పెందుర్తి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దగాకోరు పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పవిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ద్వజమెత్తారు. పెందుర్తిలో బుధవారం జరిగిన పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చంద్రబాబు ప్రజల ముందు దోషిగా నిలబడ్డారన్నారు. అతని అవినీతిని అడుగడుగునా నిలదీస్తున్నందునే ప్రతిపక్షం లేకుండా చేద్దామన్న కుట్రతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని అన్నారు. ఒక్క పైసా రుణం కూడా కట్టవద్దని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు తాను అలా అనలేదని బుకాయించడమే కాకుండా.. రైతులకు అంత అత్యాశ ఉండకూడదని హేళన చేయడం దుర్మార్గమన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ 5 నెలలుగా ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదన్నారు.
గ్రామాల్లో సర్పంచ్ వ్యవస్థను అపహాస్యం చేస్తూ కిరికిరిలు పెట్టే జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ధర్మాన అన్నారు. చంద్రబాబు, అతడి కొడుకు వందల కోట్లు కూడబెడుతుంటే.. స్థానికంగా జన్మభూమి కమిటీల సభ్యులు చిల్లర వ్యవహారాలు చక్కబెడుతున్నారన్నారు. మొత్తానికి అధికార టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు. సంస్కారం లేని వ్యక్తులను గుర్తించి అందులో ఒకటో నెంబర్గా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడిని చంద్రబాబు ప్రతిపక్షం మీదకి ఉసిగొల్పారన్నారు. అవాకులు చెవాకులు పేలడం తప్ప అచ్చెన్నాయుడికి మట్లాడటం చేతకాదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని అడ్డుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడై జగన్మోహాన్రెడ్డికి అండగా ఉండాలని ఉద్బోధించారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. మహానేత వై.ఎస్ రాజశేఖర్రెడ్డి భావజాలం నుంచి పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ భావజాలాన్ని తమలో ఇముడ్చుకోవాలని సూచించారు. త్వరలో మంచి రోజులు రానున్నందున కార్యకర్తలు మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటిం చా రు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్ల బాబూరావు, అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, జాన్వెస్లీ, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్రాజ్, తిప్పల నాగిరెడ్డి, కర్రి సీతారాం, కోలా గురువులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.భగవాన్జయరామ్, సీపీసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గొర్లె రామునాయుడు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో దగాకోరు పాలన
Published Wed, Mar 16 2016 11:31 PM
Advertisement
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
సూర్యప్రభ వాహనంపై గోవిందుడు
బడి బస్.. ఫిట్నెస్
పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు
కౌంటింగ్కు పటిష్టంగా భద్రత
No Headline
ఇంటర్ మ్యాథ్స్–బి, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
తత్కాల్ ఫార్మ్స్పై నంబర్లు వేసి ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో సిరికల్చర్ ఉద్యోగి మృతి
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
తప్పక చదవండి
- టీమిండియా హెడ్కోచ్గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
- Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
- సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement