రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత కడప | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత కడప

Jun 6 2025 6:09 AM | Updated on Jun 6 2025 6:09 AM

రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత క

రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత క

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్‌ టోర్నమెంట్‌లో వైఎస్సార్‌ కడప జిల్లా జట్టు విజయం సాధించినట్లు కడప జర్నలిస్టు టీం మేనేజర్‌ భూమిరెడ్డి శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు. గుంటూరు పోలీసు గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చిత్తూరు జట్టుపై భారీ విజయం సాధించి కప్పును కై వసం చేసుకుందన్నారు. నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జట్ల పైన విజయం సాధించారన్నారు. కడప టీం సభ్యుడు పఠాన్‌ సెంచరీ సాధించడంతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచారు. ఈ విజయం సాధించడం పట్ల కెప్టెన్‌ రామసుబ్బారెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్‌ హర్హం వ్యక్తం చేశారు. కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి విజేతలకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement