సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్తో పొత్తుపై తమ పార్టీ సీనియర్ల ప్రకటనలతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కంగుతిన్నారు. సీనియర్ నాయకులతో పాటు పార్టీ శ్రేణులు నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఊహించని ఎదురుదాడితో కుదేలైన చంద్రబాబు నష్టనివారణ చర్యల్లో భాగంగా శనివారం రాత్రి తన అనుకూల మీడియాకు లీకులు ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారని, రాజకీయ పొత్తుల అంశాన్ని పొలిట్బ్యూరోలో చర్చించకుండానే పార్టీ నిర్ణయం తీసుకుంటుందా? ఆ మాత్రం సీనియర్ నాయకులకు తెలియదా? అని కోపం ప్రదర్శించినట్లు ‘పచ్చ’ మీడియాలో ప్రచారం ప్రారంభించారు.
కాంగ్రెస్తో పొత్తు లీకులు వచ్చినప్పటి నుంచే పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు సభావేదికపైనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో చనువుగా మెలిగిన తీరు, తాజాగా హైదరాబాద్లో రాహుల్గాంధీతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి కోడలు నారా బ్రాహ్మణి పాల్గొన్నప్పటి నుంచే పార్టీలో అంతర్గత చర్చలు జోరుగానే సాగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు, ఎన్టీఆర్ను అభిమానించే శ్రేణులు చంద్రబాబు చర్యలను జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన తెలిపారు. పార్టీలో అన్ని స్థాయిల్లోని వ్యతిరేకతను గుర్తించినందునే కేఈ, అయ్యన్న.. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించారని తెలిపారు. పొలిట్బ్యూరో సభ్యులుగా దశాబ్దాల అనుభవమున్న వారే బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారంటే క్షేత్రస్థాయిలోని క్యాడర్ ఇంకెంతగా రగిలిపోతున్నారో తెలియందికాదు అంటూ ఆయన విశ్లేషించారు.
నిఘా వర్గాల హెచ్చరికలతో...
రాహుల్ను బ్రాహ్మణి కలసినప్పటి నుంచే చంద్రబాబు ఉద్దేశంపై పార్టీ నాయకులు, శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్తో ఆరో పెళ్లికి చంద్రబాబు సిద్ధమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడంతో టీడీపీ శ్రేణులకు ఆ విషయం మరింత రూఢీ అయ్యింది. దీనిపై పార్టీ గానీ, సీనియర్లు గానీ పెదవి విప్పకపోవడంతో కాంగ్రెస్తో కలసి పయనించక తప్పని పరిస్థితులు రానున్నాయని గుర్తించిన సీనియర్లు, కార్యకర్తలు భగ్గుమంటున్నారని నిఘా వర్గాలు చంద్రబాబుకు తాజాగా నివేదించాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని మళ్లీ అదే పార్టీతో కలపడాన్ని నాయకులు, క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారని వివరించాయి. ఈ పరిస్థితులకు తోడు కేఈ, అయ్యన్నల వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్లు అయ్యిందని చెప్పాయి. దీంతో ఇంకెవరినీ మాట్లాడకుండా చేయడానికే కేఈ, అయ్యన్నలపై బాబు సీరియస్ అయ్యారనే వార్తలను అనుకూల మీడియా ద్వారా ప్రసారం చేయిస్తున్నారని విమర్శలు వచ్చాయి.
పొలిట్బ్యూరోకు అన్నీ చెప్పే చేస్తున్నారా?
పొత్తులపై టీడీపీ పొలిట్బ్యూరోలో నిర్ణయం తీసుకుంటారని సీనియర్ మంత్రులకు తెలియకపోతే ఎలా అని సీఎం ప్రశ్నించారనే వార్తలపై టీడీపీ శ్రేణులే భగ్గుమంటున్నాయి. అసలు ఈ నాలుగున్నరేళ్లలో పొలిట్బ్యూరో కూర్చుని చర్చించిన ప్రధానాంశాలు ఏమి ఉన్నాయని కృష్ణా జిల్లాకు చెందిన ఓ నేత ప్రశ్నిస్తున్నారు. రాహుల్ కార్యక్రమానికి బ్రాహ్మణి వెళ్లడం గురించి కనీసం పార్టీలోని కొందరు ముఖ్యులకైనా తెలిసిందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కోట్లు కుమ్మరించి కొనుగోలు చేయడంపై పొలిట్బ్యూరోలో చర్చించారా? వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం గురించి ముఖ్యులతో మాట్లాడారా? రాజ్యసభ సీట్లకు అభ్యర్థుల ఎంపిక గురించి సంప్రదించారా? అసలు పార్టీ, ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా సరే పొలిట్బ్యూరో ముందుకు తీసుకొస్తున్నారా? అని సీనియర్ల అంతర్గత చర్చల్లో ప్రస్తావనకు వస్తున్నాయని గుంటూరు జిల్లాకు చెందిన మరోనేత ప్రశ్నించారు.
తమ్ముళ్ల తిరుగుబాటుతో కంగుతిన్న బాబు
Published Sat, Aug 25 2018 3:58 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement