క్రికెట్‌ బెట్టింగ్‌ వల్లే జసిత్‌ కిడ్నాప్‌!

Police Suspects Jashith Relatives In Kidnap Case In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి(కాకినాడ) : మండపేటలో బ్యాంకు ఉద్యోగుల కుమారుడు జసిత్‌ కిడ్నాప్‌  క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంలోనే సాగిందని ఎస్పీ అద్నాన్‌ నయిమ్‌ అస్మీ తెలిపారు. ఆయన ఆదివారం తమ కార్యాలయంలో ఆ వివరాలను విలేకరులకు తెలియజేశారు. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరుల ప్రశ్నకు పైమేరకు సమాధానమిచ్చారు. 17 మంది బుకీలు ఈ కిడ్నాప్‌ సంఘటనలో ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో బాలుడి బంధువులు కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని ఎస్పీ తెలిపారు. బాలుడిని మూడు రోజుల పాటు దాచేందుకు ఉపయోగించిన స్థలాలను నిర్థారించామన్నారు. 

చదవండి: సిత్‌ను కిడ్నాప్‌ చేసింది ఎవరు?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top