రానున్న కాలంలో రాష్ట్రమంతా జగన్‌ అడ్డానే | - | Sakshi
Sakshi News home page

రానున్న కాలంలో రాష్ట్రమంతా జగన్‌ అడ్డానే

Jun 3 2025 5:49 AM | Updated on Jun 3 2025 5:49 AM

రానున్న కాలంలో రాష్ట్రమంతా జగన్‌ అడ్డానే

రానున్న కాలంలో రాష్ట్రమంతా జగన్‌ అడ్డానే

జమ్మలమడుగు : రాబోయే ఎన్నికల తర్వాత కడప సహా రాష్ట్రమంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డాగా మారబోతోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించి ఇచ్చిన ప్రతి హామీని అమలు పరచిన ఏకై న నాయకుడుగా చరిత్ర కెక్కారన్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలతోపాటు 143 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఇంతవరకు ఒక్కటి కూడా అమలు పరచలేక ఘోరంగా విఫలమైందన్నారు. మహానాడులో పరస్పరం పొగుడుకుంటూ కాలయాపన చేశారే తప్ప ప్రజలకు సూపర్‌ సిక్స్‌ పథకాల హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేదన్నారు. నారా లోకేష్‌ యువగళం పేరుతో పెద్దముడియం మండలంలో పర్యటించిన సమయంలో రాజోళి ముంపు వాసులకు రూ.12 లక్షలు కాకుండా రూ.24 లక్షలు ఎకరాకు ఇస్తామని ప్రకటించారన్నారు. ఇంత వరకు దాని ఊసే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అలాగే దాల్మియా పరిశ్రమ ద్వారా ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం ఇప్పించడంతోపాటు వారి భూములను సైతం కొనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు లక్షుమయ్య, కౌన్సిలర్‌ పోచిరెడ్డి, బడిగించల జనార్దన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement