు కోసం తాము తపన పడుతున్నామని వివరించారు.ఆదివారం ఉత్తరప్రదేశ్లోని ఎటావా, దౌరాహ్రాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే 1,000 సంవత్సరాల పాటు భారత్ శక్తివంతమైన దేశంగా కొనసాగడానికి పునాది రాయి వేస్తున్నానని ప్రకటించారు. తాను ఉన్నా, లేకున్నా భారతదేశం ఉంటుందని, అందుకే దేశాన్ని శక్తివంతంగా మార్చాలని సంకలి్పంచానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పారీ్టల నాయకులు కేవలం సొంత భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కోసమే ఎన్నికల్లో నెగ్గాలనుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నేతలు వారి కుటుంబాలకు, ఓటు బ్యాంక్కు మాత్రమే లబ్ధి చేకూర్చాలని తహతహలాడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... మోదీ వారసత్వం అంటే ఇదే.. ‘‘వారసత్వ పార్టీల నేతలు సాధించేదేమిటి? కార్లు, బంగళాలు, రాజకీయ పలుకుబడి సంపాదించుకోవడం తప్ప వారికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఏం తెలుసు? ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి, కన్నౌజ్, ఎటావా లోక్సభ స్థానాలను కొందరు వారి సొంత సామ్రాజ్యాలు అనుకుంటున్నారు. మరికొందరు ఆమేథీ, రాయ్బరేలీని వారి సొంత జాగీర్లుగా భావిస్తున్నారు. నా వారసత్వం ప్రజలందరికీ చెందుతుంది. 2047లో పేద ప్రజల కుమారులు, కుమార్తెలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కావాలన్నదే నా కోరిక. రాజకుటుంబాల వారసులు మాత్రమే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యే దుష్ట సంప్రదాయాన్ని ఈ చాయ్వాలా బద్ధలు కొట్టాడు. సమాజంలో దురాచారాలపై నిషేధం కోసం పోరాడిన రాజారామ్ మోహన్ రాయ్ను ఇప్పటికీ స్మరించుకుంటున్నాం. పాత సంప్రదాయానికి చరమగీతం పాడేసి, పేదల బిడ్డలు సైతం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేసిన ప్రధానమంత్రి ఉండేవాడు, ఆయన ఒక చాయ్వాలా అని భవిష్యత్తు తరాలు చెప్పుకొనే రోజు వస్తుంది. మోదీ వారసత్వం అంటే పేదలకు పక్కా ఇళ్లు, కోట్లాది మంది మహిళలకు మరుగుదొడ్లు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు విద్యుత్, గ్యాస్ కనెక్షన్, కుళాయి నీళ్లు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మట్లేదు కాంగ్రెస్తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి తమను పావులుగా వాడుకుంటున్నాయని ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వారు విపక్షాలకు దూరంగా ఉంటున్నారు. ఓటు బ్యాంక్ కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మడం లేదు. ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రభుత్వ పథకాలతో మైనార్టీలూ లబ్ధి పొందుతున్నారు. దూరమవుతున్న ముస్లిం ఓటు బ్యాంక్ను కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు కొత్త ఆట మొదలుపెట్టాయి. బుజ్జగింపు వ్యవహారాలకు దిగుతున్నాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని బాబా సాహెబ్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ స్పష్టం చెప్పారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మొండిగా వాదిస్తున్నాయి. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా? కాంగ్రెస్ రాజకుమారుడు ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో ఆలయాల చుట్టూ తిరిగాడు. కోటుపై జంధ్యం కూడా ధరించాడు. ఈసారి మాత్రం ఆయన ఆలయాలకు వెళ్లడం మానేశారు. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత ఆలయం నిర్మించుకున్నాం. దేశ ప్రజలంతా సంతోíÙంచారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహ్వానం పంపిస్తే కాంగ్రెస్ నాయకులు తిరస్కరించారు. నేను ద్వారకలో సముద్రగర్భంలో కృష్ణుడికి పూజలు చేయడాన్ని కాంగ్రెస్ రాజకుమారుడు విమర్శించాడు. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా?’’ అని ప్రధాని మోదీ ఆక్షేపించారు. అయోధ్య బాలరాముడి సేవలో మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఆలయ ప్రాణప్రతిష్ట తర్వాత బాలరాముడిని మోదీ దర్శించుకోవడం ఇదే మొదటిసారి. అనంతరం అయోధ్యలో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. -
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్మిస్ట్రెస్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ గొడవకు దిగింది. అంతేగాక టీచర్పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్గా మారింది.A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
Pune Porsche Crash: మైనర్ తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
దేశంలో నంబర్వన్ ఐఎస్బీ
మొగదారమ్మ ఉత్సవాలు ప్రారంభం
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి
శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం
ఇసుక అక్రమ తవ్వకాలపై కొరడా
బాలికల ఆశ్రమ పాఠశాలలో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం
కౌన్సిలర్ ద్విచక్రవాహనం దహనం చేసిన దుండగులు
మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్
పోలీసు అధికారుల నియామకం
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement