
● ప్రస్తుతం కురుస్తున్న వానతో..
ప్రస్తుతం కురుస్తున్న వానలను రైతులు సద్వినియోగం చేసుకుని మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవాలి. ముఖ్యంగా దుక్కులను లోతుగా, వాలుగా, అడ్డంగా దున్నుకోవాలి. వాలు, అడ్డం దున్నడం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. భూమి కూడా ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికి రాగానే.. పంట నుంచి వచ్చే ఎండు ఆకులు, చెత్తా చెదారం కాల్చివేయకుండా అలాగే వదిలేసి ఉంటారు. ఈ వర్షంతో లోతు దుక్కులు చేయడంతో నేలల్లో కలిసి పోయి ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. లోతు దుక్కలు చేయడం వల్ల కలుపు నివారణ మొక్కలు కూడా నశించిపోతాయి.