అందుకే ఆ డ్రామాలు.. | Minister Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే సీఎం లక్ష్యం..

Jan 13 2020 1:40 PM | Updated on Jan 13 2020 1:49 PM

Minister Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు: గత ఐదేళ్లుగా ప్రజలకు చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో భూములను దోపిడీ చేసిన చంద్రబాబు.. ఆ భూములను కాపాడుకోవడానికి జోలె పట్టి బిక్షాటన డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ విషయంలో జరిగిన తప్పు వలన రాష్ట్రంలో ఏ పట్టణం అభివృద్ధి చెందలేదని..మళ్లీ ఇప్పుడు అదే తప్పు  చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో వికేంద్రీకరణ చేపడుతున్నారని వెల్లడించారు. రాజధానిలో 10 గ్రామాల్లో ప్రజలను టీడీపీ నేతలు రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. అందుకే వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement