
క్యారమ్ టోర్నమెంట్కు విశేష స్పందన
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా స్థాయి క్యారమ్ టోర్నమెంట్కు విశేష స్పందన లభించింది. కడపలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ కేటగిరీల్లో 50 మంది క్యారమ్స్ ఆటగాళ్లు పాల్గొన్నారు. అండర్ 9 ఇయర్స్ బాలురలో గోకుల్, మహేశ్వర్ జాయింట్ విన్నర్స్గా, రిషి రన్నర్గా నిలిచారు. అండర్ 11 బాయ్స్లో చరణ్సాయి విన్నర్గా, అడనాన్ రన్నర్గా, అండర్ 14 బాయ్స్లో కేఎల్ రంగనాథ్, చరణ్సాయి, బాలికల విభాగంలో షణ్ముఖప్రియ విన్నర్గా, ధరణి రన్నర్గా గెలుపొందారు. సీనియర్స్ మెన్ విభాగంలో నాగేంద్ర విన్నర్గా, మస్తాన్వల్లి రన్నర్గా నిలిచారు. ఎంపికై న వారు రాబోయే రోజుల్లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారు. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా సీనియర్ క్యారమ్స్ క్రీడాకారుడు, ఏపీఎస్పీడీసీఎల్ రిటైర్డ్ ఏఈ నాగభూషణం క్రీడాకారులకు సర్టిఫికెట్, మెమెంటోలు అందజేశారు. ప్రతి ఆదివారం ఇండోర్, డీఎస్ఏలో క్యారమ్ ఆటపై ఉచిత కోచింగ్ ఇస్తామని టోర్నమెంట్ ఆర్గనైజయింగ్ సెక్రటరీ పోలంకి గణేష్బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ రెఫరీ సురె క్రిష్ణయ్య, కోచ్లు నాగేంద్ర, సాగర్, ఫిజికల్ డైరెక్టర్స్ పాల్గొన్నారు.