నందిగామలో కంపించిన భూమి | earthquake strikes nandigama in Krishna District | Sakshi
Sakshi News home page

నందిగామలో కంపించిన భూమి

Aug 17 2014 9:20 AM | Updated on Sep 2 2017 12:01 PM

కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. నందిగామ సమీపంలో భూప్రకంపనలు సంభవించాయి.

నందిగామ: కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. నందిగామ సమీపంలో భూప్రకంపనలు సంభవించాయి. రైతుపేట ప్రాంతంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించండంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురైయారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగుతీశారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం లేదు.

కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించే అవకాశముందని భూభౌతిక శాస్త్రవేత్తలు గతంలోనే తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ లో ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ చుట్టుపక్కల భూప్రకంపనలు సంభవించడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement