గచ్చిబౌలి : భార్య, కొడుకును నరికి చంపిన వ్యక్తి
సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. గోపన్పల్లి ఎన్టీఆర్ నగర్లో ఓ వ్యక్తి భార్యను, రెండేళ్ల కొడుకును నరికి చంపేశాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వీరిది కర్ణాటకలోని హుబ్బలి ప్రాంతం. నిందితుడి పేరు చిన్నా, భార్య పేరు మాధవిగా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కాగా, కుటుంబ కలహాలతోనే చిన్నా ఈ హత్యలు చేసినట్టు భావిస్తున్నారు.