ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం

Jul 8 2025 5:08 AM | Updated on Jul 8 2025 5:08 AM

ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం

ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం

కడప అర్బన్‌ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చిన ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్‌ కుమార్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక‘ ( పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సిస్టం ) కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీసు సిబ్బంది ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో డి.టి.సి. డీఎస్పీ అబ్దుల్‌ కరీం, మహిళా పోలీసు స్టేషన్‌ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ఈ.జి .అశోక్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement