National Investigating Agency
-
NIA విచారణ, జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు
చండీఘడ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిప్టెడ్ డివైజ్లు వినియోగించినట్లు తేలింది. ఎన్ఐఏ విచారణలో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్రపంచానికి తాను వ్లాగర్గా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే? ఎన్క్రిప్టెడ్ డివైజ్లను ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్లో ఉండేదని హర్యానా పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం హిస్సార్కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్కు 3.77 లక్షల మంది సబ్స్కైబర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్విత్జో1 ఇన్స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల్లో భారతీయులకు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్రయత్నం చేయడం,ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటన, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఇషాన్ దార్తో సన్నిహితంగా ఉండడంతో మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్స్టేషన్లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.గూఢచర్యం కేసులో ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్లో పర్యటన, ఐఎస్ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కశ్మీర్ సందర్శన, కశ్మీర్ పర్యటనకు ముందు పాకిస్తాన్కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది. -
పహల్గాం ఉగ్రదాడిపై విస్తుపోయే వాస్తవాలు.. NIA చేతికి చిక్కిన కీలక ఆధారాలు
ఢిల్లీ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఆర్మీ, లష్కరే తోయిబా కన్నుసన్నల్లో జరిగినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నిర్ధారించింది. పహల్గాం ఉగ్రదాడిలో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఐఎస్ఐ,ఉగ్రసంస్థ లష్కరే తోయిబాలు కలిసి ఈ కిరాతక దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ తేల్చింది. పాకిస్తాన్లోని లష్కరే తోయిబా ఆఫీస్లో పహల్గాం ఉగ్రదాడికి కుట్ర జరిగినట్లు ప్రాథమిక నివేదికల్లో పేర్కొంది.ఇక పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. షమీమ్ మూసా అలియాస్ అస్మీన్ మూసా,అలీబాయ్ అలియాస్ తల్హా నేరుగా ఉగ్రదాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఎన్ఐఏ దర్యాప్తు.. శాటిలైట్ ఫోన్ల వినియోగంపాకిస్తాన్ పౌరులైన ఆ ఇద్దరు ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు భారత్ భూభాగంలోకి ప్రవేశించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. వారికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWs) సహాయం చేసినట్లు నిర్ధారించింది. అదే సమయంలో పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎన్ఐఏ ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటా సేకరించింది. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న 40కి పైగా తుపాకుల బాలిస్టిక్, కెమికల్ టెస్టులు జరిపేందుకు ల్యాబ్కు పంపింది. 3డీ మ్యాపింగ్ సాయంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ తీరును గుర్తించేందుకు లేజర్ స్కానర్ల సాయంతో త్రీడీ మ్యాపింగ్ చేసింది. ఈ 3డీ మ్యాపింగ్ సాయంతో కాల్పుల జరిగే సమయంలో ఉగ్రవాదులు పొజీషన్తో పాటు టూరిస్టులు ఎలా కుప్పకూలారు. బ్లడ్ శాంపిల్స్, కాల్పులు జరిగినప్పుడు బుల్లెట్ల నుంచి వెలువడ్డ రసాయనాలు వంటి వాటిని సేకరించారు. లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్ల నుండి డంప్ డేటాను కలెక్ట్ చేశారు. ఈ డేటా ఆధారంగా ఉగ్రదాడి ముందు రోజుల్లో కాల్పులకు తెగ బడ్డ ప్రదేశం నుంచి శాటిలైట్ ఫోన్లను వినియోగించారని, ముఖ్యంగా బైసరీన్, దాని చుట్టు పక్కల ప్రదేశాల్లో కనీసం మూడు శాటిలైట్ ఫోన్లను నిందితులు వినియోగించగా.. రెండు శాటిలైట్ ఫోన్ల సిగ్నల్స్ను గుర్తించారు. 2,800 మందిని విచారించి ఉగ్రదాడిపై మొత్తం 2,800 మందికి పైగా ఎన్ఐఏ, భద్రతా సంస్థలు ప్రశ్నించాయి. మే2 నాటికి మరో 150 మందిని విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్నాయి. వీరిలో అనుమానిత ఓజీడబ్ల్యూ, జమాత్-ఇ-ఇస్లామి వంటి నిషేధిత గ్రూపులు, హురియత్ కాన్ఫరెన్స్లోని వివిధ వర్గాలతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు.ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఉగ్రవాద సంస్థలు, తిరుగుబాటు గ్రూపులకు సాయుధ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా లాజిస్టికల్, ఆర్థిక సమాచార సహాయాన్ని అందించే వ్యక్తులను ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు) అంటారు.కార్ట్రిడ్జ్ అంటేకాల్పులు జరిపిన తరువాత మిగిలి ఉన్న మందుగుండు సామాగ్రి భాగాన్ని కార్ట్రిడ్జ్ అంటారు. వాటిల్లో బుల్లెట్లు,మందుగుండు సామగ్రిలో చేర్చే షెల్, గన్ పౌడర్, గన్లో ఉండే బులెట్లను మండించే ప్రైమర్ల అనే భాగాలున్నాయి. -
ఎన్ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు
న్యూఢిల్లీ: మహానగరం ముంబై 26/11 దాడులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency)(ఎన్ఐఏ) ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న కెనడా-పాకిస్తానీ పౌరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణాను విచారిస్తోంది. ఈ నేపధ్యంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతలో తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎన్ఐఏ ముందు కొన్ని డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తోంది. ఇది అతని మానసిక స్థితిని తెలియజేసేదిగా ఉందని ఎన్ఐఏ పేర్కొంది.వివరాల్లోకి వెళితే ఎన్ఐఏ విచారణలో ఉన్న తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎన్ఐఏ ముందు ఉంచిన డిమాండ్ పలు చర్చలకు దారితీస్తున్నాయి. కస్టడీలో ఉన్న రాణా తనకు ఖురాన్ (ఇస్లామిక్ పవిత్ర గ్రంథం), ఒక పెన్ను, 26/11 దాడుల గురించి అధికారికంగా ప్రశ్నించే అవకాశాన్ని కోరాడు. ఇవి అతని మానసిక స్థితిని, మతపరమైన నమ్మకాన్ని, ఈ కేసులో అతని పాత్ర గురించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాణా ఖురాన్ను అడగడం అతని మతపరమైన అభిరుచులను సూచిస్తుండగా, పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన రాతపూర్వక ప్రకటన లేదా నోట్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక ముడవది.. అతి ముఖ్యమైనది 26/11 దాడుల(26/11 attacks) గురించి ప్రశ్నించే అవకాశం కోరడం.. దీనిని చూస్తుంటే రాణా ఈ ఘటనలో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడో లేక మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాణా పాకిస్తాన్ ఆధారిత టెరరిస్ట్ సంస్థ లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2008లో 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న 26/11 ముంబై దాడులలో అతని పాత్రను తెలుసుకునేందుకు ఎన్ఐఏ కఠినమైన విచారణ కొనసాగిస్తున్నది. ఇది భారత్-పాకిస్తాన్ టెరరిజం, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్టమైన కేసుగా మారింది. అలాగే ఈ కేసు భారత్.. ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. ఎన్ఐఏ విచారణలో తహవ్వూర్ రాణా 26/11 ముంబై దాడులకు సంబంధించి ఏఏ విషయాలు వెల్లడించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: ఈ ఇద్దరు అధికారులే.. తహవ్వూర్ రాణా విచారణ సారధులు -
ఎన్ఐఏ అదుపులో రాణా
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. అతడిని ఎప్పుడు తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు? అన్నదానిపై ఉత్కంఠకు తెరపడింది. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఎదుట హాజరుపర్చారు. ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వొకేట్ పీయూష్ సచ్దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్ కృష్ణన్ కోరగా, న్యాయమూర్తి తన ఉత్తర్వును రిజర్వ్ చేశారు. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. అతిపెద్ద దౌత్య విజయం భారత్కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది. 2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది. ముంబైలో ఆ రోజు ఏం జరిగింది? 2008 నవంబర్ 26న పాకిస్తాన్కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్ ట్రిడెంట్ హోటల్, తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించింది. ఎవరీ రాణా? పాకిస్తాన్లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్లో పెరిగిన రాణా హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్ కోలోమన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు. అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు. రాణాను బహిరంగంగాఉరి తీయాలి: ఏక్నాథ్ ఓంబలే ఉగ్రవాది తహవ్వుర్ రాణాను బహిరంగంగా ఉరి తీయాలని ఏక్నాథ్ ఓంబలే డిమాండ్ చేశాడు. వందల మంది ప్రాణాలను బలిగొన్న ముష్కరుడికి బతికే హక్కు లేదని అన్నాడు. భారత్పై దాడులు చేయాలన్న ఆలోచన వస్తే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలియాలంటే రాణాను జనం సమక్షంలో ఉరికంభం ఎక్కించాల్సిందేనని తేల్చిచెప్పాడు. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల్లో ఏక్నాథ్ ఓంబలే సోదరుడు, అసిస్టెంట్ ఎస్ఐ తుకారాం ఓంబలే కన్నుమూశాడు. ఉగ్రవాది అజ్మల్ కసబ్ను బంధించే ప్రయత్నంలో మృతిచెందాడు. ఆ సమయంలో తుకారాం వద్ద లాఠీ తప్ప ఎలాంటి ఆయుధం లేదు. ఆయినప్పటికీ కసబ్ను ధైర్యంగా అడ్డుకున్నాడు. కోపోద్రిక్తుడైన కసబ్ కాల్పులు జరపడంతో తుకారాం నేలకొరిగాడు. కసబ్ను చాలాసేపు నిలువరించడం వల్లే చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. తుకారాంకు ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. దాడులకు ముందు తాజ్మహల్ సందర్శన ఉగ్రవాది తహవ్వుర్ రాణా ముంబై దాడుల కంటే ముందు భార్యతో కలిసి ఆగ్రాలోని తాజ్మహల్తోపాటు కొచ్చీ, ముంబై నగరాల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించాడు. 2008 నవంబర్ 26న దాడులు జరిగాయి. నవంబర్ 13 నుంచి 21 దాకా రాణా ఇండియాలోనే ఉన్నాడు. అతడు దేశం వదిలివెళ్లిపోయిన ఐదు రోజుల తర్వాత 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. భార్య డాక్టర్ సమ్రజ్ అక్త్తర్తో కలిసి రాణా నవంబర్ 13న ఢిల్లీకి చేరుకున్నాడు. తర్వాత వారు మీరట్, ఘజియాబాద్లోని సమ్రజ్ బంధువుల ఇళ్లకు వెళ్లారు. తర్వాత వేగన్ఆర్ కారులో ఆగ్రాకు చేరుకొని ఓ హోటల్లో బసచేశారు. మరుసటి రోజు తాజ్మహల్ను సందర్శించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగివెళ్లారు. కొచ్చిలో రెండు రోజులు ఉన్నారు. తర్వాత ముంబైలో పోవై హోటల్లో, జలవాయు విహార్ హౌసింగ్ కాంప్లెక్స్లో బస చేశారు. జలవాయు విహార్లో 1971 నాటి యుద్ధ వీరులు నివసిస్తుంటారు. ఈ యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కాంప్లెక్స్ను పేల్చివేయాలని రాణా భావించాడు. కానీ, అక్కడ దాడులకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. నవంబర్ 21న ఇండియా నుంచి వెళ్లిపోయాడు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల కేసులో తహవ్వుర్ రాణాపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ అడ్వొకేట్ నరేంద్ర మాన్ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన నియామకం రాబోయే మూడేళ్లపాటు లేదా కేసు విచారణ పూర్తయ్యేదాకా అమల్లో ఉంటుంది. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేత కోర్టులతోపాటు అప్పిలేట్ కోర్టులో నరేంద్ర మాన్ వాదిస్తారు. దయాన్ కృష్ణన్ కృషి వల్లే.. తహవ్వుర్ రాణాను రప్పించడం వెనుక సీనియర్ లాయర్ దయాన్ కృష్ణన్ కృషి ఎంతో ఉంది. రాణా కేసులో భారత ప్రభుత్వం తరఫున అమెరికా కోర్టుల్లో ఆయన సమర్థంగా వాదనలు వినిపించారు. అమెరికా కోర్టులో రాణాపై విచారణ 2018లో ప్రారంభమైంది. 2023 మే 16న కృష్ణన్ చేసిన వాదనను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్ సెంట్రల్ డి్రస్టిక్ట్ ఆఫ్ కాలిఫోరి్నయా మేజిస్ట్రేట్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. రాణాను ఇండియాకు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారు. రాణాను రప్పించే విషయంలో ఈ తీర్పు కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఒకే కేసులో రెండుసార్లు ఎలా శిక్షిస్తారంటూ రాణా తరఫు న్యాయవాది పాల్ గార్లిక్ క్యూసీ చేసిన వాదనను దయాన్ కృష్ణన్ గట్టిగా తిప్పికొట్టారు. రాణాపై ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐఏ తరఫున వాదించే బృందంలో కృష్ణన్ సైతం చేరబోతున్నట్లు తెలిసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్కు ఆయన సహకరిస్తారు. ఈ బృందంలో అడ్వొకేట్లు సంజీవి శేషాద్రి, శ్రీధర్ కాలే సైతం ఉంటారని సమాచారం. అప్పటి హీరోనే ఇప్పటి ఎన్ఐఏ చీఫ్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సదానంద్ దాతే 26/11 దాడుల సమయంలో ఉగ్రవాదులతో హోరాహోరీగా తలపడ్డారు. అప్పట్లో ఏసీపీగా పని చేస్తున్న సదానంద్ ఆ రోజు రాత్రి ముంబై కామా ఆసుపత్రిలో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్ను 40 నిమిషాలపైగా ఒంటరిగా ఎదుర్కొన్నారు. ముష్కరుల కాల్పుల్లో మిగతా పోలీసులు గాయపడగా, అయన ఒక్కరే ధైర్యంగా ముందడుగు వేశారు. ఎదురు కాల్పులు జరుపుతూ ఆ ఇద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్ పేలి సదానంద్ గాయపడ్డారు. అయినప్పటికీ కాల్పులు ఆపలేదు. 40 నిమిషాలపాటు సమయం చిక్కడంతో చాలామంది ప్రజలు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 26/11 దాడుల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏకు సదానంద్ దాతే 2024 మార్చి నుంచి సారథ్యం వహిస్తున్నారు. 2026 డిసెంబర్ 31దాకా ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. -
ప్రజ్ఞా ఠాకూర్పై వారెంట్ రద్దు
ముంబై: బీజేపీ మాజీ ఎంపీ, మాలెగావ్ పే లుడు కేసులో ప్రధాన ముద్దాయి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ శుక్రవారం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) పెట్టిన చిత్రహింసల వల్లే తన ఆరో గ్యం దెబ్బతిందని చెప్పారు. స్వయంగా ఆమె హాజరుకావడంతో జడ్జి ఏకే లాహోటీ బెయిలబుల్ వారెంట్ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరోసారి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. 2024 జూన్ నుంచి విచారణకు హాజ రు కాకపోవడంతో ఆమెపై అదే ఏడాది నవంబర్లో బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2008 సెపె్టంబర్ 29న మహారాష్ట్రలోని మాలెగావ్ పట్టణంలోని మసీదు వద్ద బైక్కు అమర్చిన బాంబు పేలిన ఘటనలో ఆరుగురు చనిపోగా 100 మంది గాయపడ్డారు. -
‘కాస్గంజ్’ కేసులో 28 మందికి యావజ్జీవం
లక్నో: సంచలనం సృష్టించిన కాస్గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది. మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది. -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్.. భారత్కు రప్పించే ప్రయత్నాలు
ముంబై: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ కదలికలకు సంబంధించి అక్కడి పోలీసులు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో అమెరికా అధికారులు ముంబై పోలీసులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనతో సహా పలు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ (25) ప్రమేయం ఉన్న నేపథ్యంలో అతన్ని భారత్కు వేగంగా రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అతన్ని భారత్కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ.. ముంబై పోలీసులు గత నెలలో ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సల్మాన్ ఖాన్ కేసులో అభియోగాలను ఎదుర్కొనేందుకు అన్మోల్ బిష్ణోయ్ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలనే తమ ఉద్దేశాన్ని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అతడిని భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాలను పోలీసులు వేగవంతం చేశారు.ఇక.. ఇటీవల జరిగిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ బిష్ణోయ్ టచ్లో ఉండటం గమనార్హం. అన్మోల్ బిష్ణోయ్ సోదరుడు గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న విషయం తెలిసిందే.అన్మోల్ బిష్ణోయ్పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్అన్మోల్ బిష్ణోయ్ సంబంధించిన సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ముంబై నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో ప్రమేయం ఉన్నందున కారణంతో అన్మోల్ బిష్ణోయ్ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేర్చింది. -
రామేశ్వరం బ్లాస్ట్ కేసు: NIA ఛార్జ్షీట్లో కీలక విషయాలు!
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జిషీట్ దాఖలు చేసింది. నలుగురిపై అభియోగాలు నమోదు చేసిన ఎన్ఐఏ.. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున బెంగళూరు బీజేపీ ఆఫీస్పై దాడికి యత్నించి విఫలమయ్యారని పేర్కొంది.ఐసిస్ అల్ హింద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ముసవీర్ హుస్సేన్ షాబీబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మజ్ మునీర్, ముజామిల్ షరీఫ్లు ఈ కేసులో నిందితులు. వీళ్లపై ఐపీసీ సెక్షన్లు, యూఏపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. .. వీళ్లు నలుగురు డార్క్ వెబ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్తో కలిసి ఈ నలుగురు భారీ కుట్ర పన్నారు. మార్చి 1వ తేదీన బ్రూక్ఫీల్డ్లోని రామేశ్వరం కేఫ్లో దాడి జరిగింది. మార్చి 3వ తేదీన ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. షాజీబ్ అనే వ్యక్తి కేఫ్లో బాంబ్ పెట్టాడు. తాహా, షాబీజ్ ఇద్దరూ శివమొగ్గ జిల్లాకు చెందిన వాళ్లు. NIA Chargesheets 4 in Rameshwaram Cafe Blast Case pic.twitter.com/BnEBy29Khp— IANS (@ians_india) September 9, 2024 2020లో అల్ హింద్ ఉగ్రసంస్థ మూలాలు బయటపడగానే.. వీళ్లు పరారయ్యారు. వీళ్లు ఉగ్ర మూలాలు ఉన్న మరో ఇద్దరు నిందితులతో డార్క్ వెబ్లో జత చేరారు. టెలిగ్రామ్ ద్వారా వీళ్ల మధ్య సంభాషణలు జరిగాయి. క్రిఫ్టో కరెన్సీలతో వీళ్ల లావాదేవీలు సాగాయి. ఆ డబ్బుతో బెంగళూరులో మరిన్ని దాడులు జరిపి అలజడి సృష్టించాలనుకున్నారు. అయితే..అయోధ్య ప్రాణప్రతిష్ట రోజున( జనవరి 22, 2024) బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై బాంబు దాడి చేయాలని ప్లాన్ గీసుకున్నారు. కానీ, అది ఫలించలేదు. దీంతో రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని ఎన్ఐఏ తెలిపింది. -
ఎన్ఐఏ రిపోర్టు ఏంటి? ఎల్లో మీడియా రాసిన రాతలేంటి?
సాక్షి, శ్రీకాకుళం: విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై హత్యాహత్నం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ఎన్ఐఏ క్షుణ్నంగా విచారణ జరపాలన్నారు. ఈ ఘటనపై ఎల్లో మీడియా అసత్య రాతలు రాస్తోందని బొత్స మండిపడ్డారు. ఒక వ్యక్తే హత్యాహత్నం జరిపించుకున్నాడని రాయడం దారుణమన్నారు. ఎన్ఐఏ రిపోర్టు ఏంటి? మీరు రాసిన రాతలేంటి అని ఫైర్ అయ్యారు. ఎల్లో మీడియా తప్పుడు రాతలు, కూతలను తీవ్రంగా ఖండించారు. '2003లో అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం నిజమేనా? సానుభూతి కోసమే చంద్రబాబు దాడి చేయించుకున్నారా? చంద్రబాబుకు ఉన్నఅలవాట్లు ఎవరికీ ఉండవు. ఈనాడు వార్తలు నీచమైనవి. విశాఖ ఎయిర్పోర్టు ఘటన నిందితుడు, ఆయన పనిచేస్తున్న సంస్థ తెలుగు దేశం మద్దతు దారుడు అవునా? కాదా? రాజకీయ స్వలాభం కోసం, డ్రామాల కోసం చంద్రబాబు మాట్లాడుతారు. నేను కూడా రాజకీయం కోసమే అని మీడియా ముసుగు తీసి రామోజీ రావు చెప్పాలి. 2014లో కూడా రామోజీ రావు ఇలాంటి పనులే చేశారు. దేవుడు అనేవాడు వున్నాడు కాబట్టే మేం గెలిచారు. ఎన్ఐఏ నివేదికలో జగనే దాడి చేయించుకున్నారని చెప్పిందా? ఏ ఆధారాలతో రాస్తారు?' అని బొత్స ధ్వజమెత్తారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై మాట్లాడుతూ.. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం. మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ప్రైవేటికరణ ఆపాలని ఢిల్లీలో మేము పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్, జనసేన చేస్తున్నవి తప్పుడు ప్రచారాలు. రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదు. అందుకే మేమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. భావనపాడు పోర్ట్ను టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది. మేం చేస్తున్న భావనపాడు పోర్ట్ నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటే పుట్టగతులు ఉండవ్.' అని బొత్స హెచ్చరించారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్.. -
గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్ఐఏ దాడులు..
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). దేశవ్యాప్తంగా 70 చోట్ల ఒకేసారి దాడులు చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ-ఎన్సీఆర్, చండీగడ్, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సోదాలు చేపడుతోంది. ఉత్తర భారత్లో ప్రత్యేకించి ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో మాఫియా కార్యకలాపాలు పెరుగుతున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ.. గ్యాంగ్స్టర్లపై రెండు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఒక్క పంజాబ్లోనే 30 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఓ గ్యాంగ్స్టర్పై నమోదైన కేసు విచారణలో భాగంగానే ఎన్ఏఐ ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్లను లక్ష్యంగా చేసుకుని ఇలా సోదాలు నిర్వహించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. కాగా.. దేశంలోని పులు నగరాల్లో గ్యాంగ్స్టర్లు ఉగ్రకార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ వీరిపై ఉక్కుపాదం మోపుతోంది. చదవండి: జైల్లో ఆకస్మిక తనిఖీలు.. భయంతో మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ.. -
ఎన్ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత ఏడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్ గ్రెనేడ్లతో భారీ విధ్వంసానికి కుట్ర పన్ని చిక్కిన లష్కరేతొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్లకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) బదిలీ అయింది. ఈ కేసుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాలు జారీ చేసింది. వీటి ఆధారంగా గత నెల 25న తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు ఎన్ఐఏ డీఎస్పీ రాజీవ్ కుమార్ సింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ తన అధికారిక వెబ్సైట్లో ఈ ఎఫ్ఐఆర్ను ఆదివారం అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ 2న అరెస్టు అయిన ఈ ఉగ్ర త్రయంపై తొలుత సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు ఉగ్రవాదులను సిట్ అధికారులతో పాటు రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలకు చెందిన బృందాలు వివిధ కోణాల్లో విచారించాయి. ఈ కేసులో వెలుగులోకి రావాల్సిన జాతీయ, అంతర్జాతీయ కోణాలు అనేకం ఉన్నాయని నగర పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్లోని రావల్పిండిలో ఉన్న హ్యాండ్లర్స్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్కు సంబంధించిన కీలక వివరాలను దర్యాప్తు చేయాల్సి ఉంది. వీరి నుంచి ఈ త్రయానికి విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆదేశాలు అందాయి. చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు అక్కడ నుంచే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) మీదుగా కాశ్మీర్కు డ్రోన్ల ద్వారా డెడ్ డ్రాప్ విధానంలో చేరాయి. వాటిని అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ వరకు చేర్చిన స్లీపర్సెల్స్ ఓ రహస్య ప్రదేశంలో దాచాయి. అక్కడకు వెళ్లిన సమీయుద్దీన్ నాలుగు గ్రెనేడ్స్ను తీసుకువచ్చారు. ఈ స్లీపర్ సెల్స్ ఎవరనే దాంతో పాటు ఈ ఆపరేషన్లో పాల్గొనాలని భావించిన వాళ్లు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అంశాన్నీ ఆరా తీయాల్సి న అవసరం ఉందని రాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. వీటితో పాటు ఉగ్రవాదుల సంప్రదింపుల మార్గాలు, నగదు లావాదేవీలు గుర్తించడంతో సహా కీలక వివరాలు వెలుగులోకి తేవాల్సి ఉంది. వీటితో పాటు ఈ కేసులో పోలీసులు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద ఆరోపణలు చేర్చా రు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఆ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను కస్టడీకి తీసుకోవడానికి ఎన్ఐఏ అధికారులు కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది. (చదవండి: 300 బస్సులు ఎక్కడ?.. డొక్కు బస్సులే దిక్కా?) -
అంతర్జాతీయ ఉగ్రవాది కుమారుడి అరెస్ట్
శ్రీనగర్: ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి అంతర్జాతీయ ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ కొడుకు షకీల్ యూసఫ్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న షకీల్ను రాంబాగ్లో ఉండగా గురువారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. షకీల్ తన తండ్రి నుంచి ఉగ్రవాద నిధులు అందుకున్నట్లు 2011 ఏప్రిల్లో కేసు నమోదైంది. ఇదే కేసులో సలాహుద్దీన్ పెద్ద కొడుకు షాహిద్ను జూన్లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరు హవాలా మార్గం ద్వారా పాక్ నుంచి సేకరించిన నిధులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు అందించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇదే కేసులో పాక్ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీతోపాటు మహ్మద్ సిద్దిఖి గనాయ్, గులాం జిలానీ లిలూ, ఫరూక్ అహ్మద్ ఇప్పటికే ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. -
పాట్నా పేలుళ్ల కేసులో మరో నిందితుడు అరెస్ట్
పాట్నాలో ఆదివారం వరుస బాంబుపేలుళ్ల ఘటనలో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కొంత పురోగతి సాధించింది. ఆ బాంబు పేలుళ్లకు సంబంధించి మరో నిందితుడిగా అనుమానిస్తున్న తాబిష్ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏకు చెందిన ఉన్నతాధికారి బుధవారం పాట్నాలో వెల్లడించారు. తాబిష్ను మోతీహారి జిల్లాలో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచామని, న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఆ బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వారిలో మహ్మద్ ఇమితియాజ్ అన్సారీ ఇచ్చిన సమాచారం మేరకు తాబిష్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ పేలుళ్ల ప్రధాన సూత్రదారిగా భావిస్తున్న ఇంతియాజ్ను తాబిష్ తరచుగా కలిసేవాడని తమ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఆదివారం పాట్నాలలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హూంకార్ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయం పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు సంభవించింది. అక్కడ అనుమానితుగా ఉన్న ఇంతియాజ్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దర్యాప్తులో ఇంతియాజ్ కీలక సమాచారం అందించాడు. దాంతో ఎన్ఐఏ అధికారులు తాబిష్ను అరెస్ట్ చేశారు. పాట్నాలో చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించారు. మరో 83 మంది తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.