ఏపీలో కొత్తగా 570 కరోనా కేసులు | 570 New Coronavirus Positive Cases In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 570 కరోనా కేసులు

Jun 26 2020 2:10 PM | Updated on Jun 26 2020 2:40 PM

570 New Coronavirus Positive Cases In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కొత్తగా 570 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,489కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 22,305 శాంపిల్స్‌ను పరీక్షించగా 570 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కర్నూల్‌, కృష్ణలలో నలుగురు చొప్పున, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడగా.. 191మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 7,91,624 శాంపిల్స్‌ పరీక్షించగా ఆంధ్రప్రదేశ్‌నుంచి 9353, ఇతర రాష్ట్రాల నుంచి 1764, ఇతర దేశాల నుంచి వచ్చిన 372 మందికి కరోనా నిర్థారణ అయింది.

చదవండి : భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement