
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
కడప అర్బన్ : డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని.. సమష్టి కృషితో డ్రగ్స్ను పారదోలుదామని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ’ఈగల్’ (ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించే పోస్టర్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ ప్రత్యేక వ్యవస్థ పై ప్రజలకు, యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఈ టాస్క్ఫోర్స్ విభాగం ఉంటుందన్నారు. ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా, సాగు, విక్రయాలు, వినియోగం, తదితరాల గురించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టాస్క్ ఫోర్స్ నోడల్ ఇన్చార్జి ఆఫీసర్, ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎం.డి. రియాజ్ అహమ్మద్, సైబర్ సెల్ సి.ఐ. నాగరాజు, డీసీఆర్బీ ఎస్.ఐ. బీవీ క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్