బైక్‌ను ఢీకొట్టిన బొలేరో.. వ్యక్తి మృతి


రాయపర్తి(వరంగల్‌ రూరల్‌):  ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న కుమారస్వామి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

 

ఈ సంఘటన రాయపర్తి శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top