తెలంగాణలో కొత్తగా 1,550 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,221కు చేరింది. సోమవారం ఒక్కరోజే తొమ్మది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే సోమవారం రోజున ఆస్పత్రుల నుంచి 1,197 మంది కోలుకోని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,679కు చేరింది.
కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 365కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12,178 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం 11,525 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 9,975మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లో 926, రంగారెడ్డిలో 212, మేడ్చల్లో 53కేసులు నమోదయ్యాయి.
మరిన్ని వార్తలు